Political News

లోకేష్ తో సెల్ఫీకి పోటీపడుతున్న యువత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఎక్కడికెళ్లినా జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. లోకేష్ ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ క్షేమ సమాచారాలు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు.జగన్ పాలనలో రాష్ట్రం ఎలా అథోగతి పాలైందో వివరిస్తున్నారు.

జగన్ మోసపు రెడ్డి

లోకేష్ ఇప్పుడు పంచ్ డైలాగులు వదులుతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పేరు మార్చేసి జగన్ మోసపు రెడ్డి అని పెట్టేశారు. పేద, బడుగు, మధ్య తరగతి వర్గాలను ఎలా మోసగించారో వివరిస్తున్నారు. వైసీపీ వారి వైనాట్ 175 నినాదంపై కూడా లోకేష్ విమర్శలు గుప్పిస్తున్నారు. వైనాట్ వేతనాలు పెన్షన్లు, వైనాట్ స్కాలర్ ఫిపులు, వైనాట్ రోడ్లు ఇలా చెప్పుకుంటే బావుంటుందని లోకేష్ ప్రస్తావిస్తున్నారు.

అభిమానులతో సెల్ఫీలు

లోకేష్ బస చేసే క్యాంపు సైట్ నుంచి ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన పాదయాత్రకు బయలుదేరుతున్నారు. అంత కంటే ముందు తనను కలిసేందుకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలతో ఆయన సెల్ఫీలు దిగుతున్నారు. బుధవారం ఉదయం దిగువమాసపల్లి క్యాంప్ సైట్ దగ్గర సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం జరిగింది. దాదాపు వెయ్యి మంది వచ్చి ఆయనతో సెల్ఫీలు దిగారు. ఇలా ప్రతీరోజు వెయ్యి మందికి పైగా వస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చిన వారిలో యువకులే ఎక్కువగా ఉండటం విశేషం. యువనేత ఆపాయ్యంగా పలుకరించడం, తానే సెల్ ఫోన్ పట్టుకుని ఫోటోలు తీయడంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ కు జనంలో పెరుగుతున్న ఆదరణకు ఇదో నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి…

This post was last modified on February 8, 2023 11:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

10 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago