ఢిల్లీ లిక్కర స్కాం విచారణ వేగవంతమైంది. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల మధ్య ఆయన్ను అరెస్టుచేశారు. సీబీఐ ఎంతో పకడ్బందీగా వ్యవహరించి బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది. తొలుుత విచారణ నిమిత్తం ఢిల్లీ పిలిపించింది. రోజంతా ప్రశ్నించింది. రాత్రి తమ కార్యాలయంలోనే ఉంచారు. బుధవారం ఉదయం అరెస్టును ప్రకటించారు..
ఢిల్లీ మద్యం కుంభకోణంపై రెండు కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ ఈ దిశగా వేగం పెంచాయి. ఈ స్కామ్ లో భాగస్వాములుగా అనుమానిస్తున్న కవిత, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్ చంద్రారెడ్డి సహా పలువురిని సౌత్ గ్రూపుగా పిలుస్తున్నారు. గత వారం ఈడీ రెండో ఛార్జ్ షీటును ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేసింది. 428 పేజీల ఛార్జ్ షీటులో ఎమ్మెల్సీ కవిత పేరు రెండో సారి కనిపించింది. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా చేర్చారు. ఈడీ ఛార్జ్ షీటు ప్రకారం 17 మంది నిందితులున్నారు.
కవిత పై నజర్
కవితను సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి మరీ ప్రశ్నించి వెళ్లారు. ప్రస్తుతానికి ఆమె అనుమానితురాలిగానే ఉన్నారు. ఇంకా నిందితురాలిగా చేర్చలేదు. అలా జరగాలంటే సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులిచ్చి ప్రశ్నించాలి. చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబు అరెస్టుతో కవిత చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుంటోందన్న వాదన వినిపిస్తోంది. ఆయన నుంచి సేకరించే సమాచారం ఆధారంగా కవితపై బలమైన సాక్ష్యాధారాలను సిద్ధం చేయాలని సీబీఐ భావిస్తోంది.
This post was last modified on February 8, 2023 10:16 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…