వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. త్వరలోనే ముఖ్యమంత్రి కానున్నారని.. తెలంగాణ మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అయితే.. ఆమె సీఎం అయ్యేది తెలంగాణకు కాదని.. ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని చమత్కరించారు. ఎందుకంటే.. ఆమె అన్న.. ఏపీ సీఎం జగన్ త్వరలోనే జైలు యాత్ర చేయనున్నారని.. దుయ్యబట్టారు. ఈ క్రమంలో సీఎం సీటును ఆమెకు ఇస్తారని.. ఇవ్వకపోయినా.. ఆమె ఆక్రమించుకుంటారని వ్యాఖ్యానించారు.
కడియం చేసిన ఈ హాట్ కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. షర్మిల చేపట్టిన పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. ఆమె ఏ ప్రాంతంలో పాదయాత్ర చేపట్టినా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి.. షర్మిల చేసిన కామెంట్స్ కు కౌంటర్ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి తెలంగాణకు వ్యతిరేకంగానే ఉందన్నారు.
సమైక్యాంధ్రే తమ నినాదం అని ఊరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని ఈ సందర్భంగా కడియం గుర్తు చేశారు. అంతేకాదు.. పార్లమెంటులో జగన్ ప్లకార్డు పట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన విషయాలను కూడా శ్రీహరి ప్రస్తావించారు. ఇక, రాజకీయంగా షర్మిలకు అన్యాయం జరిగిందన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల, విజయమ్మలు పాదయాత్రలు చేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని తెలిపారు.
అయితే, వారి కష్టాన్ని మరిచిపోయి.. తల్లీ, చెల్లికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశారు. “మీకష్టంతో అధికారంలోకి వచ్చి మీకు అన్యాయం చేశారు. షర్మిల ఆంధ్రాకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకోవాలి. రేపో మాపో సీబీఐ కేసులోనో, వివేకానందరెడ్డి హత్య కేసులోనో వైఎస్ జగన్ జైలుకు పోతే షర్మిలకు సీఎం అయ్యే అవకాశం వస్తుంది. అనవసరంగా తెలంగాణలో తిరిగి సమయాన్ని వృధా చేసుకోకు. షర్మిలకు తెలంగాణలో తిరిగే నైతికత లేదు. ఏపీలో జగన్ గ్రాఫ్ పడిపోతోంది” అని కడియం వ్యాఖ్యానించారు.v
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…
ఈ రోజు జనసేన తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ పోలీసులు, హైకోర్టు…
దర్శకుడు గుణశేఖర్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడేదో ఫ్లాపుల్లో ఉన్నారు కానీ ఒక్కడు, చూడాలని ఉంది, రామాయణం, సొగసు…