Political News

అప్పుడే నాలుగు కేసులు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర 11వ రోజుకు చేరుకుంది.మహిళలు, దళితులు, బీసీలు, యువకులు పెద్ద సంఖ్యలో యాత్రకు తరలి వస్తున్నారు. యాత్రను ఏదో విధంగా ఆపాలని ప్రయత్నించి, ప్రజా వ్యతిరేకతకు భయపడి వెనక్కి తగ్గిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కేసులతో వేధించేందుకు ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ప్రారంభించి 11 రోజులే అయ్యింది. సగటున రోజుకు పది కిలోమీటర్ల చొప్పున 110 కిలోమీటర్ల టార్గెట్‌ను దాటిపోయి అప్పుడే 143 కిలోమీటర్లకు లోకేష్ చేరుకున్నారు..

లోకేష్‌ యాత్రపై వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కేసులు పెట్టింది. ఆరు వాహనాలను సీజ్ చేసింది. చివరకు పాదయాత్రలో పాల్గొన్న కొంతమంది పై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. నేతల పై నాన్ బెయిలబుల్ సెక్షన్ లు కూడా నమోదయ్యాయి. పాదయాత్ర పొడవునా పోలీసుల నిఘా నేత్రం పనిచేస్తోంది. పాదయాత్రలోకి మఫ్టీలో ఉన్న నిఘా విభాగం అధికారులు ప్రవేశించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు అధికార పార్టీ లో కలవరానికి కారణమవుతోంది.

జనవరి 27న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అంతర్గతంగా తాడేపల్లి ప్యాలెస్‌లో చర్చ జరుగుతూనే ఉంది. కుప్పం , పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలను యాత్ర దాటుతుంటే జగన్ గుండెల్లో లబ్ డబ్ అని సౌండ్ వస్తోందంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.. పాదయాత్ర ప్రారంభమైన కుప్పంలో నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసులను అసభ్యంగా దూషించారని తొలిరోజే కేసు నమోదు చేశారు. ఆ తరువాత, బంగారుపాలెంలో మరో రెండు ఎఫ్‌ఐఆర్‌ లు నమోదు చేశారు. ఇందులో ఒక ఎఫ్‌ఐఆర్‌ లో హత్యాయత్నం సెక్షన్ లు కూడా నమోదయ్యాయి. పలమనేరులో మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. బంగారుపాలెంలో ఫిబ్రవరి 3వ తేదీన రెండు కేసులు, పలమనేరులో 4వ తేదీన మరో కేసు నమోదు చేశారు. పైగా డైరెక్టుగా పోలీసులే కేసులు నమోదు చేశారు.

ఎన్ని వందల కేసులు పెట్టినా యాత్ర ఆగదని, ఇచ్ఛాపురం దాకా జైత్ర యాత్ర కొనసాగుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పాదయాత్రను మరింత పకడ్బందీగా నిర్వహిస్తూ సాయంత్రం ఆరు గంటల కల్లా ముగించే విధంగా ప్లాన్ చేయబోతున్నారు..

This post was last modified on February 6, 2023 7:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

1 hour ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago