తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర 11వ రోజుకు చేరుకుంది.మహిళలు, దళితులు, బీసీలు, యువకులు పెద్ద సంఖ్యలో యాత్రకు తరలి వస్తున్నారు. యాత్రను ఏదో విధంగా ఆపాలని ప్రయత్నించి, ప్రజా వ్యతిరేకతకు భయపడి వెనక్కి తగ్గిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కేసులతో వేధించేందుకు ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ప్రారంభించి 11 రోజులే అయ్యింది. సగటున రోజుకు పది కిలోమీటర్ల చొప్పున 110 కిలోమీటర్ల టార్గెట్ను దాటిపోయి అప్పుడే 143 కిలోమీటర్లకు లోకేష్ చేరుకున్నారు..
లోకేష్ యాత్రపై వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కేసులు పెట్టింది. ఆరు వాహనాలను సీజ్ చేసింది. చివరకు పాదయాత్రలో పాల్గొన్న కొంతమంది పై హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. నేతల పై నాన్ బెయిలబుల్ సెక్షన్ లు కూడా నమోదయ్యాయి. పాదయాత్ర పొడవునా పోలీసుల నిఘా నేత్రం పనిచేస్తోంది. పాదయాత్రలోకి మఫ్టీలో ఉన్న నిఘా విభాగం అధికారులు ప్రవేశించి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సమాచారం అందిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న ఆదరణ ఇప్పుడు అధికార పార్టీ లో కలవరానికి కారణమవుతోంది.
జనవరి 27న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి అంతర్గతంగా తాడేపల్లి ప్యాలెస్లో చర్చ జరుగుతూనే ఉంది. కుప్పం , పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గాలను యాత్ర దాటుతుంటే జగన్ గుండెల్లో లబ్ డబ్ అని సౌండ్ వస్తోందంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.. పాదయాత్ర ప్రారంభమైన కుప్పంలో నిబంధనలు ఉల్లంఘించారని, పోలీసులను అసభ్యంగా దూషించారని తొలిరోజే కేసు నమోదు చేశారు. ఆ తరువాత, బంగారుపాలెంలో మరో రెండు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఇందులో ఒక ఎఫ్ఐఆర్ లో హత్యాయత్నం సెక్షన్ లు కూడా నమోదయ్యాయి. పలమనేరులో మరో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. బంగారుపాలెంలో ఫిబ్రవరి 3వ తేదీన రెండు కేసులు, పలమనేరులో 4వ తేదీన మరో కేసు నమోదు చేశారు. పైగా డైరెక్టుగా పోలీసులే కేసులు నమోదు చేశారు.
ఎన్ని వందల కేసులు పెట్టినా యాత్ర ఆగదని, ఇచ్ఛాపురం దాకా జైత్ర యాత్ర కొనసాగుతుందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. పాదయాత్రను మరింత పకడ్బందీగా నిర్వహిస్తూ సాయంత్రం ఆరు గంటల కల్లా ముగించే విధంగా ప్లాన్ చేయబోతున్నారు..
This post was last modified on February 6, 2023 7:35 pm
రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…
మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…
దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత…
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…