ఏపీ అధికారపక్షానికి టైం బాగున్నట్లుగా లేదు. వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే రెండు షాకింగ్ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది.
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక దళిత యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. శిరోముండనం చేసిన తీరు సంచలనంగా మారింది. దీనిపై విపక్షాలు మొదలు దళిత నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
చివరకు సీఎం జగన్ సైతం స్పందించి.. సీరియస్ అయ్యారు. బాధ్యులైన పోలీసులపై చర్యలకు ఆదేశించారు. ఇదిలా ఉంటే ఈ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. పార్టీ ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా తెలుస్తోంది.
ఏపీ అధికార పక్షానికి చెందిన పలువురు నేతలకు ఇప్పటికే పాజిటివ్ తేలగా.. జగన్ కు.. విజయసాయికి సన్నిహితంగా ఉండే అంబటికి పాజిటివ్ కావటంతో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింత జాగ్రత్తగా ఉండాలని కోరుకుతున్నారు.
This post was last modified on July 24, 2020 8:01 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…