Political News

తారకరత్న విషయంలో ఏం జరిగింది? వైద్యులు ఏం చెబుతున్నారు?

అప్పటిదాకా బాగానే ఉంటారు. అంతలోనే అనారోగ్యం బారిన పడతారు. ఆ వెంటనే ప్రాణాలు పోయేంత అపాయం చెంతకు చేరుతారు. ఇటీవల కాలంలో తరచూ వింటున్న.. చూస్తున్న షాకింగ్ ఉదంతాలు ఏం చెబుతున్నాయి? అన్నది అసలు ప్రశ్న. తాజాగా తారక రత్న విషయంలోనూ అదే జరిగింది. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు తన సంఘీభావాన్ని తెలుపుతూ కుప్పం చేరుకున్న తారకరత్న.. అప్పటివరకు హుషారుగా ఉంటూనే ఒక్కసారి కుప్పకూలటం తెలిసిందే.

అలా ఎలా జరుగుతుంది? ఒక్కసారిగా అలా జరిగిపోతుందా? అన్న సందేహాన్ని కొందరు వైద్యులతో మాట్లాడినప్పుడు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. తారకరత్న విషయానికే వస్తే.. ఉదయం లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయం వద్దకు చేరుకున్న తారకరత్నను చూసేందుకు.. అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అప్పుడే ఆయన కాస్తంత అసౌకర్యానికి గురయ్యారు. ఆ తర్వాత లక్ష్మీపురంలోని మసీదు వద్దకు వెళ్లినప్పుడు కూడా తారకరత్న అసౌకర్యానికి గురయ్యారు. పాదయాత్ర మొదలు కావటానికి కాస్తంత ముందుగా.. సుమారు మధ్యాహ్నం 12 గంటల వేళలో ఒక్కసారిగా కుప్పకూలారు.

ఈ వరుస క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఉదయం గుడికి వెళ్లిన సమయం నుంచి అనీజీగా ఉండటం.. అసౌకర్యానికి గురి కావటం కనిపిస్తుంది. అంటే.. శరీరం ఇచ్చే సంకేతాల్ని తారకరత్న అర్థం చేసుకునే విషయంలో పొరపాటు పడి ఉండాలి. లేదంటే.. పట్టించుకోకుండా ఉండాలి. అలా గుర్తించటం ఎలా సాధ్యమవుతుందన్న మాట చాలామంది నోటి నుంచి వస్తుంటుంది. జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే విషయం ఏమంటే.. శరీరంలోని ఏ బాగమైనా సరే.. రోజువారీకి భిన్నంగా ఉండి ఉంటే.. కాస్తంత ఆలోచించాల్సిన అవసరం ఉంది.

కరోనా తర్వాత ఈ తరహా సడన్ గుండెపోట్లు ఎక్కువ అయ్యాయి. దీనికి కారణం ఫలానా అన్న విషయాన్ని ఎవరూ చెప్పటం లేదు. కొందరు చేస్తున్న ప్రచారాలకు శాస్త్రీయత లేదు. అలాంటి వేళలో.. మనకున్న ఏకైక మార్గం జాగ్రత్తగా ఉండటం. అలా అని అనవసరమైన ఆందోళనలు కూడా సరికాదు. అంటే.. మరీ ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందకుండా.. అలా అని అవసరానికి స్పందించకుండా ఉండకుండా.. బాడీ చెప్పే మాటను ఎప్పటికప్పుడు వినాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆరోగ్యంగా ఉండే వీలుంది.

తారకరత్న విషయానికే వస్తే.. ఆయన్ను చూసినప్పుడు ఇట్టే అర్థమయ్యే విషయం ఏమంటే.. శుక్రవారం ఉదయం నుంచి అతడు అసౌకర్యంగా ఉన్నారు. అలాంటి వేళలో మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ.. పట్టించుకోకపోవటం పెద్ద సమస్యకు దారి తీసింది. మనిషి ప్రాణానికి ముప్పుగా వాటిల్లే ముఖ్యమైన రెండు శరీర భాగాల్లో ఒకటి మొదడు అయితే రెడోది గుండె. ఈ రెండింటి విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఆ సందేశాల్ని శరీరం వెంటనే చెప్పేస్తుంది. అయితే.. ఆ సందర్భంగా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ఎవరికి వారుగా ఉండాలి.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. కొంతమంది గుండె పట్టేసిందంటారు. కానీ.. అది గ్యాస్ (అజీర్ణం) కారణంగా వచ్చేదైతే.. ఛాతీ పట్టేసినట్లు ఉంటుంది. దానికి గుండెనొప్పికి తేడా ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. దీనికి సులువైన మార్గం ఒకటి ఉంది. సైంటిఫిక్ గా కాకుండా ఎవరికి వారు తమకు తాముగా తమ శరీరాన్ని ట్రాక్ చేసే పద్దతి ఒకటుంది. అదేమంటే.. ఏదైనా అసౌకర్యం చోటు చేసుకుంటే.. గడిచిన 24 గంటల్లో తీసుకున్న ఆహారం ఏమిటన్న దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే సమాధానం వస్తుంది. తిన్న ఆహారంలో ఎలాంటి ఇబ్బంది లేకున్నా.. శరీరంలోని ఏదైనా అవయువం ఇబ్బంది పడుతుంటే.. వెంటనే వైద్య సలహా తీసుకోవటం అవసరం.

మొత్తంగా చూసినప్పుడు.. శరీరం పంపే సంకేతాల్ని జాగ్రత్తగా గుర్తించటం.. అది చెప్పే మాటల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరిగితే.. చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే వీలు ఉంటుంది. అనుకోని రీతిలో అపాయాల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నది మర్చిపోకూడదు. అందుకే.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Satya

Recent Posts

సింగ్ గీతం… జస్ట్ ఒక్క రోజు ఆలస్యం

ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…

3 hours ago

మంచి పని చేసిన దృశ్యం 3

మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…

3 hours ago

డిప్యూటీ సీఎం నోట ఫార్మ్ హౌస్ మాట

మీలాగా మేం ఫామ్ హౌస్‌లో ప‌డుకోవ‌ట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…

3 hours ago

అమ‌ర్నాథా… ఇప్పుడు కూడా రాజ‌కీయ‌మేంట‌య్యా!

స్వ‌తంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్న‌ట్టుగా వైసీపీ నాయ‌కుల‌కు ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హరించాలో తెలియ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.…

4 hours ago

మీనాక్షికి షాకిచ్చిన ఈసీ… ఏం జరిగింది?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…

4 hours ago

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

6 hours ago