Political News

ప‌వ‌న్‌కు పాల్‌కు ముడిపెట్టి స‌టైర్లు వేసిన ఏపీ మంత్రి

ఏపీ సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో 3 రాజధానులే ఏర్ప‌డుతాయ‌ని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వ విధానమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే, అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పవన్ క‌ళ్యాణ్‌ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు ఎందుకు ఇబ్బందని ప్ర‌శ్నించారు. పవన్ అరుపులకు ఎవరూ భయప డరని మంత్రి బొత్స హెచ్చరించారు. పవన్ రాజకీయాలు చూస్తుంటే విరక్తి కలుగుతోందని, ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌కు.. పవన్‌కు పెద్ద తేడా లేదని మంత్రి బొత్స విమర్శించారు. పవన్ బాగా డబ్బు ఖర్చు పెట్టి వారాహి వాహనం చేయించుకున్నారని, రాష్ట్రమంతా తిరుగు.. నిన్ను ఎవరు వద్దన్నారు? అని ప్ర‌శ్నించారు.

ఉగాది నాటికి విశాఖకు రాజధాని తరలిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే రాజ‌ధానికి సంబంధించి విష‌యాలు కూడా బ‌య‌ట పెడ‌తామ‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం.. ప్ర‌తిప‌క్షాల‌కు అల‌వాటుగా మారింద‌ని అన్నారు. ముంద‌స్తు ముచ్చ‌టే రాబోద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రి సంక్షేమాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా తీసుకుంద‌ని మంత్రి బొత్స తెలిపారు. మొత్తానికి ప‌వ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు మాత్రం సంచ‌ల‌నంగా మారాయి.

This post was last modified on January 26, 2023 6:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago