Political News

ప‌వ‌న్‌కు పాల్‌కు ముడిపెట్టి స‌టైర్లు వేసిన ఏపీ మంత్రి

ఏపీ సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో 3 రాజధానులే ఏర్ప‌డుతాయ‌ని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వ విధానమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే, అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పవన్ క‌ళ్యాణ్‌ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీని అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు ఎందుకు ఇబ్బందని ప్ర‌శ్నించారు. పవన్ అరుపులకు ఎవరూ భయప డరని మంత్రి బొత్స హెచ్చరించారు. పవన్ రాజకీయాలు చూస్తుంటే విరక్తి కలుగుతోందని, ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్‌కు.. పవన్‌కు పెద్ద తేడా లేదని మంత్రి బొత్స విమర్శించారు. పవన్ బాగా డబ్బు ఖర్చు పెట్టి వారాహి వాహనం చేయించుకున్నారని, రాష్ట్రమంతా తిరుగు.. నిన్ను ఎవరు వద్దన్నారు? అని ప్ర‌శ్నించారు.

ఉగాది నాటికి విశాఖకు రాజధాని తరలిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లోనే రాజ‌ధానికి సంబంధించి విష‌యాలు కూడా బ‌య‌ట పెడ‌తామ‌ని చెప్పారు. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేయ‌డం.. ప్ర‌తిప‌క్షాల‌కు అల‌వాటుగా మారింద‌ని అన్నారు. ముంద‌స్తు ముచ్చ‌టే రాబోద‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రి సంక్షేమాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం బాధ్య‌త‌గా తీసుకుంద‌ని మంత్రి బొత్స తెలిపారు. మొత్తానికి ప‌వ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు మాత్రం సంచ‌ల‌నంగా మారాయి.

This post was last modified on January 26, 2023 6:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

3 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago