ఏపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో 3 రాజధానులే ఏర్పడుతాయని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వ విధానమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే, అదేసమయంలో జనసేన అధినేత పవన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీని అభివృద్ధి చేస్తుంటే పవన్కు ఎందుకు ఇబ్బందని ప్రశ్నించారు. పవన్ అరుపులకు ఎవరూ భయప డరని మంత్రి బొత్స హెచ్చరించారు. పవన్ రాజకీయాలు చూస్తుంటే విరక్తి కలుగుతోందని, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్కు.. పవన్కు పెద్ద తేడా లేదని మంత్రి బొత్స విమర్శించారు. పవన్ బాగా డబ్బు ఖర్చు పెట్టి వారాహి వాహనం చేయించుకున్నారని, రాష్ట్రమంతా తిరుగు.. నిన్ను ఎవరు వద్దన్నారు? అని ప్రశ్నించారు.
ఉగాది నాటికి విశాఖకు రాజధాని తరలిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని బొత్స వ్యాఖ్యానించారు. త్వరలోనే రాజధానికి సంబంధించి విషయాలు కూడా బయట పెడతామని చెప్పారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం.. ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని అన్నారు. ముందస్తు ముచ్చటే రాబోదని అన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని మంత్రి బొత్స తెలిపారు. మొత్తానికి పవన్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం సంచలనంగా మారాయి.
This post was last modified on January 26, 2023 6:19 pm
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…