టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో వారంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాఉరు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించే ఈ యాత్ర.. ఇచ్ఛాపురం వరకు సాగనుంది. మొత్తం 4 వేల కిలో మీటర్లు, 4 వందల రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, బలమైన నాయకుడిగా ఆయన ఎదిగేందుకు కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్రను మలుచుకున్నారు. భావినేతగా తనను తాను నిరూపించుకోవాలనేది ఆయన వ్యూహం. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఇప్పటికే నిర్దిష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా.. అందరూ కూడా ఈ యాత్రకు రావాలని.. ప్రారంభమే అధిరిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. ఇక్కడ రెండు సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు దీనికి అనుమతి లభించలేదు. యాత్రకు అనుమతి కోరుతూ.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి లేఖరాశారు. అయితే.. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. అదేసమయంలో అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని.. టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. దీంతో వారు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది జరిగినా.. ఆంక్షల నేపథ్యంలో అమరావతి పాదయాత్రను అడ్డుకున్న రీతిలో అడ్డుకుంటే ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు.. పాదయాత్రకు పార్టీ నేతలను ఆహ్వానించినా.. పాల్గొనాలని ఆదేశించినా.. ఇప్పటి వరకు వచ్చిన స్పందన చూస్తే.. ఇబ్బందిగానే ఉంది. కేవలం కొద్ది మంది మాత్రమే స్పందించారు. ఈ నేపథ్యంలో యాత్రను విజయవంతం చేయడం ఎలా? అనేది కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. చూడాలి.. ఏం చేస్తారో.
This post was last modified on January 20, 2023 12:13 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…