టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో వారంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాఉరు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించే ఈ యాత్ర.. ఇచ్ఛాపురం వరకు సాగనుంది. మొత్తం 4 వేల కిలో మీటర్లు, 4 వందల రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, బలమైన నాయకుడిగా ఆయన ఎదిగేందుకు కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్రను మలుచుకున్నారు. భావినేతగా తనను తాను నిరూపించుకోవాలనేది ఆయన వ్యూహం. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఇప్పటికే నిర్దిష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా.. అందరూ కూడా ఈ యాత్రకు రావాలని.. ప్రారంభమే అధిరిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. ఇక్కడ రెండు సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు దీనికి అనుమతి లభించలేదు. యాత్రకు అనుమతి కోరుతూ.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి లేఖరాశారు. అయితే.. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. అదేసమయంలో అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని.. టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. దీంతో వారు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది జరిగినా.. ఆంక్షల నేపథ్యంలో అమరావతి పాదయాత్రను అడ్డుకున్న రీతిలో అడ్డుకుంటే ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు.. పాదయాత్రకు పార్టీ నేతలను ఆహ్వానించినా.. పాల్గొనాలని ఆదేశించినా.. ఇప్పటి వరకు వచ్చిన స్పందన చూస్తే.. ఇబ్బందిగానే ఉంది. కేవలం కొద్ది మంది మాత్రమే స్పందించారు. ఈ నేపథ్యంలో యాత్రను విజయవంతం చేయడం ఎలా? అనేది కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. చూడాలి.. ఏం చేస్తారో.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…