టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరో వారంలో యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నాఉరు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభించే ఈ యాత్ర.. ఇచ్ఛాపురం వరకు సాగనుంది. మొత్తం 4 వేల కిలో మీటర్లు, 4 వందల రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. దీనిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు, బలమైన నాయకుడిగా ఆయన ఎదిగేందుకు కూడా నారా లోకేష్ యువగళం పాదయాత్రను మలుచుకున్నారు. భావినేతగా తనను తాను నిరూపించుకోవాలనేది ఆయన వ్యూహం. దీనికి సంబంధించి చంద్రబాబు కూడా ఇప్పటికే నిర్దిష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ చిన్నా పెద్దా.. అందరూ కూడా ఈ యాత్రకు రావాలని.. ప్రారంభమే అధిరిపోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కట్ చేస్తే.. ఇక్కడ రెండు సమస్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటి వరకు దీనికి అనుమతి లభించలేదు. యాత్రకు అనుమతి కోరుతూ.. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డీజీపీకి లేఖరాశారు. అయితే.. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. అదేసమయంలో అనుమతి ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని.. టీడీపీ నేతలు కూడా భావిస్తున్నారు. దీంతో వారు హైకోర్టు నుంచి అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇది జరిగినా.. ఆంక్షల నేపథ్యంలో అమరావతి పాదయాత్రను అడ్డుకున్న రీతిలో అడ్డుకుంటే ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నారు. మరోవైపు.. పాదయాత్రకు పార్టీ నేతలను ఆహ్వానించినా.. పాల్గొనాలని ఆదేశించినా.. ఇప్పటి వరకు వచ్చిన స్పందన చూస్తే.. ఇబ్బందిగానే ఉంది. కేవలం కొద్ది మంది మాత్రమే స్పందించారు. ఈ నేపథ్యంలో యాత్రను విజయవంతం చేయడం ఎలా? అనేది కూడా పార్టీకి తలనొప్పిగా మారింది. చూడాలి.. ఏం చేస్తారో.
This post was last modified on January 20, 2023 12:13 pm
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…