Political News

జీవో నెంబర్ 1 పై సుప్రీం కోర్టుకెందుకో…

టీడీపీకి వస్తున్న జనాదరణను చూసి ఏపీ సర్కారు జీవో నెంబర్ 1ను జారీ చేసిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్ షోలు, సభలు సమావేశాలను నిర్వహించకుండా అడ్డుకునేందుకు ఈ జీవోను ప్రవేశపెట్టిన వైసీపీ ప్రభుత్వం తాను మాత్రం మొదటి రోజు నుంచే జీవోను తుంగలో తొక్కతూ ర్యాలీలు నిర్వహించింది. ఈ జీవో చట్ట విరుద్ధమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు 23వ తేదీ వరకు జీవో నెంబర్ వన్ సస్పెండ్ చేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ వన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన కోర్టు ఈనెల 20వ తేదీలోగా కౌంటర్ కూడా దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు దారి జారీ చేయడమే కాక తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

కౌంటర్ దాఖలు చేయకుండానే..

నిజానికి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వీలుంది. 20వ తేదీ లోపు ఆ పనిచేయొచ్చు. ప్రభుత్వ వాదన సహేతుకంగా ఉంటే హైకోర్టే తానిచ్చిన స్టేను ఉపసంహరించే వీలుంది. అయితే ప్రభుత్వం మాత్రం కౌంటర్ దాఖలు చేయడానికి ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగన్ సర్కారు ఒక వ్యూహం ప్రకారమే ఈ పని చేసిందని భావిస్తున్నారు.

లోకేష్ పాదయాత్రను అడ్డుకునేందుకే..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర చేయబోతున్నారు. జీవోపై ఈ లోపు స్టే ఎత్తివేస్తే..ఆ విషయం హైకోర్టు తెలియజేసి.. విచారణను వాయిదా వేసుకునే వీలుంటుంది స్టే లేకపోతే టెక్నికల్ గా జీవో నెంబర్ 1 అమలులో ఉన్నట్లవుతుంది. అప్పుడు లోకేష్ పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించే ఛాన్స్ తమకు ఉంటుందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. అందుకే నేరుగా సుప్రీం కోర్టు తలుపులు తట్టామని కొంత మంది వైసీపీ నేతలు చెబుతున్నారు..

ముందే గ్రహించిన టీడీపీ

వైసీపీ మంత్రాంగాన్ని టీడీపీ నేతలు ముందే ఊహించారు. అందుకే అవసరం లేకపోయినా యాత్రకు పర్మీషన్ అడుగుతూ డీజీపీకి లేఖ రాశారు. అధికారికంగా పర్మీషన్ రాని పక్షంలో కోర్టును ఆశ్రయించి న్యాయస్థానం ద్వారా అనుమతి పొందాలని తీర్మానించారు. అంటే టీడీపీ పకడ్బందీగా ముందుకు వెళ్తోందని అనుకోవాలి..

This post was last modified on January 18, 2023 1:14 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

40 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

1 hour ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

1 hour ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

2 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

4 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago