Political News

మోదీ ప్రసంగంలో ఎన్టీయార్ ప్రస్తావన

ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అనేక అంశాలు చర్చించారు. ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలని పార్టీ శ్రేణులకు అగ్రనాయకత్వం దిశానిర్దేశం చేసింది. దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా నిర్ణయించారు. రెండో రోజున మోదీ స్పీచ్‌లో స్వర్గీయ ఎన్టీయార్‌ సేవలను ప్రస్తుతించడం మాత్రం హైలైట్. ప్రజాక్షేత్రంలో కింది స్థాయిలో ఎన్టీయార్ పోరాడి అధికారానికి వచ్చారని మోదీ గుర్తుచేశారు. నిత్యం ప్రజలతో మమేకమైన నాయకుడు ఎన్టీయార్ అని, రాజకీయంగా ఎదగాలనుకునే వారికి ఎన్టీయార్ స్పూర్తి ప్రదాత అవుతారని మోదీ గుర్తు చేశారు..

రెండు రాష్ట్రాల్లో పనికొస్తుందని…

తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో ముందస్తు రాకపోతే వచ్చే ఏడాది అసెంబ్లీ పోలింగ్ నిర్వహిస్తారు. రెండు చోట్ల బలపడి, నిలబడాలని బీజేపీ భావిస్తోంది. ఎన్టీయార్‌కు బీసీల పాలిటి దేవుడన్న పేరు కూడా ఉంది. తెలంగాణలో కొన్ని సామాజిక వర్గాలు నిర్లక్ష్యానికి గురయ్యాయి ముఖ్యంగా తెలంగాణలో సెటిలర్లుగా పేరు పొందిన సామాజిక వర్గాలు కాంగ్రెస్, టీడీపీ దెబ్బతిన్న తర్వాత ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్టీయార్ పేరు చెప్పడం ద్వారా వారిని తమ వైపుకు తిప్పుకోవచ్చని మోదీ విశ్వసిస్తున్నారు. పైగా తెలంగాణలోని బీసీ వర్గాలు కూడా కేసీయార్ తీరుపై సంతృప్తిగా లేరు, వారికి గాలం వేస్తూ, ఎన్టీయార్ తరహాలో సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని చెప్పడమే మోదీ ధ్యేయంగా భావిస్తున్నారు.

ఏపీలో జగన్‌ను వ్యతిరేకించే సామాజిక వర్గాలు, తటస్థ ఓటర్లు టీడీపీ వైపుకు చూస్తున్నారు. అక్కడున్న ఎన్టీయార్ అభిమానులు కూడా పక్క చూపులు చూస్తున్నారు. అలాంటి వారిని తమవైపుకు తిప్పుకోగలిగితే లబ్ధి పొందే అవకాశం ఉందని బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల తర్వాత హంగ్ ఏర్పడిన పక్షంలో తాము నిర్ణయాత్మక శక్తిగా మారే వీలుంటుందని మోదీ ఆశ. అంతకు మించి ఏమీ లేదు….

Satya

Recent Posts

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

2 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

4 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

4 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

5 hours ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

6 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

6 hours ago