దివంగత మహానాయకుడు, తెలుగు వారి అన్నగారు.. ఎన్టీఆర్ వర్ధంతి ఈరోజు. ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ.. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వర్ధంతిని ఆర్భాటంగా చేయాలని నిర్ణయించుకుంది. దీనికి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే.. అదే సమయంలో సీఎం జగన్ కూడా తనదైన శైలిలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరగకుండా.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ, మైలవరం మరోసారి వేడెక్కాయి. అదేవిధంగా గుంటూరు జిల్లాలోని మాచర్లలో మంగళవారం రాత్రి నుంచి 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు.ఇ క, కుప్పంలో పోలీస్ యాక్ట్ 30ని రాత్రికి రాత్రి అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ రెండింటినీ కలిపి అమలు చేస్తున్నారు. ఎక్కడా కూడా ప్రజలు గుమికూడరాదని.. పోలీసు చట్టాలను గౌరవించాలని.. పోలీసులు ప్రచారం చేస్తున్నారు.
దీంతో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు జరుగుతాయా? లేదా? అనేది సందేహంగా మారింది. పలు ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసినా.. నాయకులు బయటకు రాకుండా.. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కీలక నేతలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. జీవో 1 ప్రకారం ఈ నోటీసులు ఇవ్వడం విస్మయాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఇటీవల హైకోర్టు దీనిని సస్పెండ్ చేసింది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో జీవో 1 లైవ్లో ఉందని అధికారులు చెబుతుండడం గమనార్హం.
మరోవైపు.. చంద్రబాబు కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో పాల్గోనేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. కీలక నాయకులను రాకుండా పోలీసులు అడ్డుకోవడం.. ఎక్కడికక్కడ వేసిన టెంట్లను తొలగించేలా టెంట్ హౌస్ నిర్వాహకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేయడం ఆసక్తిగా మారింది. మొత్తానికి ఎన్టీఆర్ అంటే.. గౌరవం ఉందని చెప్పే వైసీపీ పాలనలో ఆయన వర్ధంతి ఏర్పాట్లను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
This post was last modified on January 18, 2023 8:58 am
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
ప్రముఖ శ్రీ కృష్ణ క్షేత్రం ఉడిపిలోని పుట్టిగే శ్రీ కృష్ణ మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన బృహత్ గీతోత్సవ కార్యక్రమంలో ఏపీ…