క‌రోనా కాటు.. న‌ష్టం ఎన్ని ల‌క్ష‌ల కోట్లో?

క‌రోనా వైర‌స్ ప‌ట్ల ఇట‌లీ స‌హా కొన్ని దేశాలు నిర్ల‌క్ష్యం వ‌హించి ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకుంటున్నాయో చూస్తున్నాం. ఇక భార‌త్ లాంటి అత్యంత జ‌న‌సాంద్ర‌త ఉన్న దేశంలో ఇదే నిర్ల‌క్ష్యాన్ని కొన‌సాగిస్తే జ‌రిగే ప్రాణ న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. అందుకే దేశం ఇప్ప‌టికే ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది ప‌డుతూ.. వృద్ధి రేటు అంత‌కంత‌కూ ప‌డిపోతున్న‌ప్ప‌టికీ ఇంకేమీ ఆలోచించ‌కుండా మూడు వారాల పాటు లాకౌట్ ప్ర‌క‌టించింది కేంద్ర ప్ర‌భుత్వం.

క‌రోనా వ్యాప్తిని నిరోధించ‌డానికి ఇంత‌కంటే అత్యుత్త‌మ మార్గం ఇంకోటి లేదు. ఐతే ఈ లాకౌట్ వ‌ల్ల రాబోయే రోజుల్లో దేశం ఆర్థిక సంక్షోభంలో ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు నిపుణులు. మూడు వారాల లాకౌట్ వ‌ల్ల దేశానికి ఏకంగా రూ.9 ల‌క్ష‌ల కోట్ల న‌ష్టం వాటిల్ల‌నుంద‌ట‌.

థియేట‌ర్లు మూత ప‌డ్డాయి. మాల్స్ ఆగిపోయాయి. హోట‌ళ్లు, లాడ్జీలు మూత‌ప‌డ్డాయి. దుకాణాల‌న్నింటికీ తెర‌ప‌డింది. అన్ని ర‌కాల వ్యాపారాలూ ఆగిపోయాయి. ర‌వాణా ఆగిపోయింది. దీని వ‌ల్ల ఏ రోజుకు ఆ రోజు ఏ స్థాయిలో న‌ష్టం ఉంటుందో అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. వ్యాపారాల‌న్నీ ఆగిపోవ‌డంతో ప్ర‌భుత్వానికి రావాల్సిన ప‌న్నుల‌న్నీ ఆగిపోయాయి. దీని వల్ల దేశ ఖాజానాపై రూ.9 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.

ఇది దేశ జీడీపీలో నాలుగు శాతమని వాళ్లు అంటున్నారు. ఇప్ప‌టికే గ‌త రెండేళ్ల‌లో భార‌త్ వృద్ధి రేటు ప‌డిపోతూ వ‌స్తోంది. లాకౌట్ మూలంగా అది క‌నిష్ట స్థాయికి ప‌డిపోయేలా ఉంది. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో ఆర్థికంగా దేశం సంక్షోభాన్ని చూసేలా ఉంది. అయితే ప్రాణ న‌ష్టం ముందు ఈ న‌ష్టం చిన్న‌దే కాబ‌ట్టి స‌ర్దుకుపోవాల్సిందే.

Share
Show comments
Published by
Satya

Recent Posts

దొంగోడి లవ్.. ప్రేయసికి గిఫ్ట్ గా రూ.3 కోట్ల ఇల్లు..

బెంగళూరులో ఇటీవల అరెస్టైన ఓ దొంగ కథ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 37 ఏళ్ల పంచాక్షరి స్వామి అనే…

22 minutes ago

బాప‌ట్ల త‌మ్ముళ్ల మ‌ధ్య ‘ఎన్టీఆర్’ వివాదం

కూట‌మి ప్ర‌భుత్వంలో క‌లిసి మెలిసి ఉండాల‌ని.. నాయ‌కులు ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే…

26 minutes ago

ఫిబ్ర‌వ‌రి 4.. నాకు స్పెష‌ల్ డే: రేవంత్‌రెడ్డి

"ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నా రాజకీయ జీవితంలో ప్ర‌త్య‌కంగా గుర్తుండిపోయే రోజు" అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.…

53 minutes ago

ఢిల్లీలో నారా లోకేశ్ తో ప్రశాంత్ కిశోర్ భేటీ

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మంగళవారం…

1 hour ago

శ్రీ ఆంజనేయం వెనకున్న ‘చిరు’ రహస్యం

అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉందన్నట్టు ఈ సూత్రం సినిమాలకు కూడా వర్తిస్తుంది. ఒకరితో అనుకున్నది మరొకరితో…

1 hour ago

వైఎస్ వద్దే తగ్గలేదు… ఇప్పుడు తగ్గుతానా?: దానం

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆయన… 2023 ఎన్నికల్లో…

3 hours ago