కరోనా వైరస్ పట్ల ఇటలీ సహా కొన్ని దేశాలు నిర్లక్ష్యం వహించి ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకుంటున్నాయో చూస్తున్నాం. ఇక భారత్ లాంటి అత్యంత జనసాంద్రత ఉన్న దేశంలో ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే జరిగే ప్రాణ నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. అందుకే దేశం ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతూ.. వృద్ధి రేటు అంతకంతకూ పడిపోతున్నప్పటికీ ఇంకేమీ ఆలోచించకుండా మూడు వారాల పాటు లాకౌట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఇంతకంటే అత్యుత్తమ మార్గం ఇంకోటి లేదు. ఐతే ఈ లాకౌట్ వల్ల రాబోయే రోజుల్లో దేశం ఆర్థిక సంక్షోభంలో పడటం ఖాయమంటున్నారు నిపుణులు. మూడు వారాల లాకౌట్ వల్ల దేశానికి ఏకంగా రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లనుందట.
థియేటర్లు మూత పడ్డాయి. మాల్స్ ఆగిపోయాయి. హోటళ్లు, లాడ్జీలు మూతపడ్డాయి. దుకాణాలన్నింటికీ తెరపడింది. అన్ని రకాల వ్యాపారాలూ ఆగిపోయాయి. రవాణా ఆగిపోయింది. దీని వల్ల ఏ రోజుకు ఆ రోజు ఏ స్థాయిలో నష్టం ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. వ్యాపారాలన్నీ ఆగిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులన్నీ ఆగిపోయాయి. దీని వల్ల దేశ ఖాజానాపై రూ.9 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఇది దేశ జీడీపీలో నాలుగు శాతమని వాళ్లు అంటున్నారు. ఇప్పటికే గత రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. లాకౌట్ మూలంగా అది కనిష్ట స్థాయికి పడిపోయేలా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్థికంగా దేశం సంక్షోభాన్ని చూసేలా ఉంది. అయితే ప్రాణ నష్టం ముందు ఈ నష్టం చిన్నదే కాబట్టి సర్దుకుపోవాల్సిందే.
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…
రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…
ప్యాన్ ఇండియా సినిమాలు ఎంత బడ్జెట్ తో తీశామనేది ఎంత ముఖ్యమో వాటిని ఎంత బాగా ప్రమోట్ చేసుకుంటారనేది అంతకన్నా…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన వేళ తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆరఎస్ పార్టీ ఇరుకున పడిన విషయం తెలిసిందే. డ్రగ్స్…
పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. గత మూడు సార్లుగా ఇక్కడ అధికారంలో ఉన్న దీదీ..…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…