కరోనా వైరస్ పట్ల ఇటలీ సహా కొన్ని దేశాలు నిర్లక్ష్యం వహించి ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకుంటున్నాయో చూస్తున్నాం. ఇక భారత్ లాంటి అత్యంత జనసాంద్రత ఉన్న దేశంలో ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే జరిగే ప్రాణ నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. అందుకే దేశం ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతూ.. వృద్ధి రేటు అంతకంతకూ పడిపోతున్నప్పటికీ ఇంకేమీ ఆలోచించకుండా మూడు వారాల పాటు లాకౌట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఇంతకంటే అత్యుత్తమ మార్గం ఇంకోటి లేదు. ఐతే ఈ లాకౌట్ వల్ల రాబోయే రోజుల్లో దేశం ఆర్థిక సంక్షోభంలో పడటం ఖాయమంటున్నారు నిపుణులు. మూడు వారాల లాకౌట్ వల్ల దేశానికి ఏకంగా రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లనుందట.
థియేటర్లు మూత పడ్డాయి. మాల్స్ ఆగిపోయాయి. హోటళ్లు, లాడ్జీలు మూతపడ్డాయి. దుకాణాలన్నింటికీ తెరపడింది. అన్ని రకాల వ్యాపారాలూ ఆగిపోయాయి. రవాణా ఆగిపోయింది. దీని వల్ల ఏ రోజుకు ఆ రోజు ఏ స్థాయిలో నష్టం ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. వ్యాపారాలన్నీ ఆగిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులన్నీ ఆగిపోయాయి. దీని వల్ల దేశ ఖాజానాపై రూ.9 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఇది దేశ జీడీపీలో నాలుగు శాతమని వాళ్లు అంటున్నారు. ఇప్పటికే గత రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. లాకౌట్ మూలంగా అది కనిష్ట స్థాయికి పడిపోయేలా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్థికంగా దేశం సంక్షోభాన్ని చూసేలా ఉంది. అయితే ప్రాణ నష్టం ముందు ఈ నష్టం చిన్నదే కాబట్టి సర్దుకుపోవాల్సిందే.
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…