కరోనా వైరస్ పట్ల ఇటలీ సహా కొన్ని దేశాలు నిర్లక్ష్యం వహించి ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకుంటున్నాయో చూస్తున్నాం. ఇక భారత్ లాంటి అత్యంత జనసాంద్రత ఉన్న దేశంలో ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే జరిగే ప్రాణ నష్టాన్ని అంచనా వేయడం కూడా కష్టమే. అందుకే దేశం ఇప్పటికే ఆర్థిక మాంద్యంతో ఇబ్బంది పడుతూ.. వృద్ధి రేటు అంతకంతకూ పడిపోతున్నప్పటికీ ఇంకేమీ ఆలోచించకుండా మూడు వారాల పాటు లాకౌట్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ఇంతకంటే అత్యుత్తమ మార్గం ఇంకోటి లేదు. ఐతే ఈ లాకౌట్ వల్ల రాబోయే రోజుల్లో దేశం ఆర్థిక సంక్షోభంలో పడటం ఖాయమంటున్నారు నిపుణులు. మూడు వారాల లాకౌట్ వల్ల దేశానికి ఏకంగా రూ.9 లక్షల కోట్ల నష్టం వాటిల్లనుందట.
థియేటర్లు మూత పడ్డాయి. మాల్స్ ఆగిపోయాయి. హోటళ్లు, లాడ్జీలు మూతపడ్డాయి. దుకాణాలన్నింటికీ తెరపడింది. అన్ని రకాల వ్యాపారాలూ ఆగిపోయాయి. రవాణా ఆగిపోయింది. దీని వల్ల ఏ రోజుకు ఆ రోజు ఏ స్థాయిలో నష్టం ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. వ్యాపారాలన్నీ ఆగిపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన పన్నులన్నీ ఆగిపోయాయి. దీని వల్ల దేశ ఖాజానాపై రూ.9 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఇది దేశ జీడీపీలో నాలుగు శాతమని వాళ్లు అంటున్నారు. ఇప్పటికే గత రెండేళ్లలో భారత్ వృద్ధి రేటు పడిపోతూ వస్తోంది. లాకౌట్ మూలంగా అది కనిష్ట స్థాయికి పడిపోయేలా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆర్థికంగా దేశం సంక్షోభాన్ని చూసేలా ఉంది. అయితే ప్రాణ నష్టం ముందు ఈ నష్టం చిన్నదే కాబట్టి సర్దుకుపోవాల్సిందే.
గ్రౌండ్లో అభిషేక్ శర్మ స్టైల్, అతడు అలవోకగా కొట్టే సిక్సర్లు చూసి అంతా ఈజీ అనుకుంటారు. కానీ ఆ 'స్వాగ్'…
2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల…
కొద్ది సంవత్సరాల క్రితం వరకు చట్ట సభలను సభ్యులు పరమ పవిత్రంగా…దేవాలయాల మాదిరిగా చూసేవారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజల…
ఆది పినిశెట్టి.. అచ్చమైన తెలుగు కుర్రాడు. కానీ నటుడిగా అతడికి తమిళంలోనే ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అక్కడే ఎక్కువ సినిమాలు చేశాడు. లెజెండరీ…
పెళ్లి రద్దయిన తర్వాత స్మృతి మంధాన మానసికంగా కృంగిపోతారని, కొన్నాళ్ళు బయట కనిపించరని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె అందరి…
గ్రామ పంచాయతీలపై జనసేన పార్టీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తోంది. చేస్తున్న అభివృద్ధి, ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలను…