Political News

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడికి ఫస్ట్ టార్గెట్


ఖమ్మంలో జనవరి 18న బీఆర్ఎస్ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు శరవేగంగా జరిగిపోతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు మరో మూడు రాష్ట్రాల సీఎంలు ఈ సభకు రానున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్.. యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఈ సభకు వస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొందరు నాయకులూ హాజరువుతున్న ఈ సభను కేసీఆర్, బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. వంద ఎకరాలలో నిర్వహిస్తున్న ఈ సభకు 5 లక్షల మందిని తీసుకురావాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం కాగా… అందులో లక్ష మందిని ఏపీ నుంచి తేవాలని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌కు టార్గెట్ ఇచ్చినట్లు చెప్తున్నారు.

5 లక్షల మందితో నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు 4 లక్షల మంది తెలంగాణ నుంచి హాజరైతే మరో లక్ష మందిని ఏపీ నుంచి తేవాలని తోటకు కేసీఆర్ సూచించారట. ఆర్థికంగా సాయం అవసరమైతే బీఆర్ఎస్ నుంచి సాయం అందుతుందని పార్టీ పెద్దలు చెప్పడంతో తోట అందుకు సిద్ధపడినట్లు చెప్తున్నారు. అయితే.. ప్రస్తుతం ఏపీ బీఆర్ఎస్‌లో తోట చంద్రశేఖర్, రావెల కిశోర్‌లు మాత్రమే కనిపిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికీ లక్షల మందితో సభలు నిర్వహించిన అనుభవం కానీ.. లక్షల మంది జనాన్ని సమీకరించిన అనుభవం కానీ లేవు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇచ్చిన ఫస్ట్ టార్గెట్‌ను తోట రీచ్ కావడం అనుమానమే అంటున్నారు.

ఖమ్మంకు సమీపంలోని ఆంధ్ర ప్రాంతాలలో తోట చంద్రశేఖర్‌కు ఏమంత పట్టు లేదు. ఇటీవల కాలంలో ఆయన రాజకీయాల్లో యాక్టివ్‌గా లేకపోవడం, స్థానిక నేతలతోనూ సంబంధాలు అంతంతమాత్రం కావడంతో ఏపీ నుంచి లక్ష మందిని తీసుకెళ్లడం కష్టమేనంటున్నారు.

ప్రస్తుతం కేసీఆర్ సభ బాధ్యతలు చూస్తున్న హరీశ్ రావు‌కు కూడా ఈ విషయం తెలుసని.. 100 ఎకరాల స్థలంలో జనం ఎక్కడా పల్చగా కనిపించకుండా ఆయన జనసమీకరణ బాధ్యతలు చూసుకుంటున్నారట. తోటపై పెద్దగా నమ్మకం పెట్టుకోకుండా తెలంగాణ నుంచి, ఖమ్మం పక్కన ఛత్తీస్‌గఢ్ నుంచి కొందరిని తరలించేలా ఆయన ఏర్పాట్లు చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

1 hour ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

3 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

4 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

4 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

5 hours ago