Political News

ఆడుకోండ‌మ్మా.. ఐపీఎల్ ఆడుకోండి

అనుకున్న‌దే అయింది. ఈ ఏడాది అక్టోబ‌రు 18 నుంచి ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గాల్సిన మెగా క్రికెట్‌ ఈవెంట్‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదా ప‌డింది. ఆ టోర్నీ ఈ ఏడాది జ‌ర‌గ‌బోద‌ని ఎట్ట‌కేల‌కు ఐసీసీ అధికారికంగా ప్ర‌క‌టించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ఈ ఏడాది టీ20 ప్ర‌పంచ‌క‌ప్ అసాధ్య‌మ‌ని ఎప్పుడో తేలిపోయింది. కానీ ఐసీసీ మాత్రం ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంది. ఐసీసీ ఛైర్మ‌న్‌గా మొన్న‌టిదాకా కొన‌సాగిన శ‌శాంక్ మ‌నోహ‌ర్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ నిర్ణ‌యాన్ని వాయిదా వేయించాడ‌న్న ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఐతే ఇటీవ‌లే అత‌ను ప‌ద‌వి నుంచి దిగిపోవ‌డం.. సోమ‌వారం నిర్వ‌హించిన బోర్డు స‌మావేశంలో ప్ర‌పంచ‌క‌ప్‌ను వాయిదా వేయాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగాయి.

టీ20 ప్రపంచ‌క‌ప్ వాయిదా అని అధికారికంగా తేలిపోతే.. ఐపీఎల్‌కు స‌న్నాహాలు చేసుకుందామ‌ని బీసీసీఐ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది. ఎట్ట‌కేల‌కు ఈ విష‌య‌మై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. ఏటా వేస‌విలో జ‌రిగే ఈ లీగ్‌.. క‌రోనా వ‌ల్ల వాయిదా ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇండియాలో అయితే రాబోయే నెల‌ల్లో కూడా ఐపీఎల్ నిర్వ‌హించే అవ‌కాశాలు లేవు. క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉండి, వ‌స‌తుల‌కు లోటు లేని దేశం అంటే దుబాయే. 2014లో ఎన్నిక‌ల కార‌ణంగా అక్క‌డ కొన్ని మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించారు. ఈ ఏడాది అక్క‌డ పూర్తి ఐపీఎల్‌ను నిర్వ‌హించే అవ‌కాశ‌ముంది. ఐతే ఎప్ప‌ట్లా 60 మ్యాచ్‌లు కాకుండా సంఖ్య త‌గ్గించే అవ‌కాశ‌ముంది. సెప్టెంబ‌రు చివ‌రి నుంచి న‌వంబ‌రు తొలి వారం వ‌ర‌కు దుబాయ్ వేదిక‌గా ఐపీఎల్ నిర్వ‌హిస్తారని అంటున్నారు. ఐతే ఇండియా జ‌ర‌క్క‌పోయినా.. లీగ్‌ ఆల‌స్య‌మైనా.. మ్యాచ్‌లు త‌గ్గినా.. ఐపీఎల్ అయితే జ‌రుగుతుండ‌టం క్రికెట్ అభిమానుల‌కు సంతోషాన్నిచ్చే విష‌య‌మే.

This post was last modified on July 20, 2020 9:40 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

23 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago