అనుకున్నదే అయింది. ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన మెగా క్రికెట్ ఈవెంట్ టీ20 ప్రపంచకప్ వాయిదా పడింది. ఆ టోర్నీ ఈ ఏడాది జరగబోదని ఎట్టకేలకు ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ అసాధ్యమని ఎప్పుడో తేలిపోయింది. కానీ ఐసీసీ మాత్రం ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం తీసుకుంది. ఐసీసీ ఛైర్మన్గా మొన్నటిదాకా కొనసాగిన శశాంక్ మనోహర్ ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయాన్ని వాయిదా వేయించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఐతే ఇటీవలే అతను పదవి నుంచి దిగిపోవడం.. సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో ప్రపంచకప్ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగాయి.
టీ20 ప్రపంచకప్ వాయిదా అని అధికారికంగా తేలిపోతే.. ఐపీఎల్కు సన్నాహాలు చేసుకుందామని బీసీసీఐ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తోంది. ఎట్టకేలకు ఈ విషయమై స్పష్టత వచ్చేసింది. ఏటా వేసవిలో జరిగే ఈ లీగ్.. కరోనా వల్ల వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఇండియాలో అయితే రాబోయే నెలల్లో కూడా ఐపీఎల్ నిర్వహించే అవకాశాలు లేవు. కరోనా ప్రభావం తక్కువగా ఉండి, వసతులకు లోటు లేని దేశం అంటే దుబాయే. 2014లో ఎన్నికల కారణంగా అక్కడ కొన్ని మ్యాచ్లను నిర్వహించారు. ఈ ఏడాది అక్కడ పూర్తి ఐపీఎల్ను నిర్వహించే అవకాశముంది. ఐతే ఎప్పట్లా 60 మ్యాచ్లు కాకుండా సంఖ్య తగ్గించే అవకాశముంది. సెప్టెంబరు చివరి నుంచి నవంబరు తొలి వారం వరకు దుబాయ్ వేదికగా ఐపీఎల్ నిర్వహిస్తారని అంటున్నారు. ఐతే ఇండియా జరక్కపోయినా.. లీగ్ ఆలస్యమైనా.. మ్యాచ్లు తగ్గినా.. ఐపీఎల్ అయితే జరుగుతుండటం క్రికెట్ అభిమానులకు సంతోషాన్నిచ్చే విషయమే.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…