చిరంజీవిపై ఇటీవల కాలంలో తరచుగా విరుచుకుపడుతున్న ఏపీ మంత్రి, జబర్దస్త్ రోజాకు చిరు తనదైన శైలిలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనతో నడిచి, తన కుటుంబంతో అనుబంధం పెంచుకుని, తన ఇంటికివచ్చి.. తనతో కలిసి భోజనం చేసిన రోజా.. తన కుటుంబాన్ని విమర్శిస్తే.. ఏం చెప్పాలి? ఎవరి కరుణ కోసం.. ఆమె వేచి చూస్తున్నారో..? అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి రోజా చిరంజీవి నుంచి ఈ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదని.. టాలీవుడ్ టాక్. అదేసమయంలో రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. రోజాపై చిరంజీవి కూడా పవన్ మాదిరిగా డైమండ్ రాణి అనో.. మరేదో అనో విరుచుకు పడతారని అందరూ అనుకున్నారట. కానీ, చిరు తన స్వభావాన్ని చంపుకుని.. వారికి మైలేజీ ఇవ్వలేనని.. చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో రోజా అప్సెట్ అయ్యారట.
ఆ వెంటనే తాజాగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. `చిరంజీవి గురించి కామెంట్ చేయను` అని లెంపలేసుకున్నంత పనిచేశారు. “చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు. ఆయన గురించి నేను మాట్లాడను“ అని వ్యాఖ్యానించారు. అయితే.. పవన్, నాగబాబులపై మాత్రం రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల సినిమాల ద్వారా బాలయ్య, చిరులకు ప్రేక్షకుల నుంచి కలెక్షన్లు వస్తే.. పవన్కు చంద్రబాబు నుంచి కలెక్షన్ వచ్చిందని అన్నారు.
ఇక, నాగబాబుకు శరీరం పెరిగిందే తప్ప.. బుర్ర పెరగలేదన్నారు. మొత్తానికి రోజా చిరంజీవి విషయంలో ఎక్స్ పెక్ట్ చేసిందానికి భిన్నంగా.. అంటే.. ఆయన రెచ్చిపోతే.. మళ్లీ రెచ్చిపోవాలని అనుకున్నారట. అలా కాకపోయేసరికి.. ఒకింత షాక్లో ఉన్నారన్నమాట!! దటీజ్ చిరు. అప్పట్లో రాజకీయాల్లోఅయినా.. ఇప్పుడు సినీ జీవితంలో అయినా.. చిరు స్టయిలే వేరుగా.. అంటున్నారు మెగా అభిమానులు.
This post was last modified on January 14, 2023 11:39 am
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…