చిరంజీవిపై ఇటీవల కాలంలో తరచుగా విరుచుకుపడుతున్న ఏపీ మంత్రి, జబర్దస్త్ రోజాకు చిరు తనదైన శైలిలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనతో నడిచి, తన కుటుంబంతో అనుబంధం పెంచుకుని, తన ఇంటికివచ్చి.. తనతో కలిసి భోజనం చేసిన రోజా.. తన కుటుంబాన్ని విమర్శిస్తే.. ఏం చెప్పాలి? ఎవరి కరుణ కోసం.. ఆమె వేచి చూస్తున్నారో..? అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి రోజా చిరంజీవి నుంచి ఈ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదని.. టాలీవుడ్ టాక్. అదేసమయంలో రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. రోజాపై చిరంజీవి కూడా పవన్ మాదిరిగా డైమండ్ రాణి అనో.. మరేదో అనో విరుచుకు పడతారని అందరూ అనుకున్నారట. కానీ, చిరు తన స్వభావాన్ని చంపుకుని.. వారికి మైలేజీ ఇవ్వలేనని.. చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో రోజా అప్సెట్ అయ్యారట.
ఆ వెంటనే తాజాగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. `చిరంజీవి గురించి కామెంట్ చేయను` అని లెంపలేసుకున్నంత పనిచేశారు. “చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు. ఆయన గురించి నేను మాట్లాడను“ అని వ్యాఖ్యానించారు. అయితే.. పవన్, నాగబాబులపై మాత్రం రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల సినిమాల ద్వారా బాలయ్య, చిరులకు ప్రేక్షకుల నుంచి కలెక్షన్లు వస్తే.. పవన్కు చంద్రబాబు నుంచి కలెక్షన్ వచ్చిందని అన్నారు.
ఇక, నాగబాబుకు శరీరం పెరిగిందే తప్ప.. బుర్ర పెరగలేదన్నారు. మొత్తానికి రోజా చిరంజీవి విషయంలో ఎక్స్ పెక్ట్ చేసిందానికి భిన్నంగా.. అంటే.. ఆయన రెచ్చిపోతే.. మళ్లీ రెచ్చిపోవాలని అనుకున్నారట. అలా కాకపోయేసరికి.. ఒకింత షాక్లో ఉన్నారన్నమాట!! దటీజ్ చిరు. అప్పట్లో రాజకీయాల్లోఅయినా.. ఇప్పుడు సినీ జీవితంలో అయినా.. చిరు స్టయిలే వేరుగా.. అంటున్నారు మెగా అభిమానులు.
This post was last modified on January 14, 2023 11:39 am
జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్ కొత్త సినిమా డెవిల్ ఇవాళ భారీ హడావిడి మధ్య కర్ణాటకలో విడుదలయ్యింది.…
వైసీపీ అధినేత జగన్కు భారీ దెబ్బ తగిలింది. ఇప్పటి వరకు పల్నాడు రాజకీయాల్లో ఏక ఛత్రాధిపత్యంగా చక్రం తిప్పిన పిన్నెల్లి…
ఇండిగో ఎయిర్లైన్స్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రయాణికుల నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక 'డ్యామేజ్ కంట్రోల్' చర్యలు మొదలుపెట్టింది. డిసెంబర్…
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిన ఎన్నికల…
నటసింహం బాలయ్య హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందిన అఖండ్-2 సినిమాలకు బాలారిష్టాలు తీరడం లేదు. ఈ నెల తొలి…