చిరంజీవిపై ఇటీవల కాలంలో తరచుగా విరుచుకుపడుతున్న ఏపీ మంత్రి, జబర్దస్త్ రోజాకు చిరు తనదైన శైలిలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనతో నడిచి, తన కుటుంబంతో అనుబంధం పెంచుకుని, తన ఇంటికివచ్చి.. తనతో కలిసి భోజనం చేసిన రోజా.. తన కుటుంబాన్ని విమర్శిస్తే.. ఏం చెప్పాలి? ఎవరి కరుణ కోసం.. ఆమె వేచి చూస్తున్నారో..? అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
వాస్తవానికి రోజా చిరంజీవి నుంచి ఈ కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేయలేదని.. టాలీవుడ్ టాక్. అదేసమయంలో రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. రోజాపై చిరంజీవి కూడా పవన్ మాదిరిగా డైమండ్ రాణి అనో.. మరేదో అనో విరుచుకు పడతారని అందరూ అనుకున్నారట. కానీ, చిరు తన స్వభావాన్ని చంపుకుని.. వారికి మైలేజీ ఇవ్వలేనని.. చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలతో రోజా అప్సెట్ అయ్యారట.
ఆ వెంటనే తాజాగా శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. `చిరంజీవి గురించి కామెంట్ చేయను` అని లెంపలేసుకున్నంత పనిచేశారు. “చిరంజీవి గారు రాజకీయాల్లో లేరు. ఆయన గురించి నేను మాట్లాడను“ అని వ్యాఖ్యానించారు. అయితే.. పవన్, నాగబాబులపై మాత్రం రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల సినిమాల ద్వారా బాలయ్య, చిరులకు ప్రేక్షకుల నుంచి కలెక్షన్లు వస్తే.. పవన్కు చంద్రబాబు నుంచి కలెక్షన్ వచ్చిందని అన్నారు.
ఇక, నాగబాబుకు శరీరం పెరిగిందే తప్ప.. బుర్ర పెరగలేదన్నారు. మొత్తానికి రోజా చిరంజీవి విషయంలో ఎక్స్ పెక్ట్ చేసిందానికి భిన్నంగా.. అంటే.. ఆయన రెచ్చిపోతే.. మళ్లీ రెచ్చిపోవాలని అనుకున్నారట. అలా కాకపోయేసరికి.. ఒకింత షాక్లో ఉన్నారన్నమాట!! దటీజ్ చిరు. అప్పట్లో రాజకీయాల్లోఅయినా.. ఇప్పుడు సినీ జీవితంలో అయినా.. చిరు స్టయిలే వేరుగా.. అంటున్నారు మెగా అభిమానులు.
This post was last modified on January 14, 2023 11:39 am
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…