Political News

ముఖ్య‌మంత్రి అయినప్ప‌టికీ.. జ‌గ‌న్ కోర్టుకు రావాల్సిందే: న్యాయ‌మూర్తి

ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్ప‌టికీ.. వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోర్టుకు రావాల్సిందేన‌ని నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కోర్టు న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ 2018-19 మ‌ధ్య‌లో పాద‌యాత్ర చేస్తున్న స‌మ‌యంలో విశాఖ‌లోని విమానాశ్ర‌యంలో ఆయ‌న‌పై కోడి కత్తితో దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో నిందితుడుగా ఉన్న‌ శ్రీనివాస్ అప్ప‌టి నుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే.. ఈ కేసును రాష్ట్ర ప్ర‌భుత్వం ఎన్ఐఏకు అప్ప‌గించింది. ఈ నేప‌థ్యంలో ఎన్ఐఏ కోర్టు తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

కోడిక‌త్తి కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్ కోర్టుకు రావాల్సిందేనని న్యాయ‌మూర్తి అన్నారు. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయితే.. అది ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మేన‌ని.. కోర్టుకు కాద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కోర్టు టేప్‌ రికార్డర్గా ఉండదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం జ‌గ‌న్‌ను ఇప్ప‌టి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. సమాధానంగా స్టేట్‌మెంట్ రికార్డు చేశామని ఎన్ఐఏ న్యాయవాది చెప్పారు.

రికార్డు చేస్తే చార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను.. విచారించి ఉపయోగం ఏముంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని జడ్జి స్పష్టం చేశారు. 56 మందిని ఈ కేసులో విచారిస్తే 1 నుంచి 12 వరకూ ఉన్నవారి స్టేట్‌మెంట్లు.. చార్జ్‌షీట్లో ఎందుకు లేవని ఎన్ఐఏ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ఈ నెల 31వ తేదీ నుంచి విచారణకు న్యాయస్థానం షెడ్యూల్ ప్రకటించింది.

కోర్టుకు బాధితుడు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్డి స్పష్టం చేశారు. మ‌రోవైపు.. ఈ కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వాలంటూ.. ఆయ‌న త‌ల్లిదండ్రులు చేసిన విన్న‌పాన్ని ఎన్ఐఏ తోసిపుచ్చింది. బెయిల్ నిరాకరించింది. అస‌లు ఈ కేసులో వాద‌న‌లే ప్రారంభం కాకుండా.. బెయిల్ ఎలా ఇస్తామ‌ని వ్యాఖ్యానించింది.

Satya

Recent Posts

హీరోయిన్ల కలెక్షన్లతో ఫ్యాన్ వార్స్ ఏంటయ్యా…

టాలీవుడ్ లో హీరోల సినిమాల వసూళ్ల మీద సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ జరగడం ఎప్పటినుంచో చూస్తున్నాం. అయితే ఇప్పుడు…

24 minutes ago

‘శ‌వాలు లేస్తే కానీ… వైసీపీకి సంతోషం రాదు’

వ‌చ్చే మూడేళ్ల‌లో తానేంటో చూపిస్తాన‌ని.. వైసీపీని ఉద్దేశించి డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

41 minutes ago

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

52 minutes ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

1 hour ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

2 hours ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

3 hours ago