Political News

పొత్తుల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటాయ‌నే వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ అంచ‌నాలు సంచ‌ల‌నం సృష్టిస్తున్న నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “దశాబ్దం(ప‌దేళ్లు) పాటు ఒంటరిగానే పోరాడాను. నాకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తా. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా?.. మీరు అండ‌గా ఉంటానంటే.. నేను ఒంట‌రిగానే వెళ్తా” అని వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. మ‌రోసారి కూడా ప‌వ‌న్ ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే వెళ్లాల‌ని అనుకుంటే.. మీరంతా అండ‌గా నిలుస్తారా? అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కానీ, మ‌రోసారి కూడా ప్ర‌జ‌ల నుంచి ఈల‌లు త‌ప్ప‌.. కామెంట్లు రాలేదు. దీంతో.. ” ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి.” అని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదని తాను చెబుతున్నాన‌ని.. అంటే.. అభిమానులుగా.. పార్టీ కార్య‌క‌ర్త‌లు మీరు ఓటేసినా.. అది ఎక్క‌డో ఒక‌టో అరా కాకుండా.. అంద‌రి ఓట్లూ క‌ల‌సి క‌ట్టుగా ప‌డాల‌ని కోరుకుంటున్నాను. అప్పుడే మూడు ముక్క‌ల ముఖ్య‌మంత్రిని ఇంటికి పంపించే అవ‌కాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే.. “జ‌న‌సేన పార్టీకి ఉన్న‌ గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే క‌లిసి వెళ్తాం. కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తాం” అని పవన్ రణస్థలంలో స్పష్టం చేశారు. అంటే.. మొత్తానికి పొత్తుపై ప‌వ‌న్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌కుండానే వ్య‌వ‌హ‌రించారు.

This post was last modified on January 13, 2023 8:53 am

Share

Recent Posts

వైసీపీని భయపెడుతున్న సర్వే

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బయటకు వస్తే జనసందోహం కనిపిస్తోందని.. రాష్ట్రంలో తమకు ఇప్పటికీ బలమైన ప్రజాదరణ ఉందని వైసీపీ…

1 hour ago

కింగ్ 100… కొత్తగా కనిపిస్తున్నాడు

అక్కినేని నాగార్జున కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక మైలురాయిగా రూపొందుతున్న వందో సినిమాకు ముందు నుంచి ప్రచారం జరిగినట్టే కింగ్…

1 hour ago

నయనతార నిర్ణయాలు అందుకే కరెక్ట్

టాక్సిక్ హీరోయిన్ల విషయంలో కామెంట్స్ రానిది ఎవరికయ్యా అంటే ఒక్క నయనతారకి మాత్రమే అని చెప్పాలి. ఎందుకంటే కథలో ఆవిడ…

2 hours ago

ఏష నాగుల కట్ట… కలెక్షన్లు తెచ్చే మూట

ఒక ఛార్ట్ బస్టర్ సాంగ్ ఇచ్చే కిక్ ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కోసారి ఊహించిన ఓపెనింగ్ కన్నా దాని వల్లే…

3 hours ago

భూమా.. బంగార‌మా… ఎక‌రం 269 కోట్ల రూపాయలా!

బంగారంతో పోటీ ప‌డుతున్న‌ట్టుగా భూముల ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే ఇది ఎక్క‌డో కాదు. తెలంగాణ‌లోనే !. రాష్ట్ర పారిశ్రామిక‌,…

4 hours ago

మజ్లిస్ నుంచి ఎమ్మెల్సీ సస్పెండ్, కారణం అదేనా?

హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఎక్కడ చూసినా మజ్లిస్ పార్టీ ఎమ్మెల్సీ రహ్మత్ బేగ్ సస్పెండ్ గురించే చర్చ జరుగుతుంది.…

4 hours ago