వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయనే వ్యాఖ్యలు.. రాజకీయ అంచనాలు సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “దశాబ్దం(పదేళ్లు) పాటు ఒంటరిగానే పోరాడాను. నాకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తా. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా?.. మీరు అండగా ఉంటానంటే.. నేను ఒంటరిగానే వెళ్తా” అని వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. మరోసారి కూడా పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్లాలని అనుకుంటే.. మీరంతా అండగా నిలుస్తారా? అని పవన్ వ్యాఖ్యానించారు. కానీ, మరోసారి కూడా ప్రజల నుంచి ఈలలు తప్ప.. కామెంట్లు రాలేదు. దీంతో.. ” ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి.” అని పవన్ పిలుపునిచ్చారు.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదని తాను చెబుతున్నానని.. అంటే.. అభిమానులుగా.. పార్టీ కార్యకర్తలు మీరు ఓటేసినా.. అది ఎక్కడో ఒకటో అరా కాకుండా.. అందరి ఓట్లూ కలసి కట్టుగా పడాలని కోరుకుంటున్నాను. అప్పుడే మూడు ముక్కల ముఖ్యమంత్రిని ఇంటికి పంపించే అవకాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే.. “జనసేన పార్టీకి ఉన్న గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే కలిసి వెళ్తాం. కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తాం” అని పవన్ రణస్థలంలో స్పష్టం చేశారు. అంటే.. మొత్తానికి పొత్తుపై పవన్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండానే వ్యవహరించారు.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…