Political News

పొత్తుల‌పై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటాయ‌నే వ్యాఖ్య‌లు.. రాజ‌కీయ అంచ‌నాలు సంచ‌ల‌నం సృష్టిస్తున్న నేప‌థ్యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. “దశాబ్దం(ప‌దేళ్లు) పాటు ఒంటరిగానే పోరాడాను. నాకు బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానైనా వెళ్తా. ఒంటరిగా వెళ్లేంత నమ్మకం మీరు ఇస్తారా?.. మీరు అండ‌గా ఉంటానంటే.. నేను ఒంట‌రిగానే వెళ్తా” అని వ్యాఖ్యానించారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి స్పంద‌నా రాలేదు. మ‌రోసారి కూడా ప‌వ‌న్ ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే వెళ్లాల‌ని అనుకుంటే.. మీరంతా అండ‌గా నిలుస్తారా? అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కానీ, మ‌రోసారి కూడా ప్ర‌జ‌ల నుంచి ఈల‌లు త‌ప్ప‌.. కామెంట్లు రాలేదు. దీంతో.. ” ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం అవసరం లేదు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి.” అని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.

అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో ఓటు చీలకూడదని తాను చెబుతున్నాన‌ని.. అంటే.. అభిమానులుగా.. పార్టీ కార్య‌క‌ర్త‌లు మీరు ఓటేసినా.. అది ఎక్క‌డో ఒక‌టో అరా కాకుండా.. అంద‌రి ఓట్లూ క‌ల‌సి క‌ట్టుగా ప‌డాల‌ని కోరుకుంటున్నాను. అప్పుడే మూడు ముక్క‌ల ముఖ్య‌మంత్రిని ఇంటికి పంపించే అవ‌కాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అయితే.. “జ‌న‌సేన పార్టీకి ఉన్న‌ గౌరవం తగ్గకుండా పొత్తు కుదిరితే క‌లిసి వెళ్తాం. కుదరకపోతే ఒంటరిగానైనా వెళ్తాం” అని పవన్ రణస్థలంలో స్పష్టం చేశారు. అంటే.. మొత్తానికి పొత్తుపై ప‌వ‌న్ ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌కుండానే వ్య‌వ‌హ‌రించారు.

This post was last modified on January 13, 2023 8:53 am

Share
Show comments
Published by
Satya
Tags: JanasenaTDP

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

1 hour ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

1 hour ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

3 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

4 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

4 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

7 hours ago