Political News

తెలుగు ప్రజలకు మోడీ పండుగ కానుక

ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర Modi చేతుల మీదుగా తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనుకున్న దాని కంటే ముందుగా అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ రైలును తెలుగు ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతికి నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా అభివర్ణిస్తున్నారు. తొలుత అనుకున్న దాని ప్రకారం జనవరి 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని భావించారు.

అనూహ్యంగా ప్రధాని మోడీ పర్యటన పోస్టు పోన్ కావటంతో.. ఈ రైలును షెడ్యూల్ ప్రకారం ప్రారంభిస్తారా? లేదా? అన్న సందేహం కలిగింది.అయితే..అందుకు భిన్నంగా నాలుగు రోజులు ముందుగా అంటే ఈనెల 15న ఉదయం పది గంటల వేళలో ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వర్చువల్ గా వందే భారత్ రైలునుప్రారంభించనున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఏడు వందే భారత్ రైళ్లను దేశంలో అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా పరుగులు తీయనున్నది ఎనిమిదో రైలుగా చెప్పాలి. సికింద్రాబాద్ – విశాఖకు మధ్య ప్రయాణ దూరాన్ని ఈ రైలు పుణ్యమా అని 8.40 గంటలకు తగ్గిపోనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఈ ప్రతిష్ఠాత్మక రైలును మరో మూడు రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. బుధవారం ట్రయల్ రన్ ను పూర్తిచేశారు. పూర్తిగా చైర్ కార్ బోగీలు ఉన్న ఈ రైలు విశాఖకు చేరుకుంది. ఈ రైలు మొత్తం కెమేరాల పర్యవేక్షణలో ఉండనుంది. విశాలమైన టాయిలెట్ ఈ రైళ్లలో ఉండనున్నాయి.

ఇదిలా ఉండే.. బుధవారం సాయంత్రం ఆరు గంటల వేళలో విశాఖ రైల్వే స్టేషన్ ను చేరుకున్న వందే భారత్ ట్రైన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి జరిపారు. దీంతో.. రెండు కోచ్ అద్దాలు పగిలిపోయాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంది. ఈ దారుణానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.

This post was last modified on January 12, 2023 1:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు అభిమానులకు దురంధర్ స్ట్రోక్

భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…

41 minutes ago

ట్రెండింగ్ మొదలుపెట్టిన భగత్ సింగ్

ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…

2 hours ago

దురంధర్ 2 ప్రీమియర్లు…..వాటి మీదే అందరి కళ్ళు

మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…

3 hours ago

బీఆర్ఎస్ టాక్‌: రోహిత్‌రెడ్డిపై ఇంత‌క‌న్నా చేయ‌లేం

'మొయినాబాద్ డ్ర‌గ్స్ పార్టీ' కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత‌, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్‌రెడ్డి విష‌యం మాజీ…

3 hours ago

జ‌గ‌న్‌ను చిక్కుల్లో పెట్టేశారుగా!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మ‌రోసారి చిక్కుల్లో ప‌డ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయ‌న‌కు పెద్ద చిక్కు వ‌చ్చింది.…

3 hours ago

హరీష్ మీద పవన్ ఫ్యాన్స్ ప్రేమ

స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…

6 hours ago