Political News

తెలుగు ప్రజలకు మోడీ పండుగ కానుక

ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర Modi చేతుల మీదుగా తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనుకున్న దాని కంటే ముందుగా అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ రైలును తెలుగు ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతికి నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా అభివర్ణిస్తున్నారు. తొలుత అనుకున్న దాని ప్రకారం జనవరి 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని భావించారు.

అనూహ్యంగా ప్రధాని మోడీ పర్యటన పోస్టు పోన్ కావటంతో.. ఈ రైలును షెడ్యూల్ ప్రకారం ప్రారంభిస్తారా? లేదా? అన్న సందేహం కలిగింది.అయితే..అందుకు భిన్నంగా నాలుగు రోజులు ముందుగా అంటే ఈనెల 15న ఉదయం పది గంటల వేళలో ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వర్చువల్ గా వందే భారత్ రైలునుప్రారంభించనున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఏడు వందే భారత్ రైళ్లను దేశంలో అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా పరుగులు తీయనున్నది ఎనిమిదో రైలుగా చెప్పాలి. సికింద్రాబాద్ – విశాఖకు మధ్య ప్రయాణ దూరాన్ని ఈ రైలు పుణ్యమా అని 8.40 గంటలకు తగ్గిపోనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఈ ప్రతిష్ఠాత్మక రైలును మరో మూడు రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. బుధవారం ట్రయల్ రన్ ను పూర్తిచేశారు. పూర్తిగా చైర్ కార్ బోగీలు ఉన్న ఈ రైలు విశాఖకు చేరుకుంది. ఈ రైలు మొత్తం కెమేరాల పర్యవేక్షణలో ఉండనుంది. విశాలమైన టాయిలెట్ ఈ రైళ్లలో ఉండనున్నాయి.

ఇదిలా ఉండే.. బుధవారం సాయంత్రం ఆరు గంటల వేళలో విశాఖ రైల్వే స్టేషన్ ను చేరుకున్న వందే భారత్ ట్రైన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి జరిపారు. దీంతో.. రెండు కోచ్ అద్దాలు పగిలిపోయాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంది. ఈ దారుణానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

9 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

11 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

13 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

14 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

14 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

14 hours ago