Political News

తెలుగు ప్రజలకు మోడీ పండుగ కానుక

ఈ నెల 19న ప్రధానమంత్రి నరేంద్ర Modi చేతుల మీదుగా తెలుగు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భావించిన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు అనుకున్న దాని కంటే ముందుగా అందుబాటులోకి రానుంది. తెలుగు ప్రజలకు సంక్రాంతి కానుకగా ఈ రైలును తెలుగు ప్రజల పెద్ద పండుగ అయిన సంక్రాంతికి నడిపేందుకు వీలుగా నిర్ణయం తీసుకున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ సంక్రాంతి కానుకగా అభివర్ణిస్తున్నారు. తొలుత అనుకున్న దాని ప్రకారం జనవరి 19న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారని భావించారు.

అనూహ్యంగా ప్రధాని మోడీ పర్యటన పోస్టు పోన్ కావటంతో.. ఈ రైలును షెడ్యూల్ ప్రకారం ప్రారంభిస్తారా? లేదా? అన్న సందేహం కలిగింది.అయితే..అందుకు భిన్నంగా నాలుగు రోజులు ముందుగా అంటే ఈనెల 15న ఉదయం పది గంటల వేళలో ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వర్చువల్ గా వందే భారత్ రైలునుప్రారంభించనున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. సికింద్రాబాద్ స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమానికి రైల్వే శాఖా మంత్రి అశ్వినీ వైష్ణవ్.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారని రైల్వే అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు ఏడు వందే భారత్ రైళ్లను దేశంలో అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా పరుగులు తీయనున్నది ఎనిమిదో రైలుగా చెప్పాలి. సికింద్రాబాద్ – విశాఖకు మధ్య ప్రయాణ దూరాన్ని ఈ రైలు పుణ్యమా అని 8.40 గంటలకు తగ్గిపోనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే ఈ ప్రతిష్ఠాత్మక రైలును మరో మూడు రోజుల్లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. బుధవారం ట్రయల్ రన్ ను పూర్తిచేశారు. పూర్తిగా చైర్ కార్ బోగీలు ఉన్న ఈ రైలు విశాఖకు చేరుకుంది. ఈ రైలు మొత్తం కెమేరాల పర్యవేక్షణలో ఉండనుంది. విశాలమైన టాయిలెట్ ఈ రైళ్లలో ఉండనున్నాయి.

ఇదిలా ఉండే.. బుధవారం సాయంత్రం ఆరు గంటల వేళలో విశాఖ రైల్వే స్టేషన్ ను చేరుకున్న వందే భారత్ ట్రైన్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడి జరిపారు. దీంతో.. రెండు కోచ్ అద్దాలు పగిలిపోయాయి. వీటిని యుద్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంది. ఈ దారుణానికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెబుతున్నారు.

This post was last modified on January 12, 2023 1:38 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

2 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

3 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago