Political News

టీడీపీ వివాదాస్ప‌ద నియోజ‌క‌వ‌ర్గాలే జ‌న‌సేన‌కు వ‌ర‌మా?

తాజాగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ అనంత‌రం.. అనేక విశ్లేష‌ణ‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. ఈ రెండు పార్టీలూ క‌లిసి పోటీ చేస్తున్నాయ‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌వ‌న్ 30 సీట్లు అడిగార‌ని.. పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. వీటిలో 24 స్థానాల‌కు సంబంధించి కూడా కొన్ని పేర్లు వెలుగు చూశాయి. ఈ నేప‌థ్యంలో ఇదే నిజ‌మైతే.. అస‌లు ఆయా స్థానాలను టీడీపీ కేటాయించ‌డం వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏంట‌నేది ఆస‌క్తిగా మారింది.

ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల విష‌యానికి వ‌స్తే..(అంటే వీటిని టీడీపీ జ‌న‌సేన‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న‌నేప‌థ్యంలో) విశాఖ నార్త్, చోడవరం, గాజువాక, భీమిలి, యలమంచిలి, రాజానగరం, అమలాపురం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, నరసాపురం, తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ పశ్చిమ, తెనాలి, సత్తెనపల్లి, గుంటూరు పశ్చిమ, పుట్టపర్తి , గిద్దలూరు, చీరాల, చిత్తూరు, తిరుపతి, దర్శి, అనంతపురం అర్బన్ నియోజ‌క‌వ‌ర్గాలను జ‌న‌సేన‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. వీటిలో మెజారిటీ స్థానాల్లో టీడీపీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. రాజాన‌గ‌రం, అమ‌లాపురం, రాజోలు, కాకినాడ రూర‌ల్‌, న‌ర‌సాపురం, తాడేప‌ల్లిగూడెం, కైక‌లూరు, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, స‌త్తెన‌ప‌ల్లి, గుంటూరు ప‌శ్చిమ‌, పుట్ట‌ప‌ర్తి,గిద్ద‌లూరు, చీరాల‌, తిరుప‌తి, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి అభ్య‌ర్థులు లేరు. ఉన్న చోట అంటే స‌త్తెన‌ప‌ల్లి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌రికి మించి ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. ఇక‌, పుట్ట‌ప‌ర్తిలో జేసీ బ్ర‌ద‌ర్స్ వ‌ర్సెస్ మాజీ మంత్రి ర‌ఘునాథ‌రెడ్డి మ‌ధ్య తీవ్ర యుద్ధం న‌డుస్తోంది. సో.. ఇలాంటి చోట ఎవ‌రికి టికెట్ ఇచ్చినా..త‌మ్ముళ్లు త‌న్నుకోవ‌డ‌మే.

ఇక‌, న‌ర‌సాపురంలో టీడీపీ గ‌త ఎన్నికల్లో ఓడిపోయింది. అంతేకాదు.. టీడీపీ వ‌ల్లే ఇక్క‌డ జ‌న‌సేన ఓడింద‌నే టాక్ కూడా ఉంది. గాజువాక‌లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. అయితే, తెనాలి, అనంత‌పురం అర్బ‌న్‌ల‌లో టీడీపీకి మెజారిటీ ఉన్నా.. దానిని మాత్రం వ‌దులుకున్న‌ట్టు అవుతుంది. వెర‌సి మొత్తంగా మిగిలిన స్థానాల్లో టీడీపీకి ప‌ట్టులేదు. దీంతో వీటిని ఏదో ఒక ర‌కంగా వ‌దిలించుకుంటే.. పార్టీకి త‌ల‌నొప్పి త‌ప్పిన‌ట్టు ఉంటుంది.. మిత్ర‌ప‌క్షానికి ఇచ్చిన‌ట్టు ఉంటుంద‌నే భావ‌న త‌మ్ముళ్ల‌లో వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏది నిజ‌మో తేలాలంటే కొంత స‌మ‌యం ప‌ట్ట‌డం ఖాయం.

This post was last modified on January 8, 2023 9:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

59 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

2 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

2 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

3 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

5 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago