కేంద్రం ముందు ఏపీ పరువు పోతోందా? జగన్ పాలనపై కేంద్రం పెద్దలు పెదవి విరుస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు జగన్ చెప్పినంత, అడిగినంత అప్పులు చేసుకునేందుకు పచ్చజెండా ఊపిన కేంద్రం పెద్దలు.. ఇప్పుడు కనీసంలో కనీసం సగం కూడా ఇవ్వకపోవడం.. అది కూడా.. ఆచి తూచి అనేక సార్లు బ్రతిమాలించుకుని.. చివరి నిముషంలో మొక్కుబడిగా తలూపడం వంటివి చూస్తే.. కేంద్రం ముందు పరువుతోందని అంటున్నారు.
తాజాగా జరిగిన పరిణామాలను గమనిస్తే.. ఏపీ ప్రభుత్వం జనవరి నెలకు సంబంధించి..ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే.. రాష్ట్రానికి వచ్చిన ఆదాయం నుంచి వీటిని ఇవ్వొచ్చు కదా! అంటే.. ఇవ్వొచ్చు. కానీ, సామాజిక పింఛన్ల కోసం వచ్చిన ఆదాయాన్ని వచ్చినట్టు మళ్లించారు. ఇక, ఇప్పడు చేతిలో సాదా ఖర్చులకు తప్ప.. మరోరూపంలో రూపాయికూడా లేదు.
ఈ నేపథ్యంలో వేతనాలు, పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి సొమ్ములు అవసరం. అదేసమయంలో ఆర్బీఐ వద్ద తీసుకున్న అప్పులు కూడా తీర్చేయాల్సి ఉంది. ముఖ్యంగా వేజ్ అండ్ మీన్స్(తాత్కాలిక ప్రాతిపదికన) కింద తీసుకున్న మొత్తం 5000 కోట్లకు చేరుకుంది. ఇక, వేతనాలు, పింఛన్లకు 1500 కోట్లు కావాలి. ఈ నేపథ్యంలో కేంద్రం అనుమతి ఇస్తే.. ఆర్బీఐ వద్ద సెక్యూరిటీలు వేలం వేయాలని ఏపీ నిర్ణయించుకుంది.
ఈ క్రమంలో ఏకంగా 12 వేల కోట్లకు అనుమతి కోరింది. అయితే.. కేంద్రం ఇంత పెద్ద మొత్తం అనుమతికి ఒప్పుకోలేదు. గీసి గీసి బేరమాడి.. చివరకు శుక్రవారం రాత్రి వరకు సాగదీసి 2000 కోట్ల అప్పునకు అంగీకారం తెలిపింది. దీంతో ప్రభుత్వానికి కొంత ఊరట అయితే లభించినా.. అనుకున్న అప్పు మాత్రం పుట్టే అవకాశం లేకుండా పోయింది. ఏదేమైనా.. ఒకప్పుడు. కేంద్రం వద్ద ఉన్న పలుకుబడి.. ఇప్పుడు అడుగంటుతున్న వైనం చర్చకు దారితీస్తోంది.
This post was last modified on January 7, 2023 9:47 am
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…