Political News

చైత‌న్య ర‌థం.. చుట్టూ కుప్పం రాజ‌కీయం..

త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకుని.. అక్క‌డ‌కు చేరుకున్న ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌భుత్వం అన్ని వైపుల నుంచి అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. దీనిలో భాగంగా.. చంద్ర‌బాబు ప్ర‌జ‌ల మ‌ద్యకు వెళ్లేందుకు వీలు లేకుండా.. చైత‌న్య ర‌థాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మూడు రోజులైనా టీడీపీ నేత‌ల‌కు అప్ప‌గించ‌లేదు.

దీంతో కుప్పం రాజ‌కీయం ఇప్పుడు చైత‌న్య రథం చుట్టూ తిరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. త‌మ వాహ‌నాన్ని తిరిగి ఇవ్వాల‌ని పోలీసుల‌కు చంద్ర‌బాబు విజ్ఞ‌ప్తి చేసినా.. ఇప్ప‌టి వ‌ర‌కు పోలీసులు రియాక్ట్ కాలేదు. అంతేకాదు.. అస‌లు చైత‌న్య ర‌థం ఎక్క‌డుందో కూడా చెప్ప‌డం లేదు. మాద‌గ్గ‌ర లేదంటే మాద‌గ్గ‌ర లేదంటూ.. కుప్పం పోలీసులు.. టీడీపీ నేత‌ల‌కు చెబుతుండ‌డం కొస‌మెరుపు.

చంద్రబాబు త‌న నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో మూడు రోజులు ప‌ర్య‌టించాల‌ని నిర్ణ‌యించుకున్న విష‌యం తెలిసిందే. అయితే..తొలి రెండు రోజులు పోలీసుల ర‌గ‌డ‌తో గ‌డిచిపోయాయి. క‌నీసం మూడో రోజు శుక్ర‌వార‌మైనా.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. కానీ, మూడో రోజు మ‌రింత‌ ఉత్కంఠ రేపుతోంది. పర్యటనకు నిర్ణయించిన షెడ్యుల్ ప్రకారం ప్రజల మధ్యకు వెళ్లేందుకు అధినేత సిద్ధమవుతుండటంతో.. ఆయన ప్రయాణించే చైతన్య రథాన్నిపోలీసులు క‌నిపించ‌కుండా చేశారు.

కుప్పం గుడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి చంద్రబాబు చైతన్య రథాన్ని వేరే ప్రాంతానికి తరలించారు. చంద్రబాబు పోలీస్‌ స్టేషన్‌కు వస్తారనే సమాచారంతో రాత్రికి రాత్రి చైతన్య రథం తరలించటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సౌండ్ వాహనాన్ని పోలీసు స్టేషన్లోనే ఉంచి అది ఎవరికీ కనిపించకుండా భారీ వాహనాలను అడ్డుగా ఉంచారు. దీంతో చైతన్య రథాన్ని అప్పగించాలంటూ తెలుగుదేశం నేతలు నిరసనలకు సిద్ధమవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు సీఎం జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. దిగజారిన రాజకీయానికి చరిత్రలో జగన్‌ ఒక పర్యాయపదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో ఆడబిడ్డలపై హత్యాయత్నం కేసులు జగన్‌ అభద్రతకు చిహ్నమన్నారు. మహిళలు తమను చంపడానికి వచ్చారని పోలీసులు కేసులు పెడతారా అని ప్రశ్నించారు. కేసులు పెట్టిన అధికారుల దిగజారుడుతనాన్ని సమాజం అసహ్యించుకుంటోందని మండిపడ్డారు.

This post was last modified on January 6, 2023 10:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

45 minutes ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

1 hour ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

1 hour ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

2 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

4 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

5 hours ago