రూటు మారింది. ప్రజల ఆలోచన మారింది. టీడీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు కూడా దరహాసం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. దీనంతటికీ కారణం.. సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ బలం పెరగడమే…. ఇప్పుడు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. తాజాగా కుప్పం పర్యటనలో తన మాస్ డైలాగులతో ఉక్కిరిబిక్కిరి చేశారు…
ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి .. చంద్రబాబు సొంతూరు. చదువు మొత్తం చిత్తూరు జిల్లాలోనే . కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రగిరిలోనే పోటీ చేసేవారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత కుప్పానికి మారారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటిది 2019లో మాత్రం గట్టి దెబ్బతగిలింది. చిత్తూరులో వైసీపీ పాగా వేసింది. అప్పటి నుంచి తెలుగుదేశానికి ఇబ్బందులు మొదలయ్యాయి. కార్యకర్తలకు వేధింపులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు జరిగాయి. చంద్రబాబు కూడా కొంత డిఫెన్స్ లో పడిపోయారు..
గత రెండు నెలలుగా మాత్రం పరిస్థితులు టీడీపీకి పూర్తి అనుకూలంగా మారాయి. చంద్రబాబు వస్తే జనం నీరాజనం పడుతున్నారు. ప్రజల్లో టీడీపీ పట్ల వంద శాతం సానుకూలత ఏర్పడింది. జనం కూడా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహిస్తున్నారు. వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట వారికి శాపంగా మారింది పైగా రాష్టంలో అందరిలాగే ప్రభుత్వ విధానాల పట్ల చిత్తూరు జనం కూడా విసిగిపోయారు. దానితో టీడీపీపై జనాభిమానం పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఆయన అనుచరవర్గం ఫుల్ జోష్ లో ఉన్నారు..
ఇంతకాలం టీడీపీ కష్టాలకు కారణమైన జిల్లా మంత్రి పెద్దిరెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేశారు. కుప్పం పర్యటన సందర్బంగా పెద్దిరెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పుంగనూరు పుడింగి అంటూ కొత్త కొటేషన్ వదిలారు. పుంగనూరులోనే పెద్దిరెడ్డి కథ తేలుస్తానన్నారు. 14 ఏళ్లు తాను అధికారంలో ఉన్నప్పుడు అనుకుని ఉంటే నువ్వు తిరిగేవాడివా అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. ఇదీ ఆరంభం మాత్రమేనన్నారు. జగన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి కూడా సైకోలా మారారని చంద్రబాబు అన్నారు. ఏదేమైనా చంద్రబాబు విశ్వరూపం చూపిస్తున్నారు. మున్ముంది పెద్ద సీన్లే ఉండొచ్చు…
This post was last modified on January 6, 2023 3:21 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…