Political News

చిత్తూరులో చంద్రన్న దరహాసం…

రూటు మారింది. ప్రజల ఆలోచన మారింది. టీడీపీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చంద్రబాబు కూడా దరహాసం చేస్తున్నారు. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. దీనంతటికీ కారణం.. సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ బలం పెరగడమే…. ఇప్పుడు జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని చంద్రబాబు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. తాజాగా కుప్పం పర్యటనలో తన మాస్ డైలాగులతో ఉక్కిరిబిక్కిరి చేశారు…

ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి .. చంద్రబాబు సొంతూరు. చదువు మొత్తం చిత్తూరు జిల్లాలోనే . కాంగ్రెస్లో ఉన్నప్పుడు చంద్రగిరిలోనే పోటీ చేసేవారు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలో చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత కుప్పానికి మారారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటిది 2019లో మాత్రం గట్టి దెబ్బతగిలింది. చిత్తూరులో వైసీపీ పాగా వేసింది. అప్పటి నుంచి తెలుగుదేశానికి ఇబ్బందులు మొదలయ్యాయి. కార్యకర్తలకు వేధింపులు పెరిగాయి. ఎక్కడికక్కడ దాడులు జరిగాయి. చంద్రబాబు కూడా కొంత డిఫెన్స్ లో పడిపోయారు..

గత రెండు నెలలుగా మాత్రం పరిస్థితులు టీడీపీకి పూర్తి అనుకూలంగా మారాయి. చంద్రబాబు వస్తే జనం నీరాజనం పడుతున్నారు. ప్రజల్లో టీడీపీ పట్ల వంద శాతం సానుకూలత ఏర్పడింది. జనం కూడా టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను ప్రోత్సహిస్తున్నారు. వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాట వారికి శాపంగా మారింది పైగా రాష్టంలో అందరిలాగే ప్రభుత్వ విధానాల పట్ల చిత్తూరు జనం కూడా విసిగిపోయారు. దానితో టీడీపీపై జనాభిమానం పెరిగింది. ఇప్పుడు చంద్రబాబు ఆయన అనుచరవర్గం ఫుల్ జోష్ లో ఉన్నారు..

ఇంతకాలం టీడీపీ కష్టాలకు కారణమైన జిల్లా మంత్రి పెద్దిరెడ్డిని చంద్రబాబు టార్గెట్ చేశారు. కుప్పం పర్యటన సందర్బంగా పెద్దిరెడ్డిపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పుంగనూరు పుడింగి అంటూ కొత్త కొటేషన్ వదిలారు. పుంగనూరులోనే పెద్దిరెడ్డి కథ తేలుస్తానన్నారు. 14 ఏళ్లు తాను అధికారంలో ఉన్నప్పుడు అనుకుని ఉంటే నువ్వు తిరిగేవాడివా అని పెద్దిరెడ్డిని ప్రశ్నించారు. ఇదీ ఆరంభం మాత్రమేనన్నారు. జగన్ రెడ్డితో పాటు పెద్దిరెడ్డి కూడా సైకోలా మారారని చంద్రబాబు అన్నారు. ఏదేమైనా చంద్రబాబు విశ్వరూపం చూపిస్తున్నారు. మున్ముంది పెద్ద సీన్లే ఉండొచ్చు…

Satya

Recent Posts

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

1 minute ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

29 minutes ago

వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని దూషించడమేంటి?

ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…

1 hour ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

2 hours ago

ఇంకెంతమంది భారతీయులు బలి కావాలి?

పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…

2 hours ago

సేనానికి అభిమానమే అడ్డు కాకూడదు

భుజానికి అయిన గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రస్తుతం ముంబై…

2 hours ago