“అవును.. ఇప్పటికి ఇంతే.. మాట వినండి!” అని ఉత్తరాంధ్రకు చెందిన కీలక నాయకుడికి సీఎం జగన్ చెప్పినట్టు తాడేపల్లి వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒకరిద్దరు.. వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కొన్నాళ్లుగా సీఎం జగన్ దగ్గర మొరపెడుతున్నారు. అయితే.. సీఎం జగన్ మాత్రం వారి వాదనను పట్టించుకోవడం లేదు.
చాలా మంది నాయకులు.. తమ తమ వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. పేర్ని నాని.. అయితే. దూకుడుగా ఉన్నారు. ఇక, జగన్ ప్రమేయంతో సంబంధమే లేదన్నట్టుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా తన పుత్రికను ప్రకటించేశారు. ఇక, చాలా మంది రెడీగా ఉన్నారు. కొందరు జగన్ ఒప్పుకుంటారని భరోసాగా ఉండడంతో తమ వారిని ప్రచారంలోకి కూడా దింపేస్తున్నారు.
దీంతో ఈ విషయం అధిష్టానం దగ్గర చర్చకు వచ్చింది. ఈ విషయంలో ఏం చేయాలనేది పార్టీ సీరియస్గానే చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికి వరకు అయితే.. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని.. అత్యంత ముఖ్యం.. తప్పదు అనుకున్న ఒకటి రెండు స్థానాల్లో తప్ప.. మిగిలిన వాటిలో ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకొనేది లేదని కూడా సీఎం జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇదే విషయాన్ని కీలక సలహాదారు.. ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్యనాయకుడికి సమాచారం ఇచ్చారని తెలిసింది. అయినప్పటికీ.. ఆయన మాత్రం పంతం పట్టి కూర్చున్నారని.. అంటున్నారు. అలాగని.. తిరుగుబాటు చేసే పరిస్థితి లేదని కూడా అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…
మొన్నటిదాకా తమిళ సినీ పరిశ్రమలోనే కాక దేశంలోని ఇతర భాషాల్లోనూ ఓ స్టార్ హీరోగా ఎదిగిన జోసెఫ్ విజయ్… ఉన్నట్టుండి…