“అవును.. ఇప్పటికి ఇంతే.. మాట వినండి!” అని ఉత్తరాంధ్రకు చెందిన కీలక నాయకుడికి సీఎం జగన్ చెప్పినట్టు తాడేపల్లి వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒకరిద్దరు.. వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు అవకాశం ఇవ్వాలని కొన్నాళ్లుగా సీఎం జగన్ దగ్గర మొరపెడుతున్నారు. అయితే.. సీఎం జగన్ మాత్రం వారి వాదనను పట్టించుకోవడం లేదు.
చాలా మంది నాయకులు.. తమ తమ వారసులను రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. పేర్ని నాని.. అయితే. దూకుడుగా ఉన్నారు. ఇక, జగన్ ప్రమేయంతో సంబంధమే లేదన్నట్టుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా తన పుత్రికను ప్రకటించేశారు. ఇక, చాలా మంది రెడీగా ఉన్నారు. కొందరు జగన్ ఒప్పుకుంటారని భరోసాగా ఉండడంతో తమ వారిని ప్రచారంలోకి కూడా దింపేస్తున్నారు.
దీంతో ఈ విషయం అధిష్టానం దగ్గర చర్చకు వచ్చింది. ఈ విషయంలో ఏం చేయాలనేది పార్టీ సీరియస్గానే చర్చించినట్టు తెలిసింది. ఇప్పటికి వరకు అయితే.. వారసులకు టికెట్లు ఇచ్చేది లేదని.. అత్యంత ముఖ్యం.. తప్పదు అనుకున్న ఒకటి రెండు స్థానాల్లో తప్ప.. మిగిలిన వాటిలో ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకొనేది లేదని కూడా సీఎం జగన్ స్పష్టం చేసినట్టు సమాచారం.
ఇదే విషయాన్ని కీలక సలహాదారు.. ఉత్తరాంధ్రకు చెందిన ముఖ్యనాయకుడికి సమాచారం ఇచ్చారని తెలిసింది. అయినప్పటికీ.. ఆయన మాత్రం పంతం పట్టి కూర్చున్నారని.. అంటున్నారు. అలాగని.. తిరుగుబాటు చేసే పరిస్థితి లేదని కూడా అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on January 2, 2023 10:41 am
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్(శ్రీశైలం కుడి కాల్వ) టన్నెల్లో గత నెల 22న జరిగిన ప్రమాదంలో చిక్కుకు పోయిన.. ఆరుగురు…
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ మహిళలకు మరింత భద్రత లభించింది. ఈ మేరకు ఏపీలోని కూటమి సర్కారు నేతృత్వంలోని…
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మొత్తం 5 స్థానాలు…
రాష్ట్రంలో మహిళా ఓటు బ్యాంకు ఎక్కువగా ఉందన్న విషయం తెలిసిందే. నగరాలు, పట్టణాలే కాదు.. గ్రామీణ స్థాయిలోనూ మహిళల ఓటు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ కొనసాగుతోంది. ఒక్కఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన జగన్.. 30…
టాలీవుడ్లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే క్వాలిటీ, వెరైటీ చూపించే హీరో నాని. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం..…