Political News

ఇప్ప‌టికి ఇంతే.. మాట వినండి ప్లీజ్‌.. జ‌గ‌న్ విన్న‌పాలు

“అవును.. ఇప్ప‌టికి ఇంతే.. మాట వినండి!” అని ఉత్త‌రాంధ్ర‌కు చెందిన కీల‌క నాయ‌కుడికి సీఎం జ‌గ‌న్ చెప్పిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఒక‌రిద్ద‌రు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కొన్నాళ్లుగా సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర మొర‌పెడుతున్నారు. అయితే.. సీఎం జ‌గ‌న్ మాత్రం వారి వాద‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

చాలా మంది నాయ‌కులు.. త‌మ త‌మ వార‌సులను రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. పేర్ని నాని.. అయితే. దూకుడుగా ఉన్నారు. ఇక‌, జ‌గ‌న్ ప్ర‌మేయంతో సంబంధమే లేద‌న్న‌ట్టుగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫా త‌న పుత్రిక‌ను ప్ర‌క‌టించేశారు. ఇక‌, చాలా మంది రెడీగా ఉన్నారు. కొంద‌రు జ‌గ‌న్ ఒప్పుకుంటార‌ని భ‌రోసాగా ఉండ‌డంతో త‌మ వారిని ప్ర‌చారంలోకి కూడా దింపేస్తున్నారు.

దీంతో ఈ విష‌యం అధిష్టానం ద‌గ్గ‌ర చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ విష‌యంలో ఏం చేయాల‌నేది పార్టీ సీరియ‌స్‌గానే చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికి వ‌ర‌కు అయితే.. వార‌సుల‌కు టికెట్లు ఇచ్చేది లేద‌ని.. అత్యంత ముఖ్యం.. త‌ప్ప‌దు అనుకున్న ఒక‌టి రెండు స్థానాల్లో త‌ప్ప‌.. మిగిలిన వాటిలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఒప్పుకొనేది లేద‌ని కూడా సీఎం జ‌గన్ స్ప‌ష్టం చేసిన‌ట్టు స‌మాచారం.

ఇదే విష‌యాన్ని కీల‌క స‌ల‌హాదారు.. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ముఖ్య‌నాయ‌కుడికి స‌మాచారం ఇచ్చార‌ని తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మాత్రం పంతం ప‌ట్టి కూర్చున్నార‌ని.. అంటున్నారు. అలాగ‌ని.. తిరుగుబాటు చేసే ప‌రిస్థితి లేద‌ని కూడా అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on January 2, 2023 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago