ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన మృత్యు హేలపై వైసీపీ నాయకులు అందరిదీ ఒకే మాట. మంత్రులు మూకుమ్మడిగా చెబుతున్న మాట.. చేస్తున్న ఆరోపణ.. ‘చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని!’- మరోవైపు.. సీఎం జగన్మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు.
కానీ, మంత్రుల నుంచి నాయకుల వరకు వరుస పెట్టి మాత్రం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది విమర్శలకు సమయమా? ‘రేపంటూ మనకు కూడా ఒక రోజు ఉంటుంది!’ అన్నట్టు.. రాజకీయాల్లో ఏదీ ఎవరికీ శాశ్వతం కాదు.. ఏదీ ఎవరూ.. రాసిపెట్టుకునీ లేరు. సభలు, సమావేశాల్లో ఇలాంటివి జరగడం దురదృష్టకరమే అయినా.. రాజకీయం చేయడం సరికాదనేది తెలియదా?!
మంత్రి రోజా నుంచి తానేటి వనిత వరకు మేరుగ నుంచి కాకాని గోవర్ధన్రెడ్డి వరకు.. దాదాపు 8 మంది మంత్రులు ఒకే మాటగా.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే.. ఈ స్క్రిప్టు రాసిందెవరు? అనేది ఇప్పుడు వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి వర్గాల్లోనూ.. విస్మయంగా ఉంది. ఎవరైనా.. విమర్శించాలంటే.. వేర్వేరుగా విమర్శలు ఉంటాయి. కానీ, పనిగట్టుకుని ఒకే విమర్శ చేయడం గమనార్హం.
ఇది ఉద్దేశం పూర్వకంగా.. తాడేపల్లి వర్గాల నుంచి వస్తున్న సూచనల మేరకు నేతలు రెచ్చిపోతున్నారని.. కానీ, సరికాదనేది మేధావుల మాట. ఈరోజు బాబు.. రేపు ఎవరైనా.. అనే పరిస్థితి ఉంటుందని.. కావాలని.. చేసింది కాదని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో కందుకూరు రగడ.. టీడీపీలో విస్మయాన్ని.. విషాదాన్ని మిగిలిస్తే… ఇంతకు మించిన ఛాన్స్ రాదన్నట్టు వైసీపీలో చర్చసాగుతోంది.
This post was last modified on December 29, 2022 8:34 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…