ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన మృత్యు హేలపై వైసీపీ నాయకులు అందరిదీ ఒకే మాట. మంత్రులు మూకుమ్మడిగా చెబుతున్న మాట.. చేస్తున్న ఆరోపణ.. ‘చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి పట్టిందని!’- మరోవైపు.. సీఎం జగన్మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు.
కానీ, మంత్రుల నుంచి నాయకుల వరకు వరుస పెట్టి మాత్రం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది విమర్శలకు సమయమా? ‘రేపంటూ మనకు కూడా ఒక రోజు ఉంటుంది!’ అన్నట్టు.. రాజకీయాల్లో ఏదీ ఎవరికీ శాశ్వతం కాదు.. ఏదీ ఎవరూ.. రాసిపెట్టుకునీ లేరు. సభలు, సమావేశాల్లో ఇలాంటివి జరగడం దురదృష్టకరమే అయినా.. రాజకీయం చేయడం సరికాదనేది తెలియదా?!
మంత్రి రోజా నుంచి తానేటి వనిత వరకు మేరుగ నుంచి కాకాని గోవర్ధన్రెడ్డి వరకు.. దాదాపు 8 మంది మంత్రులు ఒకే మాటగా.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే.. ఈ స్క్రిప్టు రాసిందెవరు? అనేది ఇప్పుడు వైసీపీలోనే చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లి వర్గాల్లోనూ.. విస్మయంగా ఉంది. ఎవరైనా.. విమర్శించాలంటే.. వేర్వేరుగా విమర్శలు ఉంటాయి. కానీ, పనిగట్టుకుని ఒకే విమర్శ చేయడం గమనార్హం.
ఇది ఉద్దేశం పూర్వకంగా.. తాడేపల్లి వర్గాల నుంచి వస్తున్న సూచనల మేరకు నేతలు రెచ్చిపోతున్నారని.. కానీ, సరికాదనేది మేధావుల మాట. ఈరోజు బాబు.. రేపు ఎవరైనా.. అనే పరిస్థితి ఉంటుందని.. కావాలని.. చేసింది కాదని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో కందుకూరు రగడ.. టీడీపీలో విస్మయాన్ని.. విషాదాన్ని మిగిలిస్తే… ఇంతకు మించిన ఛాన్స్ రాదన్నట్టు వైసీపీలో చర్చసాగుతోంది.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…