Political News

అంద‌రిదీ ఒకే మాట‌.. ‘స్క్రిప్టు’ రాసిందెవ‌రు?

ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన మృత్యు హేల‌పై వైసీపీ నాయ‌కులు అంద‌రిదీ ఒకే మాట‌. మంత్రులు మూకుమ్మ‌డిగా చెబుతున్న మాట‌.. చేస్తున్న ఆరోప‌ణ‌.. ‘చంద్ర‌బాబుకు ప‌బ్లిసిటీ పిచ్చి ప‌ట్టింద‌ని!’- మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్‌మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం కూడా ప్ర‌క‌టించారు.

కానీ, మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వ‌రుస పెట్టి మాత్రం చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది విమ‌ర్శ‌ల‌కు స‌మ‌య‌మా? ‘రేపంటూ మ‌న‌కు కూడా ఒక రోజు ఉంటుంది!’ అన్న‌ట్టు.. రాజ‌కీయాల్లో ఏదీ ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు.. ఏదీ ఎవ‌రూ.. రాసిపెట్టుకునీ లేరు. స‌భలు, స‌మావేశాల్లో ఇలాంటివి జ‌ర‌గ‌డం దురదృష్ట‌క‌ర‌మే అయినా.. రాజ‌కీయం చేయ‌డం స‌రికాద‌నేది తెలియ‌దా?!

మంత్రి రోజా నుంచి తానేటి వ‌నిత వ‌ర‌కు మేరుగ నుంచి కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ‌ర‌కు.. దాదాపు 8 మంది మంత్రులు ఒకే మాట‌గా.. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే.. ఈ స్క్రిప్టు రాసిందెవ‌రు? అనేది ఇప్పుడు వైసీపీలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాడేప‌ల్లి వ‌ర్గాల్లోనూ.. విస్మ‌యంగా ఉంది. ఎవ‌రైనా.. విమ‌ర్శించాలంటే.. వేర్వేరుగా విమ‌ర్శ‌లు ఉంటాయి. కానీ, ప‌నిగ‌ట్టుకుని ఒకే విమ‌ర్శ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇది ఉద్దేశం పూర్వ‌కంగా.. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వ‌స్తున్న సూచ‌న‌ల మేర‌కు నేత‌లు రెచ్చిపోతున్నార‌ని.. కానీ, స‌రికాద‌నేది మేధావుల మాట‌. ఈరోజు బాబు.. రేపు ఎవ‌రైనా.. అనే ప‌రిస్థితి ఉంటుంద‌ని.. కావాల‌ని.. చేసింది కాద‌ని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో కందుకూరు ర‌గ‌డ‌.. టీడీపీలో విస్మ‌యాన్ని.. విషాదాన్ని మిగిలిస్తే… ఇంత‌కు మించిన ఛాన్స్ రాద‌న్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ‌సాగుతోంది.

This post was last modified on December 29, 2022 8:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

4 hours ago

‘ప్యారడైజ్’ బిర్యాని… ‘సంపూ’ర్ణ వాడకం అంటే ఇది

దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

5 hours ago

జనసేనలోకి కాంగ్రెస్ నేత – షర్మిల ఎఫెక్టేనా?

రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతూనే ఉంటాయి. ప్ర‌త్య‌ర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామ‌మే ఉమ్మ‌డి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…

6 hours ago

బన్నీ-అట్లీ… అప్పుడే ఎందుకీ కన్ఫ్యూజన్

ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…

7 hours ago

అవతార్ 3 టాక్ ఏంటి తేడాగా ఉంది

భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…

8 hours ago

జననాయకుడుకి ట్విస్ట్ ఇస్తున్న పరాశక్తి ?

మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…

9 hours ago