Political News

అంద‌రిదీ ఒకే మాట‌.. ‘స్క్రిప్టు’ రాసిందెవ‌రు?

ఔను.. నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన మృత్యు హేల‌పై వైసీపీ నాయ‌కులు అంద‌రిదీ ఒకే మాట‌. మంత్రులు మూకుమ్మ‌డిగా చెబుతున్న మాట‌.. చేస్తున్న ఆరోప‌ణ‌.. ‘చంద్ర‌బాబుకు ప‌బ్లిసిటీ పిచ్చి ప‌ట్టింద‌ని!’- మ‌రోవైపు.. సీఎం జ‌గ‌న్‌మాత్రం ఢిల్లీలో ఉండి.. సంతాపం ప్ర‌క‌టించారు. మృతుల కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం కూడా ప్ర‌క‌టించారు.

కానీ, మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు వ‌రుస పెట్టి మాత్రం చంద్ర‌బాబుపై నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి ఇది విమ‌ర్శ‌ల‌కు స‌మ‌య‌మా? ‘రేపంటూ మ‌న‌కు కూడా ఒక రోజు ఉంటుంది!’ అన్న‌ట్టు.. రాజ‌కీయాల్లో ఏదీ ఎవ‌రికీ శాశ్వ‌తం కాదు.. ఏదీ ఎవ‌రూ.. రాసిపెట్టుకునీ లేరు. స‌భలు, స‌మావేశాల్లో ఇలాంటివి జ‌ర‌గ‌డం దురదృష్ట‌క‌ర‌మే అయినా.. రాజ‌కీయం చేయ‌డం స‌రికాద‌నేది తెలియ‌దా?!

మంత్రి రోజా నుంచి తానేటి వ‌నిత వ‌ర‌కు మేరుగ నుంచి కాకాని గోవ‌ర్ధ‌న్‌రెడ్డి వ‌ర‌కు.. దాదాపు 8 మంది మంత్రులు ఒకే మాట‌గా.. చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే.. ఈ స్క్రిప్టు రాసిందెవ‌రు? అనేది ఇప్పుడు వైసీపీలోనే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాడేప‌ల్లి వ‌ర్గాల్లోనూ.. విస్మ‌యంగా ఉంది. ఎవ‌రైనా.. విమ‌ర్శించాలంటే.. వేర్వేరుగా విమ‌ర్శ‌లు ఉంటాయి. కానీ, ప‌నిగ‌ట్టుకుని ఒకే విమ‌ర్శ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇది ఉద్దేశం పూర్వ‌కంగా.. తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి వ‌స్తున్న సూచ‌న‌ల మేర‌కు నేత‌లు రెచ్చిపోతున్నార‌ని.. కానీ, స‌రికాద‌నేది మేధావుల మాట‌. ఈరోజు బాబు.. రేపు ఎవ‌రైనా.. అనే ప‌రిస్థితి ఉంటుంద‌ని.. కావాల‌ని.. చేసింది కాద‌ని చెబుతున్నారు. మొత్తానికి ఏపీలో కందుకూరు ర‌గ‌డ‌.. టీడీపీలో విస్మ‌యాన్ని.. విషాదాన్ని మిగిలిస్తే… ఇంత‌కు మించిన ఛాన్స్ రాద‌న్న‌ట్టు వైసీపీలో చ‌ర్చ‌సాగుతోంది.

This post was last modified on December 29, 2022 8:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

25 minutes ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

2 hours ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

3 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

5 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

7 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago