Political News

కందుకూరు ఘ‌ట‌న‌: బాబుకు మోడీ బాస‌ట‌..

నెల్లూరు జిల్లా కందుకూరులో జ‌రిగిన ఘోరంపై ప్ర‌ధానిన‌రేంద్ర మోడీ రియాక్ట్ అయ్యారు. చంద్ర‌బాబుకు బాస‌ట‌గా ఉంటామ‌ని తెలిపారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌పై తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేసిన Modi.. బాధిత కుటుంబాల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున ప‌రిహారం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి రూ.50 వేల చొప్పున ఇవ్వ‌నున్న‌ట్టు తెలిపారు. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు ధైర్యంగా ఉండాల‌ని కూడా మోడీ సూచించారు.

ఏం జ‌రిగిందంటే..

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధిఏత‌ చంద్రబాబు నాయుడి పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బహిరంగ సభ వద్ద జ‌రిగిన తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా 8 మంది మృతి చెందారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన చంద్రబాబు.. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌పై ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి పేరుతో టీడీపీ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా టీడీపీ అధ్య‌క్షులు చంద్ర‌బాబు ప‌ర్య‌టించి.. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలోనే బుధవారం ఆయ‌న నెల్లూరు జిల్లా కందుకూరులో ప‌ర్య‌టించారు. రాత్రి 7 గంట‌ల 30 నిమిషాల‌ స‌మ‌యంలో కందుకూరు పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ దగ్గరకు చేరుకుని బహిరంగ సభలో ప్ర‌సంగించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. అయితే, అప్పటికే భారీగా జనం రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది.

చంద్రబాబు వాహనం వెంట కూడా జనం పెద్దఎత్తున రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో అక్కడున్న ద్విచక్రవాహ నాలపై కొందరు పడిపోగా.. మరికొందరు 5 అడుగుల లోతున పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన టీడీపీ నేతలు డ్రైనేజీలో పడిపోయినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు వారిని రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఘటనా స్థలంలో ఇద్దరు చనిపోగా.. ఆసుపత్రిలో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

మృతి చెందినవారు వీరే
ఉలవపాడు మండలం ఆత్మకూరుకు చెందిన రవీంద్రబాబు
వరిచేను సంఘానికి చెందిన యాకసరి విజయమ్మ
కందుకూరు నాచారమ్మ కాలనీకి చెందిన రాజేశ్వరి
కందుకూరుకు చెందిన కాకుమాని రాజా
గుడ్లూరు మండలం అమ్మవారిపాలెంకు చెందిన చినకొండయ్య
కొండముడుసు పాలానికి చెందిన కలవకూరి యానాది
కందుకూరి మండలం జోగూరుకు చెందిన గడ్డం మధుబాబు
గుడ్లూరు మండలానికి చెందిన పురుషోత్తం  

This post was last modified on December 29, 2022 1:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

4 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

6 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

6 hours ago

చేతులు కాలాక ఆలోచిస్తే ఏం లాభం

రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…

6 hours ago

నారావారి ప‌ల్లెముచ్చ‌ట్లు: మ‌న‌వ‌డి ఆట‌లు – తాత మురిపాలు

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత గ్రామం.. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని నారావారి ప‌ల్లెలో ముంద‌స్తు సంక్రాంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.…

8 hours ago

రవితేజకు రిలీఫ్ దొరికినట్టేనా

గత కొన్నేళ్లుగా మినిమమ్ హిట్ లేకుండా అభిమానులను హర్ట్ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ ఈసారి పూర్తిగా రూటు మార్చి…

8 hours ago