Political News

ప్ర‌తిప‌క్ష‌మ‌నే ఉదాశీన‌తే.. ప్రాణాలు తీసిందా?

ఔను! ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట ఇదే! నెల్లూరు జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? భౌతిక కార‌ణం.. అంటే క‌ళ్ల‌ముందు మాత్రం.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వస్తున్నారు.. కాబ‌ట్టి వేల సంఖ్య‌లో స‌భ‌కు జ‌నాలు వ‌చ్చారు.. సో.. తొక్కిస‌లాట జ‌రిగింది.. అందుకే చ‌నిపోయారు!

కానీ, తెర‌దీసి చూస్తే.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఎంత విఫ‌ల‌మైందో.. పోలీసు వ్య‌వ‌స్థ ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించిందో క‌ళ్ల‌కు క‌డుతోంది. ఎందుకంటే.. చంద్ర‌బాబు స‌భ‌లు ఇప్పుడు కొత్త‌కాదు. ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రంలోని విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలిలోనూ.. ఆయ‌న స‌భ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కూడా భారీ ఎత్తున వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు, అభిమానులు పోటెత్తార‌నేది తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం గ‌త వారం రోజుల నుంచి ప్రచారంలో ఉంది.

ఈ నేప‌థ్యంలో పోలీసులు.. కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ.. విజ‌య‌న‌గ‌రంలో నిర్వ‌హించిన స‌భ‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని.. ఇక్క‌డ చ‌ర్య‌లు తీసుకుని ఉన్నా.. ప్ర‌జ‌ల‌ను అదిలించి ఉన్నా.. ప్ర‌త్యేక ఏర్పాటు చేసుకోవాల‌ని.. టీడీపీ నేత‌ల‌కు సూచించి ఉన్నా.. ఈ పెను విషాదం జ‌రిగి ఉండేది కాదు. కానీ, ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పార‌నో.. లేక‌.. మ‌రో కార‌ణమో.. తెలియ‌దు కానీ.. పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులుకానీ.. చాలా నింపాదిగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది.

అప్ప‌ట్లోనూ తోపులాట చోటు చేసుకుంది. ఇక‌, ఇప్పుడు ఏకంగా 8 మంది ప్రాణాలు డ్రైనేజీలో క‌లిసిపోయాయి. దీనికి కార‌ణం.. పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందు చూపు లోపించ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి ఇటీవ‌ల కాలంలో ప్ర‌జాద‌ర‌ణ పెరిగిన నేప‌థ్యంలో వారు ఒకింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాద‌ని అంటున్నారు.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

7 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

9 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

11 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

11 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

12 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

12 hours ago