Political News

ప్ర‌తిప‌క్ష‌మ‌నే ఉదాశీన‌తే.. ప్రాణాలు తీసిందా?

ఔను! ఇప్పుడు స‌ర్వ‌త్రా వినిపిస్తున్న మాట ఇదే! నెల్లూరు జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్య‌టిస్తున్న స‌మ‌యంలో కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? భౌతిక కార‌ణం.. అంటే క‌ళ్ల‌ముందు మాత్రం.. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌కు వస్తున్నారు.. కాబ‌ట్టి వేల సంఖ్య‌లో స‌భ‌కు జ‌నాలు వ‌చ్చారు.. సో.. తొక్కిస‌లాట జ‌రిగింది.. అందుకే చ‌నిపోయారు!

కానీ, తెర‌దీసి చూస్తే.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఎంత విఫ‌ల‌మైందో.. పోలీసు వ్య‌వ‌స్థ ఎంత దారుణంగా వ్య‌వ‌హ‌రించిందో క‌ళ్ల‌కు క‌డుతోంది. ఎందుకంటే.. చంద్ర‌బాబు స‌భ‌లు ఇప్పుడు కొత్త‌కాదు. ఇటీవ‌ల విజ‌య‌న‌గ‌రంలోని విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలిలోనూ.. ఆయ‌న స‌భ‌లు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా కూడా భారీ ఎత్తున వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు, అభిమానులు పోటెత్తార‌నేది తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా చంద్ర‌బాబు నెల్లూరు ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం గ‌త వారం రోజుల నుంచి ప్రచారంలో ఉంది.

ఈ నేప‌థ్యంలో పోలీసులు.. కానీ, రెవెన్యూ యంత్రాంగం కానీ.. విజ‌య‌న‌గ‌రంలో నిర్వ‌హించిన స‌భ‌ను ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని.. ఇక్క‌డ చ‌ర్య‌లు తీసుకుని ఉన్నా.. ప్ర‌జ‌ల‌ను అదిలించి ఉన్నా.. ప్ర‌త్యేక ఏర్పాటు చేసుకోవాల‌ని.. టీడీపీ నేత‌ల‌కు సూచించి ఉన్నా.. ఈ పెను విషాదం జ‌రిగి ఉండేది కాదు. కానీ, ప్ర‌భుత్వ పెద్ద‌లు చెప్పార‌నో.. లేక‌.. మ‌రో కార‌ణమో.. తెలియ‌దు కానీ.. పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులుకానీ.. చాలా నింపాదిగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్ల‌దాడి జ‌రిగిన‌ప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితే ఏర్ప‌డింది.

అప్ప‌ట్లోనూ తోపులాట చోటు చేసుకుంది. ఇక‌, ఇప్పుడు ఏకంగా 8 మంది ప్రాణాలు డ్రైనేజీలో క‌లిసిపోయాయి. దీనికి కార‌ణం.. పోలీసులు, రెవెన్యూ అధికారుల ముందు చూపు లోపించ‌డ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడికి ఇటీవ‌ల కాలంలో ప్ర‌జాద‌ర‌ణ పెరిగిన నేప‌థ్యంలో వారు ఒకింత బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించి ఉంటే.. ఈ విషాద ఘ‌ట‌న జ‌రిగి ఉండేది కాద‌ని అంటున్నారు.

This post was last modified on December 29, 2022 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రొడ్యూసర్ కిరణ్ సక్సెస్ అయినట్టేనా

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాను నటించకుండా నిర్మించిన సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. సుమారు నలభైకి పైగా కొత్తవాళ్లను పరిచయం…

1 hour ago

ఆదిత్య ధర్ స్టోరీలు అమ్మేసుకున్న ఫ్రెండు

ఆదిత్య ధర్.. గత నాలుగు నెలలుగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. దురంధర్, దురంధర్-2 చిత్రాలతో అతను రేపిన సంచలనం అంతా…

1 hour ago

కేరళలో వివాదం చేసి తెలుగులో స్పందించిన నటుడు

ఇటీవల కేరళలో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి…

2 hours ago

జ‌గ‌న్ ను రాకుండా చేస్తానంటున్న 80 ఏళ్ల ఎమ్మెల్యే

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అధికారంలోకి రాకుండా చేస్తాన‌ని.. అవ‌స‌ర‌మైతే.. చంద్ర‌బాబు ఓకే అంటే.. తాను కూడా పాద‌యాత్ర‌కు రెడీ అంటూ..…

2 hours ago

ప్రతాప్ కోరుకున్న పుణ్యం ఏమయ్యింది

హీరో తిరువీర్ కథల ఎంపిక పట్ల ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం ఉంది. మాసూద లాంటి హారర్ మూవీ, ది గ్రేట్…

3 hours ago

సూపర్ స్టార్ కొడుకు జీతం రూ.4500

ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్లలో ఒకడు అక్షయ్ కుమార్. ఒక దశలో ఏడాదిలో అత్యధిక ఆదాయం అందుకునే, అత్యధికంగా పన్ను…

4 hours ago