Political News

చంద్ర‌బాబు స‌భ‌లో అప‌శ్రుతి.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం నెల్లూరులో ప‌ర్య‌టిస్తున్నారు. తొలి రోజు బుధ‌వారం ఆయ‌న‌ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌భ ప్రారంభించే స‌మ‌యానికి బాబు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నాలు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఏడుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డి మృతి చెందారు. మ‌రో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభ వద్దకు చేరుకున్న‌ సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనపై బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. డ్రైనేజ్ కాలువ గట్టుపై ఎక్కిన కార్య‌క‌ర్త‌లు.. చంద్ర‌బాబును చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో తోపులాటకు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డిపోయి.. ఊపిరాడక మృతి చెందారు. అయితే.. కార్య‌క‌ర్త‌లు డ్రైనేజీ కాలువలో పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. కొంద‌రిని బ‌య‌ట‌కు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు, ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఇద్ద‌రు.. చికిత్స అందిస్తుండగా మరొకరు మృతి చెందారు.

అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

This post was last modified on December 28, 2022 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago