Political News

చంద్ర‌బాబు స‌భ‌లో అప‌శ్రుతి.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం నెల్లూరులో ప‌ర్య‌టిస్తున్నారు. తొలి రోజు బుధ‌వారం ఆయ‌న‌ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌భ ప్రారంభించే స‌మ‌యానికి బాబు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నాలు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఏడుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డి మృతి చెందారు. మ‌రో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభ వద్దకు చేరుకున్న‌ సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనపై బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. డ్రైనేజ్ కాలువ గట్టుపై ఎక్కిన కార్య‌క‌ర్త‌లు.. చంద్ర‌బాబును చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో తోపులాటకు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డిపోయి.. ఊపిరాడక మృతి చెందారు. అయితే.. కార్య‌క‌ర్త‌లు డ్రైనేజీ కాలువలో పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. కొంద‌రిని బ‌య‌ట‌కు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు, ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఇద్ద‌రు.. చికిత్స అందిస్తుండగా మరొకరు మృతి చెందారు.

అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

Satya

Recent Posts

రాజు గారి స్థలంలో వైసీపీ కార్యాలయమా…?

ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…

6 minutes ago

పవన్ కు మరో శస్త్ర చికిత్స

పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…

1 hour ago

ఐపీఎస్ సునీల్ రిటైర్మెంట్‌… ఎలాంటి ఇబ్బంది లేకుండా!

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును వేధింపుల‌కు గురిచేసి.. క‌స్ట‌డీలో టార్చ‌ర్ చేశార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…

2 hours ago

‘రాజ‌కీయాలు చెడ్డ‌వేం కావు… రండి’

రాజ‌కీయాలంటే చాలా మంది చెడిపోయాయ‌ని అనుకుంటారు. కానీ, రాజ‌కీయాలు అంత‌గా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కార‌ణంగానే ఈ పేరు…

2 hours ago

శృతి తప్పుతున్న AI వాడకం

జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…

2 hours ago

ప‌ద్మ అవార్డులు అడిగి ఇస్తారా?

దేశ అత్యున్న‌త పౌర పుర‌స్కారాలైన ప‌ద్మ అవార్డుల‌ను ఎంత ప్రతిష్ఠాత్మ‌కంగా భావిస్తారో తెలిసిందే. ప్ర‌తిసారీ అవార్డులు ప్ర‌క‌టించిన‌పుడు గ్ర‌హీత‌ల అర్ఙ‌త‌ల…

3 hours ago