Political News

చంద్ర‌బాబు స‌భ‌లో అప‌శ్రుతి.. ఏడుగురు దుర్మ‌ర‌ణం

తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం నెల్లూరులో ప‌ర్య‌టిస్తున్నారు. తొలి రోజు బుధ‌వారం ఆయ‌న‌ కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్ షో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స‌భ ప్రారంభించే స‌మ‌యానికి బాబు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నాలు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఏడుగురు టీడీపీ కార్య‌క‌ర్త‌లు.. ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డి మృతి చెందారు. మ‌రో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభ వద్దకు చేరుకున్న‌ సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనపై బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. డ్రైనేజ్ కాలువ గట్టుపై ఎక్కిన కార్య‌క‌ర్త‌లు.. చంద్ర‌బాబును చూసేందుకు ఎగ‌బ‌డ్డారు. దీంతో తోపులాటకు దారి తీసింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప‌క్క‌నే ఉన్న డ్రైనేజీలో ప‌డిపోయి.. ఊపిరాడక మృతి చెందారు. అయితే.. కార్య‌క‌ర్త‌లు డ్రైనేజీ కాలువలో పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. కొంద‌రిని బ‌య‌ట‌కు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు, ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఇద్ద‌రు.. చికిత్స అందిస్తుండగా మరొకరు మృతి చెందారు.

అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించారు. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అని చంద్ర‌బాబు పేర్కొన్నారు.  

This post was last modified on December 28, 2022 9:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

10 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago