Chandrababu
తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరులో పర్యటిస్తున్నారు. తొలి రోజు బుధవారం ఆయన కందుకూరు నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సభ ప్రారంభించే సమయానికి బాబు పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. భారీగా తరలి వచ్చిన జనాలు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు.. పక్కనే ఉన్న డ్రైనేజీలో పడి మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు.
చంద్రబాబు రోడ్ షో బహిరంగ సభ వద్దకు చేరుకున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనపై బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైనేజ్ కాలువ గట్టుపై ఎక్కిన కార్యకర్తలు.. చంద్రబాబును చూసేందుకు ఎగబడ్డారు. దీంతో తోపులాటకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పలువురు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయి.. ఊపిరాడక మృతి చెందారు. అయితే.. కార్యకర్తలు డ్రైనేజీ కాలువలో పడిన వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. కొందరిని బయటకు తీసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించే క్రమంలో ఇద్దరు, ఘటనా స్థలంలోనే ఇద్దరు.. చికిత్స అందిస్తుండగా మరొకరు మృతి చెందారు.
అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకొన్న చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మా కుటుంబ సభ్యులైన టిడిపి కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశాం. వారంతా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. అని చంద్రబాబు పేర్కొన్నారు.
This post was last modified on December 28, 2022 9:58 pm
భయపడినట్టే జరిగింది. దురంధర్ ది రివెంజ్ తెలుగు ప్రీమియర్లు క్యాన్సిలయ్యాయని ట్రేడ్ టాక్. పివిఆర్ ఐనాక్స్ లాంటి మల్టీప్లెక్సులు ఇప్పటికే…
ఓజితో పోలిస్తే ఆ స్థాయిలో బజ్ లేదు. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్…
మూవీ లవర్స్ కౌంట్ డౌన్ టైమర్ పెట్టేసుకున్నారు. సాయంత్రం అయిదు గంటలు ఎప్పుడెప్పుడు అవుతుందా, దురంధర్ ది రివెంజ్ ప్రీమియర్లు…
'మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మె ల్యే రోహిత్రెడ్డి విషయం మాజీ…
వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది.…
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఇప్పుడంత మంచి ఫాంలో లేడు. ఆయన చివరి సినిమా ‘మిస్టర్ బచ్చన్’ పెద్ద డిజాస్టర్…