Political News

కాపు నేత సీఎం అయితే త‌ప్పేంటి: నాని

వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి Perni Nani సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. ఒక‌వైపు వంగ‌వీటి రంగా హ‌త్య‌పైనా.. ఆయ‌న వ‌ర్ధంతి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌పై రాష్ట్రంలో తీవ్ర స్తాయిలో రాజ‌కీయ యుద్ధం జ‌రుగుతున్న నేప‌థ్యంలో అదే కాపుల‌ను ఉద్దేశించి పేర్ని నాని సంచ‌ల‌న కామెంట్లుచేశారు. ఏపీకి కాపు నేత సీఎం అయితే తప్పేంటి? అని ప్రశ్నించారు. సమాజాన్ని చైతన్యపరిచే వ్యక్తి వస్తే.. ఏపీకి కాపు నేత సీఎం కావొచ్చన్నారు.

రాష్ట్రంలో కాపుల‌కు వ‌చ్చిన న‌ష్టం ఏంటని ఆయ‌న ప్ర‌శ్నించారు. కాపుల త‌ర‌ఫున మాట్లాడుతున్న కొంద‌రు టీడీపీ నాయ‌కులు గ‌తంలో ముద్ర‌గ‌డ‌ను కొట్టించిన‌ప్పుడు.. ఇంట్లో బంధించిన‌ప్పుడు ఎక్కడ ఉన్నార‌ని విమ‌ర్శించారు. కాపు నాయ‌కుడు ముఖ్య‌మంత్రి అయితే.. మంచిదే. రాష్ట్రానికి కాపుల్లో స‌మ‌ర్ధుడు ఉన్నాడ‌ని అనుకుంటే.. ప్ర‌జ‌లే ప‌ట్టం క‌డ‌తారు. జ‌గ‌న్ ఆపితే ఆగిపోతారా? నేను ఆపితే ఆగిపోతారా? ఎవ‌రు ఏం చేస్తున్నారో.. ఎవ‌రు ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎన్ని నాట‌కాలు ఆడుతున్నారో.. అంద‌రికీ తెలిసిందే అని ప‌రోక్షంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు.

జోగ‌య్య హెచ్చ‌రిక‌ల‌పై..

కాపు నాయ‌కుడు, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దీక్షను స్వాగతిస్తున్నామని పేర్నినాని ప్రకటించారు. కాపులకు ఆమోదయోగ్యమైన ప్రభుత్వ ఉత్తర్వును డిసెంబరు నెలాఖరులోగా ఇవ్వకుంటే జనవరి 2 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రభుత్వాన్ని హరిరామ జోగయ్య హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీఎం జగన్ కు రాసిన లేఖ కూడా రాశారు. కాపులపై సీఎంకు ఏమాత్రం ప్రేమ లేదని, కాపులు ఆర్థికంగా ఎదగడం ఆయనకు ఇష్టం లేదని విమర్శించారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కేంద్ర ప్ర‌భుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించగా అందులో 5 శాతం కాపులకు ఇవ్వడానికి టీడీపీ హయాంలో ప్రయత్నించారని గుర్తుచేశారు. బిల్లు గవర్నర్ ఆమోదం పొందే సమయానికి జగన్‌ అధికారంలోకి రావడంతో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు దక్కలేదని తెలిపారు. మూడేళ్లలో జగన్‌ కాపులకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. అయితే.. ఎవ‌రు ఎవ‌రికి అన్యాయం చేశారో.. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు తీర్పు చెప్పార‌ని.. ఈ విష‌యం జోగ‌య్య‌కు తెలియ‌దా? అని పేర్ని ప్ర‌శ్నించారు.

This post was last modified on December 27, 2022 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

9 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago