టీడీపీ అధినేత Chandrababu రాజకీయాలను పరిశీలిస్తే.. ఆయనలో ఇంకా తెగువ కనిపించడం లేదు. ఇంకా సాచివేత, సాగదీత ధోరణులకే ఆయన మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు వస్తున్నాయి. నాయకులను పట్టుకుని ఆయన వేలాడుతున్నారో.. నాయకులు ఆయనను పట్టుకుని వేలాడోలో.. తెలియని ఒక సంకట స్థితిలో టీడీపీ నేడు జారిపోయింది.
గతంలో అన్నగారు NTR పార్టీని డీల్ చేశారు. ఒక దశలో రెడ్డి సామాజిక వర్గం.. అందరూ ఆయనపై ఉద్యమానికి దిగారు. మాకు కనీసం ప్రాధాన్యం ఇవ్వరా? అని ప్రశ్నించారు. వీరిలో అప్పటి మాధవరెడ్డి కూడా ఉన్నారు. అయితే.. ఎన్టీఆర్ వెనుకడుగు వేయలేదు. “ఔను.. మీకు ప్రాధాన్యం ఇచ్చేలా మీరు ఉండడం లేదు. మీరు కాంగ్రెస్కు కోవర్టులుగా పనిచేస్తున్నారు. ఇది నేను సహించను. ముందు మీరు మారండి. లేదా మార్పును ఆహ్వానించండి!” అని ముక్కుమీద గుద్దినట్టుచెప్పారు.
ఈ క్రమంలోనే పబ్బతిరెడ్డి జనార్దన్ వంటి వారు టీడీపీకి దూరమయ్యారు. అయినా ఎన్టీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అధికారం పోతుందని కానీ, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుందని కానీ, అనుకోలేదు. ప్రజల మధ్యకు వెళ్లారు. అధికారం తెచ్చుకున్నారు. వైసీపీని తీసుకున్నా.. ఇదే పరిస్థితి. అనేక మంది జగనను వ్యతిరేకించారు. మైసూరా రెడ్డి వంటివారు బహిరంగ విమర్శలు చేశారు.
అయినప్పటికీ.. Jagan తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడ్డారు. ఎన్నికల సమయంలోనూ.. వారి ఓట్లు పోతాయేమో.. వీరిని బుజ్జగించాలేమో..అని అనుకోలేదు. ప్రజలను బుజ్జగిస్తే.. చాలని అనుకున్నారు అదే చేశారు. కానీ, టీడీపీ పరిస్థితి ఇప్పుడు అలా అదేని అంటున్నారు.
ఎక్కడికక్కడ బాబును ఆడించేవారే కనిపిస్తున్నారు తప్ప.. బాబును మెరుగు పరిచేందుకు పార్టీని దూకుడుగా ముందుకు తీసుకువెళ్లేందుకు.. చాలా మంది ప్రయత్నించడం లేదు. మరి వీరిని ఎందుకు కొనసాగిస్తున్నారు? తాడోపేడో ఏదో ఒకటి తేలిపోతుంది.. 2019 కన్నా నష్టం ఇంక జరగదు. అయినా.. బాబు తెగించలేకపోవడం.. పార్టీకే శాపంగా మారింది.
This post was last modified on December 27, 2022 7:12 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…