ఏపీలో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు.. టీడీపీ అటు వైసీపీ నేతలు రెండు పక్షాల్లోనూ.. హైజాక్ రాజకీయాలు కనిపిస్తున్నాయి. అధినేతలు ఇద్దరూ.. కూడా వారి మానాన వారు తన్నుకుంటున్నారు. మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అధికారం నీదా.. నాదా.. అని వాదించుకుంటున్నారు. దీంతో ఫోకస్ అంతా కూడా.. వైసీపీ అధినేత సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది.
దీంతో క్షేత్రస్థాయిలో నాయకులు తమ పనుల్లో బిజీ అయిపోయారు. రెండు పార్టీల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అధినేతలు అడిగినప్పుడు చూద్దాం లే! అనుకుని నాయకులు ఎవరి పనుల్లో వారు ఉన్నారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు ఒకరు ప్రజల మధ్యకు వచ్చి 6 మాసాలు అయిపోయింది. కనీసం కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులో లేరు.
ఇక, వైసీపీలోనూ.. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఒకరు నిత్యం మీడియాలో ఉండేవారు. కానీ, ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో అంతో ఇంతో వెనుకేసుకునేందుకు వ్యాపారాల్లో మునిగిపోయారని.. పార్టీలోనే చర్చసాగుతోంది. అదేవిధంగా సీమలో కొందరు ఫైర్ బ్రాండ్లు.. కూడా పార్టీ అధినేత చంద్రబాబు ఏం చెప్పినా.. సరే సర్! అంటూ.. వెనక్కి తిరగ్గానే వ్యవహారాలు మార్చేస్తున్నారు.
ఇలా.. ఒక్క టీడీపీ అనికానీ, వైసీపీ అనికానీ కాదు.. రెండు పార్టీల్లోనూ అధినేతలు వారి పనుల్లో వారు ఉన్నారనే సాకుతో.. ఇటు కార్యకర్తలు, నాయకులు ఎవరి పనుల్లో వారు ఉన్నారు. దీంతో అధినేతలు వస్తేనే.. సందడి.. లేకపోతే.. ఏమీ లేదు.. అన్నట్టుగానే ఉంది పరిస్థితి. మరి ఇలా అయితే.. ఎలా? అనేది ప్రశ్న. ముఖ్యంగా టీడీపీ పుంజుకునే దశలో ఉన్నప్పుడు.. ఇలా చేయొచ్చా? అనేది ఆలోచించాలి.
This post was last modified on December 25, 2022 10:38 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…