కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నా.. జనాల్లో ఇప్పటికీ భయం ఉండట్లేదు. మనకు కరోనా రాదు.. వచ్చినా ఏమవుతుంది అనే ధీమా చాలామందిలో కనిపిస్తోంది. కానీ కరోనా అందరిపై ఒకే రకమైన ప్రభావం చూపించట్లేదు. కొందరి ఆరోగ్యాల్ని దారుణంగా దెబ్బ తీస్తోంది. ప్రాణాల్ని కూడా హరిస్తోంది.
అలాంటి నష్టం మన కుటుంబంలోనే జరిగితే ఏంటి పరిస్థితి అన్నది ఆలోచించాలి ప్రతి ఒక్కరూ. సొసైటీలో పలుకుపడి ఉన్న వ్యక్తులు సైతం కరోనాతో పోరాటంలో ఓడిపోతున్న వైనాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. హైదరాబాద్కు చెందిన ఓ ఏఎస్ఐ కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
కొన్నిసార్లు కరోనా సోకినప్పటికీ.. పరీక్షల్లో అది నిర్ధారణ కాకపోవడం ప్రమాదకరణ పరిణామంగా కనిపిస్తోంది. ప్రేమ్ కుమార్ అనే ఏఎస్ఐ విషయంలో అదే జరిగింది. ఆయనకు కరోనా లక్షణాలు కనిపించాయి. కానీ పరీక్షలు చేస్తే నాలుగుసార్లు నెగెటివ్ వచ్చింది. దీంతో మరీ సీరియస్గా తీసుకోలేదు. కానీ ఆరోగ్యం క్షీణించ సాగింది.
ఈ నెల 14న ఉదయం పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పడకల్లేవని తెలిసి.. వేరే చోట్ల ప్రయత్నించారు. ఏఎస్ఐ అయినా సరే.. ఆయనకు వేరే ఆసుపత్రుల్లో కూడా బెడ్ దొరకలేదు. దీంతో గాంధీకి తరలించారు. తర్వాత ఉన్నతాధికారుల జోక్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బెడ్ దొరకడంతో అక్కడికి తీసుకెళ్లారు.
కానీ ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మూత్రపిండాలు ఫెయిలయ్యాయి. వెంటిలేటర్ పెట్టారు. మళ్లీ పరీక్ష చేసి చికిత్స అందిస్తుండగానే శుక్రవారం ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆయన చనిపోయాక ఫలితం పాజిటివ్ అని తేలింది. ఈ ఉదంతం కరోనాతో ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియచెబుతుంది.
This post was last modified on July 18, 2020 4:26 pm
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించి... తొలి పదేళ్ల పాటు ఆ రాష్ట్రాన్ని పాలించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తన…
హీరోయిన్ కృతి శెట్టిని చూస్తుంటే పాపం అనిపించక మానదు. ఉప్పెనతో డెబ్యూ చేసినప్పుడు తనో సెన్సేషన్ అవుతుందని అందరూ భావించారు.…
మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు రానుంది. అభిమానులు మాములు ఎగ్జైట్ మెంట్ తో లేరు. ఏదో స్పెషల్ కంటెంట్…
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…