Political News

రూ.250 పెరిగింది.. 50 వేల పింఛ‌న్లు క‌ట్‌!

ఏపీలో సామాజిక‌ పెన్షన్ పొందే వారికి వైసీపీ ప్ర‌భుత్వం భారీ షాకిచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు.. ఇత‌ర‌త్రా ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి పింఛ‌న్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు లేని నిబంధ‌న‌లు వీరికి కూడా వ‌ర్తింప జేస్తూ.. తాజాగా పింఛ‌న్‌ను క‌ట్ చేస్తోంది. 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నా.. 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో పెన్షన్‌ నిలిపివేస్తున్నామంటూ వ‌లంటీర్లు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లో వివరణ పత్రా లు ఇవ్వకుంటే పెన్షన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఏపీలో పెన్షన్ల పెంపునకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. కేబినెట్ నిర్ణయం ఇప్పుడిస్తున్న పెన్షన్‌పై రూ.250 పెరగనుంది. ప్రస్తుతం పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగుతుంది.

2023 జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లకు తొలగించిన పెన్షన్ల జాబితాలు చేరినట్లు సమాచారం. జనవరి నుంచి పెన్షన్ మొత్తం రూ. 2750 చేస్తున్నామంటూనే, పెద్ద సంఖ్యలో పెన్షన్ల తొలగిస్తున్నారనే వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువు లు, ఒంట‌రి మ‌హిళ‌లు.. తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.

మ‌రోవైపు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పింఛన్లు తొలగించారని, వెంటనే అన్నిటిని ఆంక్షలు లేకుండా పునరు ద్ధ‌రించాల‌ని దివ్యాంగుల‌ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. వికలాంగుల , వితంతువుల వృద్ధాప్యంలో పింఛన్లు వెంటనే పున‌రుద్ధ‌రించాల‌న్నారు. వికలాంగుల సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉంద‌న్నారు. వివిధ కారణాలు చెప్పి సామాజిక పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమ‌ని ప్ర‌శ్నించారు.  

This post was last modified on December 23, 2022 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దారి తప్పుతున్న కంటెంట్లు – ఎవరు బాధ్యులు

ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…

9 minutes ago

మళ్ళీ అలా.. ఛాన్స్ వస్తే..

అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్‌లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్‌ని రివర్స్‌లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…

39 minutes ago

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

5 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

7 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

14 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

15 hours ago