ఏపీలో సామాజిక పెన్షన్ పొందే వారికి వైసీపీ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు.. ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి పింఛన్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పటి వరకు లేని నిబంధనలు వీరికి కూడా వర్తింప జేస్తూ.. తాజాగా పింఛన్ను కట్ చేస్తోంది. 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నా.. 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో పెన్షన్ నిలిపివేస్తున్నామంటూ వలంటీర్లు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లో వివరణ పత్రా లు ఇవ్వకుంటే పెన్షన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఏపీలో పెన్షన్ల పెంపునకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. కేబినెట్ నిర్ణయం ఇప్పుడిస్తున్న పెన్షన్పై రూ.250 పెరగనుంది. ప్రస్తుతం పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగుతుంది.
2023 జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లకు తొలగించిన పెన్షన్ల జాబితాలు చేరినట్లు సమాచారం. జనవరి నుంచి పెన్షన్ మొత్తం రూ. 2750 చేస్తున్నామంటూనే, పెద్ద సంఖ్యలో పెన్షన్ల తొలగిస్తున్నారనే వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువు లు, ఒంటరి మహిళలు.. తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పింఛన్లు తొలగించారని, వెంటనే అన్నిటిని ఆంక్షలు లేకుండా పునరు ద్ధరించాలని దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. వికలాంగుల , వితంతువుల వృద్ధాప్యంలో పింఛన్లు వెంటనే పునరుద్ధరించాలన్నారు. వికలాంగుల సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉందన్నారు. వివిధ కారణాలు చెప్పి సామాజిక పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
This post was last modified on December 23, 2022 6:44 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…