Political News

రూ.250 పెరిగింది.. 50 వేల పింఛ‌న్లు క‌ట్‌!

ఏపీలో సామాజిక‌ పెన్షన్ పొందే వారికి వైసీపీ ప్ర‌భుత్వం భారీ షాకిచ్చింది. ముఖ్యంగా దివ్యాంగులు.. ఇత‌ర‌త్రా ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి పింఛ‌న్ ఇస్తున్నారు. అయితే.. ఇప్పటి వ‌ర‌కు లేని నిబంధ‌న‌లు వీరికి కూడా వ‌ర్తింప జేస్తూ.. తాజాగా పింఛ‌న్‌ను క‌ట్ చేస్తోంది. 1000 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ ఉన్నా.. 300 యూనిట్లు దాటి విద్యుత్ బిల్లులు కట్టేవారికి పెన్షన్ కట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నేప‌థ్యంలో పెన్షన్‌ నిలిపివేస్తున్నామంటూ వ‌లంటీర్లు నోటీసులు ఇస్తున్నారు. 15 రోజుల్లో వివరణ పత్రా లు ఇవ్వకుంటే పెన్షన్ శాశ్వతంగా నిలిపివేస్తామంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల ఏపీలో పెన్షన్ల పెంపునకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నలిచ్చింది. కేబినెట్ నిర్ణయం ఇప్పుడిస్తున్న పెన్షన్‌పై రూ.250 పెరగనుంది. ప్రస్తుతం పెన్షన్ మొత్తం రూ.2,500 నుంచి రూ.2,750కి పెరగుతుంది.

2023 జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లు అమల్లోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వాలంటీర్లకు తొలగించిన పెన్షన్ల జాబితాలు చేరినట్లు సమాచారం. జనవరి నుంచి పెన్షన్ మొత్తం రూ. 2750 చేస్తున్నామంటూనే, పెద్ద సంఖ్యలో పెన్షన్ల తొలగిస్తున్నారనే వార్తతో రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, వితంతువు లు, ఒంట‌రి మ‌హిళ‌లు.. తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు.

మ‌రోవైపు రాష్ట్రవ్యాప్తంగా 50 వేల పింఛన్లు తొలగించారని, వెంటనే అన్నిటిని ఆంక్షలు లేకుండా పునరు ద్ధ‌రించాల‌ని దివ్యాంగుల‌ సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. వికలాంగుల , వితంతువుల వృద్ధాప్యంలో పింఛన్లు వెంటనే పున‌రుద్ధ‌రించాల‌న్నారు. వికలాంగుల సామాజిక బాధ్యత ప్రభుత్వంపై ఎంతో ఉంద‌న్నారు. వివిధ కారణాలు చెప్పి సామాజిక పింఛన్లు తొలగించడం ఎంతవరకు సమంజసమ‌ని ప్ర‌శ్నించారు.  

This post was last modified on December 23, 2022 6:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

10 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

22 minutes ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

3 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

4 hours ago

హీరోయిన్ సహనాన్ని మెచ్చుకోవాలి

సరైన భద్రత ఏర్పాట్లు చేయకుండా సినిమా, రాజకీయ ఈవెంట్లు పెడితే ఏం జరుగుతుందో.. ఎప్పటికప్పుడు ఉదాహరణలు చూస్తూనే ఉన్నాం. అయినా…

4 hours ago