Political News

బిగ్ క్వశ్చన్: టీడీపీ జోష్ ఎవరికి నష్టం?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజమే.. మారే కాలానికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చోటు చేసుకోవాలి. ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయ రంగంలో అనూహ్య పరిణామాలకు అవకాశం ఎక్కువ. అంతేకాదు.. ఒక పరిణామం మొత్తం సీన్ ను మార్చేస్తుంది. అప్పటివరకు ఉన్న లెక్కలు మారేలా చేస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ఉండదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న వేళ.. కేసీఆర్ తీసుకున్న బీఆర్ఎస్ నిర్ణయం పుణ్యమా అని.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే.

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో.. ఎంతో కాలం మునుపే జాతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో తన ఉనికిని ఎందుకు చాటుకోకూడదన్న ప్రశ్న తలెత్తింది. దీనికి సమాధానంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. రిస్కుకు సిద్దపడి ఖమ్మం శంఖారావం సభను ఏర్పాటు చేయటం ఇప్పుడు టీడీపీకి లాభంగా మారింది.

తెలంగాణలో టీడీపీ నిర్వహించే సభకు ఇంత భారీగా జనసందోహం రావటమా? అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంతకూ తెలంగాణలో టీడీపీ బలపడితే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఎవరికి వారు కూడికలు తీసివేతల్లో బిజీగా మారారు. రాజకీయ వర్గాల అంచనా చూసినప్పుడు టీడీపీ తెలంగాణలో బలపడితే.. నష్టం వాటిల్లేది టీఆర్ఎస్ కే నని చెప్పక తప్పదు. దీనికి కారణం టీడీపీ నుంచి అత్యధిక నేతలు కాంగ్రెస్ కు షిప్టు అయ్యారు.

కానీ.. సెకండ్ క్యాడర్.. ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కు వెళ్లిపోయారు. టీడీపీ జోష్ లోకి వస్తే.. ఇప్పటికిప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవు కానీ.. టీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్ల షేర్ లో మాత్రం తేడా రావటం ఖాయమని చెప్పాలి. గతంలో టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లోనూ.. హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లు చీలే అవకాశం ఖాయమని చెప్పాలి. గత ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చాలావరకు టీఆర్ఎస్ కు పడ్డాయి. అయితే.. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. జగన్ కు అనుకూలంగా గులాబీ బాస్ పావులు కదపటం తెలిసిందే.

ఏపీలో టీడీపీ దారుణ ఓటమికి గులాబీ బాస్ కేసీఆర్ కారణమన్న విషయంలో టీడీపీ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. కానీ.. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటంతో మౌనంగా ఉన్నారు. ఇప్పుడు తమకు అవకాశం లభించిన నేపథ్యంలో ఈ సారి గతంలో మాదిరి కాకుండా టీఆర్ఎస్ కు ఈసారి ఓట్లు వేసే అవకాశం తక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. టీడీపీ పోటీ చేసే ప్రతి చోట.. కనీసం వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఓట్లు చీలే వీలుందన్న అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. గులాబీ బాస్ కు జరిగే డ్యామేజ్ అధికమని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.

This post was last modified on December 22, 2022 2:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్ పై యుద్ధం… ట్రంప్ కొంప ముంచుతుందా?

ఇరాన్‌తో యుద్ధం విష‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా?  నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…

55 minutes ago

‘కల్కి’పై విమర్శలకు కట్టుబడి ఉన్న లిరిసిస్ట్

ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…

1 hour ago

ఎన్నిక‌ల క‌మిష‌నర్‌ను తొలగించడానికి తీర్మానమా?

దేశంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ప‌లు కీల‌క అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్ర‌ధాని పైనే గ‌త ఐదేళ్ల‌లో…

4 hours ago

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…

5 hours ago

థియేటర్ అనుభూతికి ‘సబ్ టైటిల్స్’ దెబ్బ

మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…

6 hours ago

సెలబ్రెటీ పెళ్లిళ్లు.. హడావుడి తగ్గించాలా?

పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…

7 hours ago