Political News

బిగ్ క్వశ్చన్: టీడీపీ జోష్ ఎవరికి నష్టం?

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజమే.. మారే కాలానికి తగ్గట్లుగా కొన్ని మార్పులు చోటు చేసుకోవాలి. ఈ విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా.. అందుకు చెల్లించాల్సిన మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయ రంగంలో అనూహ్య పరిణామాలకు అవకాశం ఎక్కువ. అంతేకాదు.. ఒక పరిణామం మొత్తం సీన్ ను మార్చేస్తుంది. అప్పటివరకు ఉన్న లెక్కలు మారేలా చేస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ఉండదన్న నిశ్చితాభిప్రాయంతో ఉన్న వేళ.. కేసీఆర్ తీసుకున్న బీఆర్ఎస్ నిర్ణయం పుణ్యమా అని.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలిసిందే.

ఎన్నికలు ముంగిట్లోకి వచ్చేసిన వేళ.. ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన నేపథ్యంలో.. ఎంతో కాలం మునుపే జాతీయ పార్టీగా ఉన్న తెలుగుదేశం తెలంగాణలో తన ఉనికిని ఎందుకు చాటుకోకూడదన్న ప్రశ్న తలెత్తింది. దీనికి సమాధానంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. రిస్కుకు సిద్దపడి ఖమ్మం శంఖారావం సభను ఏర్పాటు చేయటం ఇప్పుడు టీడీపీకి లాభంగా మారింది.

తెలంగాణలో టీడీపీ నిర్వహించే సభకు ఇంత భారీగా జనసందోహం రావటమా? అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంతకూ తెలంగాణలో టీడీపీ బలపడితే లాభం ఎవరికి? నష్టం ఎవరికి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఎవరికి వారు కూడికలు తీసివేతల్లో బిజీగా మారారు. రాజకీయ వర్గాల అంచనా చూసినప్పుడు టీడీపీ తెలంగాణలో బలపడితే.. నష్టం వాటిల్లేది టీఆర్ఎస్ కే నని చెప్పక తప్పదు. దీనికి కారణం టీడీపీ నుంచి అత్యధిక నేతలు కాంగ్రెస్ కు షిప్టు అయ్యారు.

కానీ.. సెకండ్ క్యాడర్.. ఓటర్లు మాత్రం టీఆర్ఎస్ కు వెళ్లిపోయారు. టీడీపీ జోష్ లోకి వస్తే.. ఇప్పటికిప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవు కానీ.. టీఆర్ఎస్ కు పడాల్సిన ఓట్ల షేర్ లో మాత్రం తేడా రావటం ఖాయమని చెప్పాలి. గతంలో టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతాల్లోనూ.. హైదరాబాద్ లో సెటిలర్ల ఓట్లు చీలే అవకాశం ఖాయమని చెప్పాలి. గత ఎన్నికల్లో టీడీపీ ఓట్లు చాలావరకు టీఆర్ఎస్ కు పడ్డాయి. అయితే.. 2019 లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు వ్యతిరేకంగా.. జగన్ కు అనుకూలంగా గులాబీ బాస్ పావులు కదపటం తెలిసిందే.

ఏపీలో టీడీపీ దారుణ ఓటమికి గులాబీ బాస్ కేసీఆర్ కారణమన్న విషయంలో టీడీపీ అభిమానులు చాలా గుర్రుగా ఉన్నారు. కానీ.. ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండటంతో మౌనంగా ఉన్నారు. ఇప్పుడు తమకు అవకాశం లభించిన నేపథ్యంలో ఈ సారి గతంలో మాదిరి కాకుండా టీఆర్ఎస్ కు ఈసారి ఓట్లు వేసే అవకాశం తక్కువగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. టీడీపీ పోటీ చేసే ప్రతి చోట.. కనీసం వెయ్యి నుంచి ఐదు వేల వరకు ఓట్లు చీలే వీలుందన్న అంచనా వేస్తున్నారు. అదే జరిగితే.. గులాబీ బాస్ కు జరిగే డ్యామేజ్ అధికమని చెప్పక తప్పదు. మరేం జరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

పొరబడ్డారు… నేనలాంటి వాడిని కాదు: ఏబీవీ

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు గత వైసీపీ పాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే…

57 minutes ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

4 hours ago

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

10 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

11 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

13 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

13 hours ago