మర్యాదగా ఉంటానని.. మిగిలిన వారి మాదిరి చిల్లర రాజకీయాలు.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడే తీరు తనకు అలవాటు ఉండదన్నట్లుగా మాట్లాడే మంత్రి కేటీఆర్.. అందుకు భిన్నంగా వ్యవహరించారు.
తనను అదే పనిగా టార్గెట్ చేసే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఘాటుగా రియాక్టు అయిన వేళలో ఆయన బ్యాలెన్స్ మిస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి ఎప్పుడే వినని కొత్త తరహా మాటలు వచ్చేశాయి. ఇవన్నీ విన్నప్పుడు.. కేటీఆర్ ఇంతలా ఇరిటేట్ కావాల్సిన అవసరం ఏముంది? అన్న సందేహం కలుగక మానదు.
డ్రగ్స్ పరీక్ష చేయించుకుంటాడా కేటీఆర్? అంటూ తరచూ ఘాటు వ్యాఖ్యలు చేసే బండి సంజయ్ మాటలకు ఎప్పుడూ పెద్దగా రియాక్టు కారు మంత్రి కేటీఆర్. అలాంటిది తాజాగా మాత్రం ఆయన సీరియస్ గా రియాక్టు అయ్యారు. ఊహించని రీతిలో ఆయన నోటి నుంచి పరుష వ్యాఖ్యలు వచ్చేశాయి. మర్యాదస్తుల నోట్లో నుంచి రాని మాటలు కూడా కేటీఆర్ నోటి నుంచి వచ్చేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
డ్రగ్స్ పరీక్షల కోసం శాంపిల్స్ ఇస్తానని.. రక్తం ఇచ్చేందుకు సిద్ధమని.. కావాలంటే బొచ్చు కూడా ఇస్తానంటూ మండిపడ్డారు కేటీఆర్. గోళ్లు కావాలంటే తీసుకో.. అవసరమైతే కిడ్నీని కూడా తీసుకెళ్లి టెస్టు చేసుకోవాలన్న ఆయన.. ‘‘ఏ డాక్టర్ ను తెచ్చుకుంటావో తెచ్చుకో. డ్రగ్స్ వాడినట్లు తేలకపోతే మాత్రం కరీంనగర్ నడిరోడ్డు మీద నీ చెప్పుతో నువ్వు కొట్టుకుంటావా? మళ్లీ మా చెప్పుతో అనుకునేవు. మళ్లీ ఆ పేరుతో పనికిమాలిన గొడవ చేస్తావు’’ అంటూ సీరియస్ అయ్యారు.
తనకు జరిపిన పరీక్షల్లో తాను డ్రగ్స్ వాడినట్లుగా తేలకపోతే మాత్రం కరీంనగర్ కమాన్ వద్ద బండి సంజయ్ చెప్పుతో ఆయనే కొట్టుకోవాలన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకనే ఇలాంటి దద్దమ్మలు తమపై ఇలా చేస్తారన్నారు. తాను చెప్పిన దానికి సిద్ధమైతే తాను ఇక్కడే ఉంటానని.. రమ్మనాలని ఆయన పేర్కొన్నారు. దమ్ముంటే కరీంనగర్ కుపనికి వచ్చే పని చేయాలని.. సిరిసిల్లకు మెగా పవర్ లూం క్లస్టర్ తీసుకురావాలన్నారు.
డ్రగ్స్ టెస్టు చేసుకోవాలని బండి సంజయ్ సవాలు విసురుతున్న వైనంపై మీడియా ప్రశ్నలు వేయగా.. ఘాటుగా రియాక్టు అయ్యారు కేటీఆర్. ‘‘ ఫాల్తు మాటలు, ఫాల్తు రాజకీయాలు. పనికిమాలిన వాళ్లు చేస్తారు. దమ్ముంటే ప్రజలకు ఏం చేశాడో చెప్పాలి. చిల్లర రాజకీయాలు కాదు. ప్రజలకు పనికి వచ్చే మాటలు మాట్లాడాలి. తెల్లారి లేస్తే అరుపులు.. మెరుగుడు.. విచిత్రమైన అరుపులు తప్పించి మరింకేమీ లేదు. పిండాకుడు మాటలు మాట్లాడుతున్నాడు. మనిషా.. పశువా? నేను డ్రగ్స్ శాంపిల్స్ ఇచ్చి మోడీనో.. ఇంకెవరిదైనా ఇవ్వమంటే ఎలా ఉంటుంది?’’ అంటూ సీరియస్ అయ్యారు.
This post was last modified on December 21, 2022 10:29 am
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…
ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నేతలు ఏదో ఫ్లోలో కొన్నిసార్లు నోరు జారుతుంటారు. కొందరిని హర్ట్ చేసేలా మాట్లాడతారు. ఐతే తాము…
ఏపీలో రాజకీయాలు ఊపందుకున్న నేపథ్యంలో సంచలనాలు కూడా అదే రేంజ్లో తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తుత ప్రధాన పార్టీలన్నీ కూడా.. పెద్ద…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే బూతులు. మంత్రులూ, ఎమ్మెల్యేలు తేడా లేకుండా విపక్ష నాయకుల మీద బూతులతో విరుచుకుపడే తీరు రాజకీయాలంటేనే…
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. వైసీపీ వర్సెస్ బీజేపీ కార్యకర్త ల మధ్య…