రాజకీయాల్లో తొడగొట్టడం.. ఇప్పుడు కామన్ అయిపోయింది. గతంలో ఒకింత బలమైన నాయకులు పౌరు షానికి తొడగొట్టిన ఘటనలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఆడ లేదు.. మగా లేదు.. మీసం ఉన్నా లేకున్నా మెలేస్తున్నారు.. తగ్గేదేలే అంటూ.. తొడగొడుతున్నారు. ఇలా.. తొడగొట్టిన టీడీపీ యువ నాయకురాలు.. ఇప్పుడు మళ్లీ ఇరకాటంలోనే పడ్డారని అంటున్నారు పార్టీ నేతలు.
ఈ ఏడాది జరిగిన టీడీపీ మహానాడు వేదికగా.. మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె, యువ నాయకురాలు గ్రీష్మ తొడగొట్టి మరీ వైసీపీ నాయకులపై విరుచుకుపడిన విషయం..అప్పట్లో రికార్డు స్థాయిలో హల్చల్ చేసింది. దీంతో ఇంకేముంది.. ఆమెకు పార్టీలోనూ.. నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున హారతులు పడతారని అందరూ అనుకున్నారు. అదేవిధంగా చంద్రబాబు సైతం టికెట్ కన్ఫర్మ్ చేస్తారని భావించారు.
కానీ, అనూహ్యంగా గ్రీష్మ కొట్టిన తొడ చప్పుడు.. మహానాడు వేదికను దాటి పోలేదని.. కాస్తంత లేటుగా అర్ధమైంది. దీంతో ఇప్పుడు మళ్లీ ఆమె పరిస్థితి మొదటికొచ్చిందని అంటున్నారు పరిశీలకులు. విషయం ఏంటేంటే.. శ్రీకాకుళం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం రాజాం. ఇక్కడ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి విజయం దక్కించుకోవాలని గ్రీష్మ ప్రయత్నిస్తున్నారు. కానీ, ఇది సాధ్యం కావడం లేదు.
ఎందుకంటే.. మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్.. ఇక్కడ తిష్టవేసుకుని కూర్చున్నారు. ఎస్సీ సామాజిక వర్గంలో బలమైన పలుకుడి ఉన్న కోండ్రుకు.. గత ఎన్నికల్లో చంద్రబాబు పిలిచి టికెట్ ఇచ్చారు. అయితే.. వైసీపీ హవాలో ఆయన ఓడిపోయినా.. పార్టీలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికలకు కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో చంద్రబాబు మరోసారి ఆయనకే టికెట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు.
ఇదిలావుంటే.. మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి.. దగ్గర బంధువైన టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కళా వెంకట్రావుతో వివాదాలు ఉన్నాయి. దీంతో కళా వెంకట్రావే.. గ్రీష్మకు అడ్డు తగులుతున్నారనేది భారతి వాదన. అయినప్పటికీ.. భారతి మొర ఆలకించే వారు కనిపించడం లేదు. దీంతో గ్రీష్మ కొట్టిన తొడ చప్పుడు.. సిక్కోలు వరకు వినిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమెకు టికెట్ వచ్చే వరకు సందేహమేనని అంటున్నారు.
This post was last modified on December 20, 2022 7:19 am
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…
‘ఇరుముడి’ సక్సెస్ మీట్లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…
పాప్ కార్న్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. కాలక్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్కజొన్న లోని…