Political News

చెప్పు ఎఫెక్ట్‌: వైసీపీ సమావేశానికి 2 వేల మందితో పోలీసుల భ‌ద్ర‌త‌!!

ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి సెగ‌లు క‌క్కుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై నాయ‌కులు మండి ప‌డుతున్నారు. దీంతో నాయ‌కుల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే సాగుతోంది.

ఇటీవల స‌త్య‌సాయి(ఉమ్మ‌డి అనంత‌పురం) జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు చెప్పులు విసిరిన విష‌యం తెలిసిందే. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌పై ఉన్న అసంతృప్తిని కార్య‌క‌ర్త‌లు త‌మ చెప్పుల ద్వారా.. చూపించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేయ‌గా.. దీనికి ఏకంగా ప‌క్క జిల్లాల నుంచి కూడా పోలీసుల‌ను పిలిచి మ‌రీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్ర‌మంలో సుమారు 2 వేల మంది పోలీసులు.. భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సమయంలో.. పెద్దఎత్తున అసమ్మతివర్గం నిరసన గళం వినిపిస్తోంది.

తాజాగా పుట్టపర్తిలో జరిగిన‌ సమావేశానికి అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సభా ప్రాంగణ పరిసరాల్లోనే తిష్ట వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమావేశ ప్రాంగణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకంటే పోలీసులే అధిక సంఖ్యలో క‌నిపించారు. పుట్టపర్తిలో ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివచ్చింది.

ఒక చిన్న పాటి స‌మావేశానికి .. ఇంత భారీగా పోలీసుల‌ను ర‌ప్పించి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డం.. ఇదే తొలిసారి కావ‌డంగ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నించిన ప‌రిశీల‌కులు.. చెప్పు ఎఫెక్ట్‌ అని కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on December 18, 2022 6:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

శుభవార్త చెప్పబోతున్న అఖండ 2 ?

గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…

1 hour ago

AI తెచ్చే ప్రమాదాల్లో ఇదింకా మొదటిది

తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…

1 hour ago

నీలంబరి ఎలా బ్రతుకుతుంది నరసింహా

డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…

3 hours ago

ఇండి`గోల`పై నాయుడుతో మోదీ ఏమన్నారంటే…

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఇండిగో విమాన సేవ‌లు ర‌ద్ద‌యి.. కొన్ని విమానాలు తీవ్ర ఆల‌స్య‌మై.. ల‌క్ష‌ల సంఖ్య‌లో ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…

3 hours ago

‘ఉప్పెన’తో సినిమాలు ఆపేద్దాం అనుకున్న బేబమ్మ

కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…

4 hours ago

ప్రధాని మోదీ పొరపాటును సరిచేసిన ప్రతిపక్ష ఎంపీ

పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…

5 hours ago