Political News

చెప్పు ఎఫెక్ట్‌: వైసీపీ సమావేశానికి 2 వేల మందితో పోలీసుల భ‌ద్ర‌త‌!!

ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి సెగ‌లు క‌క్కుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై నాయ‌కులు మండి ప‌డుతున్నారు. దీంతో నాయ‌కుల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే సాగుతోంది.

ఇటీవల స‌త్య‌సాయి(ఉమ్మ‌డి అనంత‌పురం) జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు చెప్పులు విసిరిన విష‌యం తెలిసిందే. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌పై ఉన్న అసంతృప్తిని కార్య‌క‌ర్త‌లు త‌మ చెప్పుల ద్వారా.. చూపించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేయ‌గా.. దీనికి ఏకంగా ప‌క్క జిల్లాల నుంచి కూడా పోలీసుల‌ను పిలిచి మ‌రీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్ర‌మంలో సుమారు 2 వేల మంది పోలీసులు.. భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సమయంలో.. పెద్దఎత్తున అసమ్మతివర్గం నిరసన గళం వినిపిస్తోంది.

తాజాగా పుట్టపర్తిలో జరిగిన‌ సమావేశానికి అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సభా ప్రాంగణ పరిసరాల్లోనే తిష్ట వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమావేశ ప్రాంగణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకంటే పోలీసులే అధిక సంఖ్యలో క‌నిపించారు. పుట్టపర్తిలో ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివచ్చింది.

ఒక చిన్న పాటి స‌మావేశానికి .. ఇంత భారీగా పోలీసుల‌ను ర‌ప్పించి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డం.. ఇదే తొలిసారి కావ‌డంగ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నించిన ప‌రిశీల‌కులు.. చెప్పు ఎఫెక్ట్‌ అని కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on December 18, 2022 6:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

16 minutes ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

1 hour ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

2 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

4 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

6 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

6 hours ago