ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతల మధ్య అసంతృప్తి సెగలు కక్కుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై నాయకులు మండి పడుతున్నారు. దీంతో నాయకులకు ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర యుద్ధమే సాగుతోంది.
ఇటీవల సత్యసాయి(ఉమ్మడి అనంతపురం) జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో కొందరు కార్యకర్తలు చెప్పులు విసిరిన విషయం తెలిసిందే. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణపై ఉన్న అసంతృప్తిని కార్యకర్తలు తమ చెప్పుల ద్వారా.. చూపించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఇదే జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయగా.. దీనికి ఏకంగా పక్క జిల్లాల నుంచి కూడా పోలీసులను పిలిచి మరీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో సుమారు 2 వేల మంది పోలీసులు.. భద్రతను ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సమయంలో.. పెద్దఎత్తున అసమ్మతివర్గం నిరసన గళం వినిపిస్తోంది.
తాజాగా పుట్టపర్తిలో జరిగిన సమావేశానికి అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సభా ప్రాంగణ పరిసరాల్లోనే తిష్ట వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమావేశ ప్రాంగణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకంటే పోలీసులే అధిక సంఖ్యలో కనిపించారు. పుట్టపర్తిలో ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివచ్చింది.
ఒక చిన్న పాటి సమావేశానికి .. ఇంత భారీగా పోలీసులను రప్పించి భద్రతను ఏర్పాటు చేయడం.. ఇదే తొలిసారి కావడంగమనార్హం. దీనిని గమనించిన పరిశీలకులు.. చెప్పు ఎఫెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు.
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…