Political News

చెప్పు ఎఫెక్ట్‌: వైసీపీ సమావేశానికి 2 వేల మందితో పోలీసుల భ‌ద్ర‌త‌!!

ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి సెగ‌లు క‌క్కుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై నాయ‌కులు మండి ప‌డుతున్నారు. దీంతో నాయ‌కుల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే సాగుతోంది.

ఇటీవల స‌త్య‌సాయి(ఉమ్మ‌డి అనంత‌పురం) జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు చెప్పులు విసిరిన విష‌యం తెలిసిందే. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌పై ఉన్న అసంతృప్తిని కార్య‌క‌ర్త‌లు త‌మ చెప్పుల ద్వారా.. చూపించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేయ‌గా.. దీనికి ఏకంగా ప‌క్క జిల్లాల నుంచి కూడా పోలీసుల‌ను పిలిచి మ‌రీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్ర‌మంలో సుమారు 2 వేల మంది పోలీసులు.. భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సమయంలో.. పెద్దఎత్తున అసమ్మతివర్గం నిరసన గళం వినిపిస్తోంది.

తాజాగా పుట్టపర్తిలో జరిగిన‌ సమావేశానికి అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సభా ప్రాంగణ పరిసరాల్లోనే తిష్ట వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమావేశ ప్రాంగణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకంటే పోలీసులే అధిక సంఖ్యలో క‌నిపించారు. పుట్టపర్తిలో ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివచ్చింది.

ఒక చిన్న పాటి స‌మావేశానికి .. ఇంత భారీగా పోలీసుల‌ను ర‌ప్పించి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డం.. ఇదే తొలిసారి కావ‌డంగ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నించిన ప‌రిశీల‌కులు.. చెప్పు ఎఫెక్ట్‌ అని కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on December 18, 2022 6:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

47 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago