Political News

చెప్పు ఎఫెక్ట్‌: వైసీపీ సమావేశానికి 2 వేల మందితో పోలీసుల భ‌ద్ర‌త‌!!

ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత‌ల మ‌ధ్య అసంతృప్తి సెగ‌లు క‌క్కుతున్నాయి. ముఖ్యంగా ఎమ్మెల్యేల తీరుపై నాయ‌కులు మండి ప‌డుతున్నారు. దీంతో నాయ‌కుల‌కు ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య తీవ్ర యుద్ధ‌మే సాగుతోంది.

ఇటీవల స‌త్య‌సాయి(ఉమ్మ‌డి అనంత‌పురం) జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో కొంద‌రు కార్య‌క‌ర్త‌లు చెప్పులు విసిరిన విష‌యం తెలిసిందే. పెనుకొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌పై ఉన్న అసంతృప్తిని కార్య‌క‌ర్త‌లు త‌మ చెప్పుల ద్వారా.. చూపించారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఇదే జిల్లాలోని పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ విస్తృత స్థాయి స‌మావేశం ఏర్పాటు చేయ‌గా.. దీనికి ఏకంగా ప‌క్క జిల్లాల నుంచి కూడా పోలీసుల‌ను పిలిచి మ‌రీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు.

ఈ క్ర‌మంలో సుమారు 2 వేల మంది పోలీసులు.. భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సమయంలో.. పెద్దఎత్తున అసమ్మతివర్గం నిరసన గళం వినిపిస్తోంది.

తాజాగా పుట్టపర్తిలో జరిగిన‌ సమావేశానికి అదనపు ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ సభా ప్రాంగణ పరిసరాల్లోనే తిష్ట వేసి బందోబస్తు చర్యలు చేపట్టారు. సమావేశ ప్రాంగణంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలకంటే పోలీసులే అధిక సంఖ్యలో క‌నిపించారు. పుట్టపర్తిలో ఎక్కడికక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రశాంతి నిలయంలో వెళ్లే భక్తులు, పర్యాటకులు అవస్థలు పడాల్సివచ్చింది.

ఒక చిన్న పాటి స‌మావేశానికి .. ఇంత భారీగా పోలీసుల‌ను ర‌ప్పించి భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేయ‌డం.. ఇదే తొలిసారి కావ‌డంగ‌మ‌నార్హం. దీనిని గ‌మ‌నించిన ప‌రిశీల‌కులు.. చెప్పు ఎఫెక్ట్‌ అని కామెంట్ చేస్తున్నారు.

This post was last modified on December 18, 2022 6:57 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

45 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

48 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago