రాజకీయాల్లో నాయకులు తీసుకునే నిర్ణయాలు.. ఒక్కొక్కసారి బూమరాంగ్ అవుతాయి. మరికొన్ని సార్లు.. అయితే.. తమకు ఇబ్బందిగానూ మారతాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్థితి రెండు రకాలుగాను ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా తన టీఆర్ఎస్ పార్టీని మార్పు చేశారు. తద్వారా.. ఆయన దేశం మొత్తం పర్యటించనున్నారు.
అంటే.. ఇక, ప్రాంతీయ వాదానికి ఆయన చోటు పెట్టే ఛాన్స్ లేదు. అదేసమయంలో తెలంగాణలోనే ఉండి.. కేవలం తెలంగాణకే ఆయన రాజకీయం పరిమితం కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ అడుగులు వేయనున్నారు. తద్వారా.. ఏపీ వంటి దాయాది రాష్ట్రానికి కూడా ఆయన రావాల్సి ఉంటుంది. ఇక, అప్పుడు తెలంగాణ వాదానికి ఆయన పూర్తిగా తెరదించేసినట్టే అవుతుంది. అదే సమయంలో తాను ఇతర రాష్ట్రాల్లోకి అడుగు పెడితే.. ఇతర పార్టీలు కూడా తన రాష్ట్రంలో రాజకీయాలు చేస్తాయనే విషయం ఆయనకు తెలియంది కాదు.
అంటే..కేసీఆర్ ఇప్పుడు ఏపీలో అడుగు పెడితే.. ప్రత్యంక్షగా టీడీపీ అధినేతకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.తెలంగాణలో చంద్రబాబు 2018 ఎన్నికల్లో అడుగులువేశారు. అప్పటికి ఆయన ఏపీ సీఎం. అయితే.. దీనిని కేసీఆర్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏపీ వాళ్లు వచ్చి మనల్ని పాలించే అవకాశం ఇస్తమా! అంటూ.. సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగించి విన్నయ్యారు. ఇక, ఇప్పుడు ఆ మాట అనే ఛాన్స్ లేదు.
సో.. తెలంగాణలో టీడీపీకి మంచి పట్టు పెంచుకునే ఛాన్స్ కేసీఆర్ చేజేతులా అప్పగించారనే అంటున్నారు పరిశీలకులు. ఇది మంచి పరిణామమని కూడా చెబుతున్నారు. ఇప్పటికే రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్, ఆదిలాబాద్ రాష్ట్రాల్లో టీడీపీకి గట్టి పట్టుంది. పైగా కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ చీఫ్ అయిన దరిమిలా ఇది మరింత పరిగింది. సో.. ఇప్పుడు చంద్రబాబు స్వేచ్ఛగా తెలంగాణలోకి అడుగులు పెట్టడం మాత్రమే కాదు.. ప్రతిపక్ష స్థాయికి ఎదిగినా.. ఆశ్చర్యంలేదని అంటున్నారు.
This post was last modified on December 17, 2022 5:14 pm
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…
పార్లమెంటులో ఈ రోజు వందేమాతరంపై ప్రత్యేక చర్చ జరిగింది. జాతీయ గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్బంగా ఈ చర్చ…