ఇటీవల కాలంలో ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. వారు చేస్తున్న వ్యవహారాలు కూడా అలానే ఉండడం గమనార్హం. కొన్నికొన్ని కేసుల్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా అధికారులు పాటించడం లేదు. కనీసం.. కోర్టు అనే గౌరవం కూడా ఇవ్వడం లేదని న్యాయస్థానమే పలు సందర్భాల్లో తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది దీంతో అలాంటి అధికారులపై చర్యలు తీసుకునేందుకు కూడా న్యాయస్థానం వెనుకాడడం లేదు.
ఇక, ఈ పరంపరంలో సీఎం జగన్కు అత్యంత ఇష్టమైన అధికారిగా ముద్ర పడిన టీటీడీ కార్యనిర్వహణాధికారి(ఈవో) ఏవీ ధర్మారెడ్డి కూడా చేరిపోయారు. తాజాగా ఆయనపైనా హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. మేమంటే లెక్కలేదా? అని నిలదీసింది. అంతేకాదు.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా సదరు ఆదేశాలను అమలు చేయడం లేదంటే తాము ఎలా అర్ధం చేసుకోవాలని ప్రశ్నించింది. ఈ క్రమంలో ఆయనకు నెల రోజులపాటు సాధారణ జైలు శిక్ష విధించింది. అదేవిధంగా 2 వేల రూపాయల జరిమానా కూడా కట్టాలని నిర్దేశించింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను కొన్నాళ్ల కిందట క్రమబద్ధీకరించారు. అంటే రెగ్యులరైజ్ చేశారు. అయితే.. ఈ క్రమంలో టీటీడీలోని ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులను మాత్రం పక్కన పెట్టారు. దీంతో వారు.. హై కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం.. తమను ఆశ్రయించిన ముగ్గురు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించా లని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, కోర్టు ఆదేశాలు అమలు కాలేదు.
దీంతో సదరు ఉద్యోగులు మరోసారి కోర్టులో ధిక్కరణ పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఉద్యోగుల విష యంలో కోర్టు ఆదేశాలను అమలు చేయనందుకు టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మారెడ్డికి నెలరోజుల జైలుశిక్ష, 2వేల రూపాయల జరిమానా విధించింది.
This post was last modified on December 13, 2022 11:58 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…