ఎన్ని విమర్శలు వచ్చినా, హైకోర్టు హెచ్చరికలు చేసినా.. కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి ఇష్టపడలేదు తెలంగాణ సర్కారు. కానీ ప్రజల్లో ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత రావడం, హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం తీరు మారింది. ఏపీ తరహాలోనే ర్యాపిడ్ కిట్లు తెచ్చి కొన్ని రోజులుగా రోజుకు పదివేలకు తక్కువ కాకుండా టెస్టులు చేస్తున్నారు.
మరోవైపు ఆసుపత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకపోవడంపై, వసతుల లేమిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళన కనిపించడంతో ఈ విషయంలోనూ స్పందించింది. పరిస్థితులు సరిదిద్దే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కరోనా వైరస్ స్టేటస్కు సంబంధించి రోజూ రిలీజ్ చేసే బులిటెన్ తీరును కూడా మార్చింది తెలంగాణ సర్కారు.
ఇంతకుముందులా అస్పష్టంగా కాకుండా వివరంగా బులిటెన్ ఇస్తోంది ప్రభుత్వం. ఇందులో కొత్త కొత్త కాలమ్స్ చేర్చింది. కరోనా పరీక్షల గురించి ఒక ప్రత్యేక కాలమ్ పెట్టింది. టెస్టుల సంఖ్య భారీగా పెంచిన నేపథ్యంలో ఆ వివరాలన్నీ అందులో పొందు పరిచింది. గత పది రోజుల లెక్కల వల్ల ఈ గణాంకాల్లో చాలా మార్పు కనిపించింది. ఇప్పుడిక్కడ టెస్టుల సంఖ్య 2 లక్షలు దాటిపోయింది.
గురువారం ఒక్క రోజే 14 వేలకు పైగా పరీక్షలు చేయడం విశేషం. ఇందులో 1676 పాజిటివ్ కేసులు తేలాయి. మొత్తం కేసుల సంఖ్య 41 వేలకు పైగా ఉంది. అందులో 25 వలే మంది దాకా కోలుకున్నారు. 13 వేలకు పైగా యాక్టివ్ కుసులున్నాయి. మరోవైపు కోవిడ్ ఆసుపత్రి అయిన గాంధీలో అందుబాటులో ఉన్న బెడ్లు ఇతర వివరాల్ని కూడా ఇందులో పొందుపరిచారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ల్యాబ్ల వివరాల్ని కూడా బులిటెన్లో ఇస్తుండటం విశేషం.
This post was last modified on July 17, 2020 11:10 am
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…
లోకనాయకుడు కమల్ హాసన్ చాలా ప్లాన్డ్ గా ప్రమోషన్ల విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. వచ్చే నెల జూన్…
భారత్ అంటే నరనరాన పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు… ఇప్పటిదాకా భారత్ పై లెక్కలేనన్ని దాడులకు దిగారు.…
ఇప్పటి దర్శకులకు వేగం అలవడటం లేదు. కారణాలు సవాలక్ష ఉండొచ్చు కానీ పరిశ్రమకు అవసరమైన స్పీడ్ అంది పుచ్చుకుని ఎక్కువ…
నాలుగేళ్ల క్రితం నాగచైతన్యతో విడిపోయి విడాకులు తీసుకున్నాక సమంత కొత్త జీవిత భాగస్వామి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం చూస్తూనే…
వైసీపీ అధినేత జగన్ .. ఇటీవల పార్టీ పార్లమెంటరీ స్థాయి ఇంచార్జ్లను నియమించారు. ఇది జరిగి దాదాపు వారం అవుతోంది.…