Political News

ఏపీ, తెలంగాణ క‌లిసిపోవాల‌న్న‌దే మా విధానం..: స‌జ్జ‌ల‌

రాష్ట్ర విభ‌జ‌న‌కు తాము పూర్తిగా వ్య‌తిరేక‌మ‌ని.. వైసీపీ నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు.. స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన జ‌రిగిన తీరుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ .. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రి ఎలా ఉండ‌నుంది? అనే అంశాల‌పై..స‌జ్జ‌ల స్పందించారు. అప్ప‌ట్లోనే రాష్ట్ర విభ‌జ‌న‌ను వైసీపీ వ్య‌తిరేకించింద‌ని, 2 తెలుగు రాష్ట్రాలు ఒక‌టిగా ఉండాల‌నేది వైసీపీ విధాన‌మ‌ని స‌జ్జల చెప్పారు.

రెండు రాష్ట్రాల‌ను క‌లిపి ఉంచేందుకు వైసీపీ సాధ్య‌మైనంత వ‌ర‌కు పోరాటం చేస్తుంద‌ని స‌జ్జ‌ల చెప్పారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తున్న‌మ‌ని చెప్పారు. మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయితే తొలుత స్వాగతించేది తామేనని స్పష్టం చేశారు. అంతేకాదు.. సుప్రీంకోర్టులోనూ.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తామ‌ని తెలిపారు.

విభజనకు వ్యతిరేకంగా కోర్టులో తమ వాదనలు బలంగా వినిపిస్తామ‌ని స‌జ్జ‌ల తెలిపారు. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాల‌ని.. రెండు రాష్ట్రాల‌ను క‌లిపివేయాల‌ని కోరారు. లేదంటే విభ‌జన జ‌రిగిన తీరును సరిది ద్దాలని గట్టిగా కోరతామ‌న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలసి ఉండాలన్నదే ఇప్పటికీ త‌మ విధాన‌మ‌ని స‌జ్జ‌ల చెప్పారు.

రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారని, దీనిపై త‌మ వాద‌న‌లు త‌ప్ప‌కుండా వినిపిస్తామ‌ని స‌జ్జ‌ల చెప్పారు. విభజన చట్టంలో హామీల అమలుపై పోరాటం చేస్తూనే ఉన్న‌ట్టు తెలిపారు. ప్ర‌త్యేక హోదాపై ఇప్ప‌టికీ సీఎం జ‌గ‌న్ కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నార‌ని చెప్పారు. రెండు రాష్ట్రాలు కలిసుండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అంతకంటే ఏం కావాలని అన్నారు. రెండు రాష్ట్రాలు కలిసేందుకు వైసీపీ పోరాటం చేస్తోందన్నారు.

This post was last modified on December 8, 2022 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

2 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

8 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

13 hours ago