కోపం వచ్చినప్పుడు నాలుగు తిట్లు ఘాటుగా తిడితే అదోరకం. అందుకు భిన్నంగా కామెడీ చేస్తేనే ఇబ్బంది. అందునా.. ఏపీ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సీఎంకు నీడలా ఉండే విజయసాయిని ఉద్దేశించి చిన్న మాట అనేందుకు సైతం వణుకుతారు. అలాంటిది రఘురామకృష్ణంరాజు మాత్రం మాటలతో గుచ్చేస్తున్నారు.
పార్టీ కట్టు తప్పారంటూ నరసాపురం ఎంపీకి పార్టీ తరఫున షోకాజ్ నోటీసు ఇవ్వటం తెలిసిందే. నోటీసులోని పాయింట్లు తర్వాత.. అసలు నోటీసును అచ్చేసిన పేపర్ లోనే ఇష్యూ ఉందంటూ.. ఆయన తెర మీదకు తీసుకొచ్చిన అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయసాయి తనకు పంపిన నోటీసును చదివితే తనకు ఈవీవీ సత్యనారాయణ సినిమా చూసినట్లుగా నవ్వుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
పార్టీ వేరు.. ప్రభుత్వం వేరన్న విషయాన్నివిజయసాయి గుర్తించలేదన్న ఆయన.. తాను లోక్ సభలో మాతృభాషపై మాట్లాడినందుకు పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి తనను అభినందించారని.. కానీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం తనపై ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. తాను ఆయన్ను కలిసి వివరించానని చెప్పారు.
తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్న అంశాలేవీ పార్టీని వ్యతిరేకించేవి కాదన్న ఆయన.. తనకు కేంద్రమంత్రిపదవి ఖరారైందన్న వార్తల్లో నిజం లేదన్నారు. తనకు మోడీ సర్కారు మంత్రిపదవి ఇవ్వాలనుకుంటే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఇవ్వొచ్చని వ్యాఖ్యానిస్తూ మరికాస్త కన్ఫ్యూజ్ కు గురి చేశారు. కేంద్ర బలగాలు తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోం శాఖకార్యదర్శిని కోరానని.. ఏపీ ప్రభుత్వం తనకు భద్రత కల్పిస్తానని చెప్పినందుకే కేంద్రం తనకు రక్షణ కల్పించలేదేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. విజయసాయి పంపిన షోకాజ్ నోటీస్ లోని అంశాలు చదివితే ఈవీవీ సినిమా చూసినట్లుగా ఉందంటూ కామెడీ చేసిన వైనం విజయసాయి అండ్ కో జీర్ణించుకోలేనిదిగా ఉందని చెబుతున్నారు.ఇంతలా ఆయన్ను సొంత పార్టీలో వ్యాఖ్యలు చేసినోళ్లు లేదన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on July 16, 2020 1:57 pm
నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…
మంగళగిరి నియోజకవర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్గా ఉన్నప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయలను ఖర్చు చేసినట్టు మంత్రి…
నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…
బంగారం లాంటి వేసవి వృథా అయిపోతోందని టాలీవుడ్ నిర్మాతలు వాపోతున్నారు. బలమైన పొటెన్షియాలిటీ ఉన్న మార్చి నెలలో కోర్ట్, మ్యాడ్…
ఏపీ రాజధాని అమరావతికి నిన్న మొన్నటి వరకు.. డబ్బులు ఇచ్చే వారి కోసం సర్కారు ఎదురు చూసింది. గత వైసీపీ…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు…