Political News

వైసీపీ కొత్త టార్గెట్ ఫిక్స్

గత ఏడాది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలతో పాటు ‘టార్గెట్ టీడీపీ’ పథకాన్ని చాలా పకడ్బందీగా అమలు చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలుగుదేశం అగ్ర నేతల్ని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య మాజీ మంత్రి అచ్చెన్నాయుడు.. ఆ తర్వాత కొల్లు రవీంద్ర జగన్ సర్కారు దెబ్బలు రుచిచూశారు. ఒకరు అవినీతి కేసులో, ఇంకొకరు హత్య కేసులో చిక్కుకుని అల్లాడుతున్నరు.

ఇప్పుడు అధికార పార్టీ కొత్త టార్గెట్ ఫిక్సయింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును వైసీపీ లక్ష్యంగా చేసుకుంది. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ వైకాపా అగ్రనేత, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ వేయడం సంచలనంగా మారింది.

గంటా శ్రీనివాసరావుకు సైకిళ్ల కొనుగోలు కుంభకోణంలో పాత్ర ఉందని.. ఆయన ఆధ్వర్యంలో సైకిళ్ల పేరుతో జరిగిన రూ.12 కోట్ల కొనుగోళ్లలో రూ.5 కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. ‘‘తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! రూ.12 కోట్ల కొనుగోళ్ళలో రూ.5 కోట్ల అవినీతి.. ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు గంటాను వైసీపీ క్యాడర్ కూడా టార్గెట్ చేసింది. వైకాపా కార్యకర్తలు సైకిళ్ల కుంభకోణంలో గంటాపై ఆరోపణలు చేస్తూ లేఖలు రాశారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కూడా సీఎస్ నీలం సాహ్ని, విద్యాశాఖ కమిషనర్‌కు ఓ లేఖ రాశారు. సైకిళ్ళ కొనుగోళ్లు విషయంలో స్కామ్ జరిగిందని.. నాణ్యత లేని సైకిళ్ళు కొని దాదాపు రూ.5 కోట్ల మేర అవకతవకలు జరిగాయని.. ఆ శాఖలో ఎక్కడ చూసినా అవినీతే అని.. దాదాపు రూ.1500 కోట్ల అవినీతి మొత్తం వివరాలు బయటకు తీసే పనిలో ఉన్నారంటూ ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

టీడీపీ హయాంలో ఎస్కే బైక్స్ అనే కంపెనీ నుంచి సైకిళ్ళు కొనుగోళ్లు చేశారు. కానీ ఆ కంపెనీ నుంచి కొనవద్దు అని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బ్లాక్ లిస్ట్ చేశాయట. కానీ కమీషన్ల కోసం నాసి రకం సైకిళ్ళు కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు గతంలో ఆ కంపెనీకి గుజరాత్‌లో కోర్టులు రూ.కోటి పెనాల్టీ వేసినట్లు చెబుతున్నారు.

This post was last modified on July 16, 2020 12:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీడియో : కొడుకుని తీసుకొని ఇంటికి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…

40 minutes ago

తమిళ ప్రేక్షకుల టేస్ట్ ఇదా?

ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…

47 minutes ago

రవితేజ-శ్రీలీల.. మళ్లీ ఫైరే

మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…

1 hour ago

ఫ్యాన్ మూమెంట్ : అన్న కాలర్ ఎగరేసిన తమ్ముడు

హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో…

2 hours ago

ఇంగ్లిష్ రాదని ట్రోలింగ్.. క్రికెటర్ కౌంటర్

పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు.…

3 hours ago

‘వైజయంతి’ మాట కోసం ‘అర్జున్’ యుద్ధం

https://www.youtube.com/watch?v=hFNCZ_oVOZ4 ఏడాదిన్నరగా కళ్యాణ్ రామ్ కు గ్యాప్ వచ్చేసింది. డెవిల్ తర్వాత ఆచితూచి అడుగులు వేస్తున్న ఈ నందమూరి హీరో…

4 hours ago