Political News

చంద్రబాబు బిగ్ స్టెప్… టీడీపీ ఎంపీలతో రాజీనామాలు?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, విపక్షాలు రెండూ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నాయి. ఒకరి వైఫల్యాలను మరొకరు ఫుల్లుగా ఓట్లుగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఆ క్రమంలోనే టీడీపీ అధినేత బిగ్ స్టెప్ వేస్తున్నట్లు సమాచారం. డిసెంబరు 7 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఢిల్లీలో ల్యాండయిన చంద్రబాబు రానున్న సమావేశాలను రాజకీయంగా వాడుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. 2019లో గెలిచినప్పటి నుంచి తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వైసీపీని… తనను, జనసేనను కలవకుండా ప్రయత్నిస్తున్న బీజేపీని ఒకేసారి ప్రజల ముందు దోషిగా నిలిపే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేయబోతున్నట్లు సమాచారం.

వైసీపీ చేతగానితనాన్ని, బీజేపీ దగాకోరుతనాన్ని రెండింటినీ ఒకేసారి ప్రజల ముందు పెట్టేలా టీడీపీ అధినేత తన ఎంపీలతో రాజీనామా చేయించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం లోక్ సభలో టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉండగా రాజ్యసభలో కనకమేడల రవీంద్ర కుమార్ ఒక్కరే ఉన్నారు. ఈ నలుగురితోనూ ప్రస్తుత సమావేశాల సమయంలో రాజీనామా చేయించనున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల అమలు కోసం చంద్రబాబు ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు ఎంపీలు కూడా సంసిద్ధత వ్యక్తంచేసినట్లు సమాచారం. అయితే… పార్లమెంటు సమావేశాల ప్రారంభంలోనూ రాజీనామాలు చేస్తారా… లేదంటే సమావేశాలు ముగిసే దశలో రాజీనామా చేస్తారా అనేది ఇంకా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను దారి మళ్లిస్తూ, దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని పార్లమెంటులో కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని.. అమరావతి ఇష్యూ కూడా పార్లమెంటులో ప్రస్తావించాలని టీడీపీ బలంగా అనుకుంటోంది. సో… ఇదంతా సక్సెస్‌ఫుల్‌గా చేసిన తరువాత రాజీనామా చేయాలనే యోచన కూడా ఉంది.

అంతేకాకుండా… కేంద్రం పిలుపు మేరకు జీ20 సన్నాహక సమావేశాలకు చంద్రబాబు హాజరవుతుండడంతో ఢిల్లీలో నరేంద్ర మోదీ, ఇతర బీజేపీ అగ్రనేతలు చంద్రబాబుతో ఎలా వ్యవహరిస్తారు.. ఒక వేళ భేటీలు ఉంటాయా.. వచ్చే ఎన్నికల విషయంలో బీజేపీ స్టాండ్ ఏంటనే అంచనాల ఆధారంగా ముందుకెళ్లే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.

This post was last modified on December 6, 2022 11:18 am

Share
Show comments
Published by
satya

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

5 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

6 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

10 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago