Political News

నువ్వా-నేనా.. నిలిచేదెవ‌రు.. గెలిచేదెవ‌రు?

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీలో పొలిటిక‌ల్ మ్యాచ్ జోరుగా సాగుతోంది. క్రికెట్‌లో సెమీస్ మాదిరిగా.. రాజ‌కీయంగా కూడా ఏపీలో సెమీస్‌లోకి అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు చేరిపోయాయి. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాదించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అధికార పార్టీ.. రెండు కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒక‌టి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను క‌లిసేలా.. నేత‌ల‌ను సీఎం జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో వారిని ఆదేశిస్తున్నారు కూడా.

ప్ర‌జ‌ల్లో ఉంటేనే టికెట్లు అని కూడా చెబుతున్నారు. దీంతో నాయ‌కులు భ‌క్తో.. భ‌య‌మో.. మొత్తంగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నా రు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు.. మొత్తం 175 స్థానాల‌కు 175 ద‌క్కించుకునే వ్యూహాన్ని కూడా జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. ఇది సాధ్య‌మా.. అసాధ్య‌మా.. అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌నలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ‘వైనాట్ 175’ అనే కార్య‌క్ర‌మానికి ఆయ‌న శ్రీకారం చుట్టారు. ఇది కూడా ప్ర‌జ‌ల్లోకి బాగానే చేరుతోంది.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా రెండు కీల‌క కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. ఒక‌టి బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను ఎలా పెంచిందో వివ‌రిస్తోంది. ప‌న్నుల మోత మొగిస్తూ.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం పీడించుకుతింటోంద‌నే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి టీడీపీ నాయ‌కులు తీసుకువెళ్తున్నారు. క‌రోనాతో రెండేళ్ల స‌మ‌యం వృథా అయినా.. త‌ర్వాతకాలం అంతా కూడా త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేలా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు.

ఇక‌, తాజాగా ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి అనే కీల‌క నినాదంతో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నారు. ప్ర‌జ‌ల నోటితోనే ఈ నినాదాన్ని అనిపిస్తున్నారు. ఇది కూడా స‌క్సెస్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీలోనూ జోష్ పెరిగింద‌నే చెప్పాలి. దీంతో ఈ రెండు పార్టీలు కూడా దాదాపు సెమీస్‌కు చేరుకున్న‌ట్టే అయింది. అయితే.. ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు నిలుస్తారు? అనేది మాత్రం ప్ర‌జ‌లు తేల్చాల్సి ఉంది. ఇక, నాయ‌కుల విష‌యానికి వ‌స్తే.. ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను కూడా బ‌ద్ద‌కిస్టులు.. చాలా మందే క‌నిపిస్తున్నారు. వారిని ఎలిమినేట్ చేస్తారా? లేక‌.. వారి ఆర్థిక‌, అంగ బ‌లాల‌ను బ‌ట్టి కొన‌సాగిస్తారా? అనేది చూడాలి.

This post was last modified on December 5, 2022 7:27 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

1 hour ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

3 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

3 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

4 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

6 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

7 hours ago