Political News

నువ్వా-నేనా.. నిలిచేదెవ‌రు.. గెలిచేదెవ‌రు?

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఏపీలో పొలిటిక‌ల్ మ్యాచ్ జోరుగా సాగుతోంది. క్రికెట్‌లో సెమీస్ మాదిరిగా.. రాజ‌కీయంగా కూడా ఏపీలో సెమీస్‌లోకి అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలు చేరిపోయాయి. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాదించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అధికార పార్టీ.. రెండు కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఒక‌టి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను క‌లిసేలా.. నేత‌ల‌ను సీఎం జ‌గ‌న్ ప్రోత్స‌హిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో వారిని ఆదేశిస్తున్నారు కూడా.

ప్ర‌జ‌ల్లో ఉంటేనే టికెట్లు అని కూడా చెబుతున్నారు. దీంతో నాయ‌కులు భ‌క్తో.. భ‌య‌మో.. మొత్తంగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నా రు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న అసంతృప్తిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు.. మొత్తం 175 స్థానాల‌కు 175 ద‌క్కించుకునే వ్యూహాన్ని కూడా జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నారు. ఇది సాధ్య‌మా.. అసాధ్య‌మా.. అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌నలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ‘వైనాట్ 175’ అనే కార్య‌క్ర‌మానికి ఆయ‌న శ్రీకారం చుట్టారు. ఇది కూడా ప్ర‌జ‌ల్లోకి బాగానే చేరుతోంది.

ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ కూడా రెండు కీల‌క కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లింది. ఒక‌టి బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌భుత్వం ధ‌ర‌ల‌ను ఎలా పెంచిందో వివ‌రిస్తోంది. ప‌న్నుల మోత మొగిస్తూ.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భుత్వం పీడించుకుతింటోంద‌నే భావ‌న‌ను ప్ర‌జ‌ల్లోకి టీడీపీ నాయ‌కులు తీసుకువెళ్తున్నారు. క‌రోనాతో రెండేళ్ల స‌మ‌యం వృథా అయినా.. త‌ర్వాతకాలం అంతా కూడా త‌మ‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించేలా చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు.

ఇక‌, తాజాగా ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి అనే కీల‌క నినాదంతో ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నారు. ప్ర‌జ‌ల నోటితోనే ఈ నినాదాన్ని అనిపిస్తున్నారు. ఇది కూడా స‌క్సెస్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీలోనూ జోష్ పెరిగింద‌నే చెప్పాలి. దీంతో ఈ రెండు పార్టీలు కూడా దాదాపు సెమీస్‌కు చేరుకున్న‌ట్టే అయింది. అయితే.. ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు నిలుస్తారు? అనేది మాత్రం ప్ర‌జ‌లు తేల్చాల్సి ఉంది. ఇక, నాయ‌కుల విష‌యానికి వ‌స్తే.. ఇటు టీడీపీలోను, అటు వైసీపీలోను కూడా బ‌ద్ద‌కిస్టులు.. చాలా మందే క‌నిపిస్తున్నారు. వారిని ఎలిమినేట్ చేస్తారా? లేక‌.. వారి ఆర్థిక‌, అంగ బ‌లాల‌ను బ‌ట్టి కొన‌సాగిస్తారా? అనేది చూడాలి.

This post was last modified on December 5, 2022 7:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

1 hour ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

5 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

6 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

7 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

8 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

8 hours ago