తాజాగా సుప్రీం కోర్టు ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ఘాటుగా నే వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలను, కేబినెట్లను కోర్టులే నిర్ణయిస్తే.. కోర్టులే నిర్దేశిస్తే.. ఇక, ఆయా ప్రభుత్వాలు ఎందుకు ? అని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది మూడు రాజధానులకు అనుమతి ఇచ్చినట్టేనా? వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు కలలు కంటున్న మూడు రాజధానులకు సుప్రీం పచ్చజెండా ఊపినట్టేనా? అంటే.. కాదని అంటున్నారు న్యాయనిపుణులు.
ఎందుకంటే..ప్రస్తుతం హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై మాత్రమే సుప్రీం కోర్టు విచారణ జరిపిందని అంటున్నారు. హైకోర్టు తన పరిధిని మాత్రమే దాటిందని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని వీరు చెబుతున్నారు. కానీ, ఇక్కడ దీనిని లోతుగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. అందుకే పూర్తిస్థాయి విచారణకు ఇంకా సమయం పడుతుందని.. జనవరి 13వ తేదీ వరకు దీనిని వాయిదా వేయడం వెనుక ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు.
అంతమాత్రాన వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనుకానీ, పూర్తి అనుమతులు కానీ, ఇచ్చేసినట్టు కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా.. ఇక్కడి రైతుల విషయాన్ని సానుకూల ధోరణిలో సుప్రీం చూసే అవకాశం ఉందని అంటున్నారు. రైతులు పచ్చటి పంటపొలాలను ఇచ్చినందున వారి అభిలాషను.. వారి ఆకాంక్షను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని చెబుతున్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా.. అనేది ప్రభుత్వ నిర్ణయమే అయినా.. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాల దృష్ట్యా సుప్రీం కోర్టు మూడు రాజధానులకు అనుకూలమైన తీర్పు ఇచ్చిన ట్టుగా భావించరాదని అభిప్రాయపడుతున్నారు. సో.. సుప్రీంతీర్పుతో వైసీపీ నాయకులకు ఊరట కలిగిందని చెప్పలేమని అంటున్నారు.
This post was last modified on November 28, 2022 2:19 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…