తాజాగా సుప్రీం కోర్టు ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుపై ఘాటుగా నే వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాలను, కేబినెట్లను కోర్టులే నిర్ణయిస్తే.. కోర్టులే నిర్దేశిస్తే.. ఇక, ఆయా ప్రభుత్వాలు ఎందుకు ? అని వ్యాఖ్యానించింది. అయితే.. ఇది మూడు రాజధానులకు అనుమతి ఇచ్చినట్టేనా? వైసీపీ అధినేత, ఆ పార్టీ నాయకులు కలలు కంటున్న మూడు రాజధానులకు సుప్రీం పచ్చజెండా ఊపినట్టేనా? అంటే.. కాదని అంటున్నారు న్యాయనిపుణులు.
ఎందుకంటే..ప్రస్తుతం హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై మాత్రమే సుప్రీం కోర్టు విచారణ జరిపిందని అంటున్నారు. హైకోర్టు తన పరిధిని మాత్రమే దాటిందని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని వీరు చెబుతున్నారు. కానీ, ఇక్కడ దీనిని లోతుగా పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నట్టు చెప్పారు. అందుకే పూర్తిస్థాయి విచారణకు ఇంకా సమయం పడుతుందని.. జనవరి 13వ తేదీ వరకు దీనిని వాయిదా వేయడం వెనుక ప్రధాన ఉద్దేశం కూడా ఇదేనని అంటున్నారు.
అంతమాత్రాన వైసీపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛనుకానీ, పూర్తి అనుమతులు కానీ, ఇచ్చేసినట్టు కాదని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా.. ఇక్కడి రైతుల విషయాన్ని సానుకూల ధోరణిలో సుప్రీం చూసే అవకాశం ఉందని అంటున్నారు. రైతులు పచ్చటి పంటపొలాలను ఇచ్చినందున వారి అభిలాషను.. వారి ఆకాంక్షను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని చెబుతున్నారు.
అమరావతి రాజధానిగా ఉండాలా వద్దా.. అనేది ప్రభుత్వ నిర్ణయమే అయినా.. భూములు ఇచ్చిన రైతుల ప్రయోజనాల దృష్ట్యా సుప్రీం కోర్టు మూడు రాజధానులకు అనుకూలమైన తీర్పు ఇచ్చిన ట్టుగా భావించరాదని అభిప్రాయపడుతున్నారు. సో.. సుప్రీంతీర్పుతో వైసీపీ నాయకులకు ఊరట కలిగిందని చెప్పలేమని అంటున్నారు.
This post was last modified on November 28, 2022 2:19 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…