Political News

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు షాక్..ఎందుకంటే

ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీగా చలామణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని మహబూబ్ బాషా కోరడం చర్చనీయాంశమైంది.

దీంతోపాటు, వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల కమిషన్ తో పాటు వైసీపీకి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను సెప్టంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.

వైఎస్సార్ అనే పదంతో చాలా ఏళ్ల క్రితం నమోదైన ఏకైక పార్టీ తనదేనని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని మహబూబ్ బాషా చెబుతున్నారు. వైకాపా అధికార పత్రాలపై యువజన శ్రామిక పార్టీ అని పూర్తి పేరు రాయడం లేదని, వైఎస్సార్ అని తమ పార్టీని ప్రతిబింబించేలా రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.

అయితే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్సార్ అని రాయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. రఘురామకృష్ణం రాజు ఇచ్చిన హింట్ తో మహబూబ్ బాషాకు మరింత దన్ను లభించినట్లయింది. అందుకే, మొదట ఈసీకి ఫిర్యాదు చేసిన మహబూబ్….ఆ తర్వాత ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఐడియాతో..చాలామందికి పరిచయం లేని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రపంచానికి తెలిసింది.

ఆ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా పేరు…ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తనకు ఇచ్చిన షోకాజు నోటీసురే రఘురామ కృష్ణం రాజు జవాబివ్వడం వల్లే ఈ గొడవ తెరపైకి వచ్చిందని, లేకుంటే ఆ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

This post was last modified on July 15, 2020 1:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

3 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

4 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

4 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

6 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

6 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

7 hours ago