ఏపీలో అధికార పార్టీ వైసీపీకి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా చలామణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి అన్నవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని మహబూబ్ బాషా కోరడం చర్చనీయాంశమైంది.
దీంతోపాటు, వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఎన్నికల కమిషన్ తో పాటు వైసీపీకి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను సెప్టంబరు 3వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
వైఎస్సార్ అనే పదంతో చాలా ఏళ్ల క్రితం నమోదైన ఏకైక పార్టీ తనదేనని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని మహబూబ్ బాషా చెబుతున్నారు. వైకాపా అధికార పత్రాలపై యువజన శ్రామిక పార్టీ అని పూర్తి పేరు రాయడం లేదని, వైఎస్సార్ అని తమ పార్టీని ప్రతిబింబించేలా రాయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.
అయితే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజుకు వైసీపీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో వైఎస్సార్ అని రాయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. రఘురామకృష్ణం రాజు ఇచ్చిన హింట్ తో మహబూబ్ బాషాకు మరింత దన్ను లభించినట్లయింది. అందుకే, మొదట ఈసీకి ఫిర్యాదు చేసిన మహబూబ్….ఆ తర్వాత ఏకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఐడియాతో..చాలామందికి పరిచయం లేని అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గురించి ప్రపంచానికి తెలిసింది.
ఆ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా పేరు…ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. తనకు ఇచ్చిన షోకాజు నోటీసురే రఘురామ కృష్ణం రాజు జవాబివ్వడం వల్లే ఈ గొడవ తెరపైకి వచ్చిందని, లేకుంటే ఆ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…