ఏపీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం.. టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమ ర్శలు చేశారు. గత మూడు రోజుల పాటు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, పత్తికొండ, ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాల్లో పర్యటించిన విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా అన్నారు.
అయితే, చంద్రబాబు నగరంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న వైసీపీ నాయకుడు, మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ నేతలకు రుచిచూపి స్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్లో పేరే ఉండదని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా పర్యటనలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే సగం మీసం తీయించుకుంటానని.. లేకపోతే బాబు సగం గడ్డం తీయించుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసిరారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని.. లోకేశ్కు కో- ఆప్షన్ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని.. గుండాయిజం అంటే ఏమిటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 19, 2022 10:25 pm
విదేశాలకు వెళ్లిన చాలామంది అక్కడి సిటిజన్షిప్ కోసం ఆరాటపడుతుంటారు. గ్రీన్ కార్డు కోసమో, పాస్పోర్ట్ కోసమో ఏళ్ల తరబడి ఎదురుచూస్తారు.…
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…