ఏపీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం.. టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమ ర్శలు చేశారు. గత మూడు రోజుల పాటు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, పత్తికొండ, ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాల్లో పర్యటించిన విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా అన్నారు.
అయితే, చంద్రబాబు నగరంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న వైసీపీ నాయకుడు, మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ నేతలకు రుచిచూపి స్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్లో పేరే ఉండదని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా పర్యటనలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే సగం మీసం తీయించుకుంటానని.. లేకపోతే బాబు సగం గడ్డం తీయించుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసిరారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని.. లోకేశ్కు కో- ఆప్షన్ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని.. గుండాయిజం అంటే ఏమిటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 19, 2022 10:25 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…