ఏపీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం.. టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమ ర్శలు చేశారు. గత మూడు రోజుల పాటు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, పత్తికొండ, ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాల్లో పర్యటించిన విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా అన్నారు.
అయితే, చంద్రబాబు నగరంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న వైసీపీ నాయకుడు, మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ నేతలకు రుచిచూపి స్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్లో పేరే ఉండదని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా పర్యటనలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే సగం మీసం తీయించుకుంటానని.. లేకపోతే బాబు సగం గడ్డం తీయించుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసిరారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని.. లోకేశ్కు కో- ఆప్షన్ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని.. గుండాయిజం అంటే ఏమిటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 19, 2022 10:25 pm
యానిమల్ సినిమాతో బాలీవుడ్ మేకర్స్ ని సైతం ముక్కున వేలేసుకునేలా చేశాడు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్…
దర్శకుడిగానే కాదు నిర్మాతగా కూడా తన అభిరుచి ఏంటన్నది ప్రేక్షకులకు తెలియచేస్తూ సుకుమార్ చేసే ప్రయత్నాలు తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్…
దేశ రాజధానిలో ఈరోజు భారత్ ట్యాక్సీ అడుగుపెట్టడంతో క్యాబ్ సర్వీసుల రంగంలో అలజడి మొదలైంది. ఇప్పటి వరకు ఓలా, ఉబేర్…
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…