ఏపీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన గుమ్మనూరు జయరాం.. టీడీపీ అధినేత చంద్రబాబు పై తీవ్ర విమ ర్శలు చేశారు. గత మూడు రోజుల పాటు చంద్రబాబు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల, పత్తికొండ, ఎమ్మిగనూరు వంటి నియోజకవర్గాల్లో పర్యటించిన విషయంతెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వైసీపీ విధానాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా అన్నారు.
అయితే, చంద్రబాబు నగరంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న వైసీపీ నాయకుడు, మంత్రి గుమ్మనూరు జయరాం తాజాగా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి హెచ్చరించారు. గూండాయిజం అంటే ఏంటో తెలుగుదేశం పార్టీ నేతలకు రుచిచూపి స్తామని అన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీచెయ్యలేరన్న ఆయన.. బ్యాలెట్ పేపర్లో పేరే ఉండదని వ్యాఖ్యానించారు.
కర్నూలు జిల్లా పర్యటనలో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలు నిజం అని నిరూపిస్తే సగం మీసం తీయించుకుంటానని.. లేకపోతే బాబు సగం గడ్డం తీయించుకోవాలని మంత్రి గుమ్మనూరు జయరాం సవాల్ విసిరారు. 2024 ఎన్నికల అనంతరం చంద్రబాబు వైసీపీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామని.. లోకేశ్కు కో- ఆప్షన్ పదవి ఇస్తామని ఎద్దేవా చేశారు. ఆరు నెలల్లో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామని.. గుండాయిజం అంటే ఏమిటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 19, 2022 10:25 pm
గ్యారెంటీ కామెడీ ఉంటుందని అల్లరి నరేష్ సినిమాలకు పేరు. కానీ గత కొన్నేళ్లుగా ఈ జానర్ కు ఆదరణ తగ్గడం,…
లోకనాయకుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కిన భారతీయుడు 2 విడుదల జూన్ 13 ఉంటుందని మీడియా మొత్తం…
ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డికేసులో తాజాగా సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ-8గా ఉన్న…
లోక్ సభ ఎన్నికలలో ఖచ్చితంగా ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. 2019…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఇప్పుడు ఇలాంటి పరిస్తితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న…
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…