Political News

జ‌గ‌న్ కుటుంబానికి కేంద్రం షాక్‌.. ఏం చేసిందంటే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. త‌న మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్న కీల‌క ట్ర‌స్టును కేంద్ర ప్ర‌బుత్వం ర‌ద్దు చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్ర‌స్టును విజ‌య‌మ్మ నిర్వ‌హిస్తున్నారు. ‘విజ‌య‌మ్మ చారిట‌బుల్ ట్ర‌స్టు’ పేరుతో నిర్వ‌హిస్తున్న దీని ద్వారా.. క‌డ‌ప‌లో పేద‌ల‌కు సాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్క‌డ ఏం చేస్తున్నార‌నేది మాత్రం తెలియాల్సి ఉంది.

అయితే.. ఈ ట్ర‌స్టును ర‌ద్దు చేస్తూ.. కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. దీనికి కార‌ణం ఏంటంటే.. విదేవీ సంస్థ‌ల నుంచి నిధులు సేక‌రిస్తున్నార‌ని, అయితే.. వీటికి లెక్క‌లు చెప్ప‌డం లేద‌నేది కేంద్ర హోం శాఖ వ‌ర్గాలు చెబుతున్న మాట‌. దీనికి సంబంధించి ట్ర‌స్టు చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్న విజ‌య‌మ్మ‌కు గ‌తంలోనే నోటీసులు పంపించారు. అయితే, ఆమె స్పించ‌క‌పోవ‌డంతో తాజాగా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

విదేశీ నిధుల నియంత్ర‌ణ చ‌ట్టం-2010 ప్ర‌కారం.. విజ‌య‌మ్మ చారిట‌బుల్ ట్ర‌స్టును ర‌ద్దు చేస్తున్న‌ట్టు కేంద్ర హోం శాఖ స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో మ‌రో 90 ట్ర‌స్టుల‌ను, ఏపీలో ఏకంగా.. 168 స్వ‌చ్ఛంద సంస్థ‌ల లైసెన్సుల‌ను కూడా కేంద్ర హోం శాఖ ర‌ద్దు చేయ‌డం గ‌మ‌నార్హం. వాస్తవానికి 2010 నాటి ఎఫ్ ఆర్ సీఎస్ చ‌ట్టం ప్ర‌కారం.. నిధులు సేక‌రించ‌డం త‌ప్పుకాక‌పోయినా.. వాటిని ఎలా ఖ‌ర్చు చేశారు? ఎంత వ‌చ్చింద‌నేది మాత్రం నివేదిక రూపంలో ఏటా కేంద్ర హోం శాఖ‌కు స‌మ‌ర్పించాలి.

ఈ విష‌యంలో విఫ‌ల‌మైన నేప‌థ్యంలోనే ఆయా ట్ర‌స్టుల‌ను కేంద్రం ర‌ద్దు చేసింది. కొన్ని రోజుల కింద‌ట కాంగ్రెస్‌కు చెందిన రాజీవ్ ట్ర‌స్టుల‌ను కూడా ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఏపీలో వైఎస్ జ‌గ‌న్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న మాతృమూర్తికి చెందిన సంస్థ‌పై కేంద్రం ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారితీసింది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

8 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

10 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

12 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

12 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

13 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

13 hours ago