ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఈ మధ్య అస్సలు టైం బాగాలేనట్లుంది. రెండు నెలల కిందట లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే అక్కడి గోపాలపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో చోటు చేసుకున్న స్టెరీన్ గ్యాస్ లీక్ ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొనడమే కాక.. వందల మందిని అస్వస్థుల్ని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వైజాగ్లో ఒకట్రెండు చిన్న ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సోమవారం రాత్రి విశాఖ నగరంలోని పరవాడ ఫార్మా సిటీలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
రాత్రి పదిన్నర ప్రాంతంలో అక్కడి రాంకీ ఫార్మా కంపెనీలో పెద్ద స్థాయిలో పేలుళ్లు జరిగాయి. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడి చుట్టు పక్కలప్రాంతాల్ని కమ్మేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని.. ఎవరి ప్రాణాలకూ ముప్పు వాటిల్లలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. గాయపడ్డ వారి ఫొటోలు కొన్ని ట్విట్టర్లో కనిపించాయి. వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో 80 దాకా ఫార్మా కంపెనీలు ఉన్నాయని సమాచారం. ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి వెళ్లడంలో ఇబ్బంది తలెత్తిందని.. మంటలు పక్క కంపెనీలకు వ్యాపిస్తాయేమో అని ఆందోళన నెలకొందని అంటున్నారు. కలెక్టర్ వినయ్ చంద్ అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సందీప్ కిషన్ హీరోగా నెట్ ఫ్లిక్స్ మొదటిసారి నిర్మించిన టాలీవుడ్ స్ట్రెయిట్ వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు' నిన్నటి నుంచి…
రాజమౌళి వారణాసి సినిమాలో రామాయణం బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన ఎపిసోడ్ పైనే అందరి ఫోకస్ ఎక్కువగా ఉంది. అయితే…
ప్రభాస్, ఇమాన్వి జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఫౌజీ విడుదల ఎప్పుడనేది తేలడం లేదు.…
రకరకాల తేదీలతో అభిమానులను తెగ అయోమయానికి గురి చేస్తున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు సెప్టెంబర్ 25 విడుదల కావడానికి రెడీ…
మానవ జీవన యానంలో ఎప్పటికప్పుడు కొత్త పోకడలు, కొంగొత్త మోసాలు, సభ్య సమాజాన్ని నివ్వెరపరిచే నయా వేధింపులు… ఇలా ఒక్కటేమిటి…
ఒక పాత్రకు ఒక ఆర్టిస్టు ఎంపికై.. ఆ తర్వాత ఇంకొకరి చేతికి మారడం ఫిలిం ఇండస్ట్రీలో మామూలే. చాలాసార్లు చిత్రీకరణకు…