ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నానికి ఈ మధ్య అస్సలు టైం బాగాలేనట్లుంది. రెండు నెలల కిందట లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే అక్కడి గోపాలపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ సంస్థలో చోటు చేసుకున్న స్టెరీన్ గ్యాస్ లీక్ ప్రమాదం 12 మంది ప్రాణాలను బలిగొనడమే కాక.. వందల మందిని అస్వస్థుల్ని చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వైజాగ్లో ఒకట్రెండు చిన్న ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా సోమవారం రాత్రి విశాఖ నగరంలోని పరవాడ ఫార్మా సిటీలో పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది.
రాత్రి పదిన్నర ప్రాంతంలో అక్కడి రాంకీ ఫార్మా కంపెనీలో పెద్ద స్థాయిలో పేలుళ్లు జరిగాయి. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడి చుట్టు పక్కలప్రాంతాల్ని కమ్మేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయని.. ఎవరి ప్రాణాలకూ ముప్పు వాటిల్లలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది. గాయపడ్డ వారి ఫొటోలు కొన్ని ట్విట్టర్లో కనిపించాయి. వారిని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ప్రాంతంలో 80 దాకా ఫార్మా కంపెనీలు ఉన్నాయని సమాచారం. ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి వెళ్లడంలో ఇబ్బంది తలెత్తిందని.. మంటలు పక్క కంపెనీలకు వ్యాపిస్తాయేమో అని ఆందోళన నెలకొందని అంటున్నారు. కలెక్టర్ వినయ్ చంద్ అప్రమత్తమై పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
This post was last modified on July 14, 2020 1:07 am
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…