కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్గా మారిన సంగతి సంగతి తెలిసిందే. ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఎదురు లేకుండా సాగపోతున్న వైకాపాకు ఈయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ మీదే కాక పలువురు వైకాపా నేతల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిని మరీ పూచికపుల్లలా తీసిపడేశారు. ఈ విమర్శలకు గాను షోకాజ్ నోటీసు ఇస్తే.. దాని మీదా కౌంటర్లతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారాయన. కాస్త ముందో వెనుకో ఆయన వైకాపాకు గుడ్ బై చెప్పడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.
సొంత పార్టీ మీద విమర్శల జోరు కొంచెం తగ్గించిన రఘురామ కృష్ణంరాజు.. తాజాగా ప్రతి పక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ అత్యంత నిజాయితీ పరుడని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే.. ఏపీ ఐదేళ్ల వ్యవధిలోనే ఇండియాలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందని రఘురామ అన్నారు.
అంతే కాక.. పవన్ లాంటి నిజాయితీ పరుడిని ఓడించిన ప్రజలకు న్యాయం మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్కు రఘురామ ఇచ్చిన ఈ ఎలివేషన్లు జనసైనికులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఐతే వైకాపాను వీడి భాజపాలో చేరేలా కనిపిస్తున్న రఘురామ.. ఆ పార్టీతో కలిసి సాగుతున్న జనసేన అధినేతను పొగడ్డంలో ఆశ్చర్యమేముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on July 14, 2020 9:37 am
దేశరాజధాని ఢిల్లీలో సోమవారం చోటు చేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా అనేక వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అందరి టార్గెట్ ఒక్కటే..…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించాయి. ఆయన వ్యవహరిస్తున్న తీరును పలువురు కేంద్ర మంత్రులు కొనియాడారు.…
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. 2024లో పార్టీ పగ్గాలు చేపట్టిన షర్మిలపై…
ప్రేమలు సినిమాతో మమిత బైజు అనే అమ్మాయి ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అప్పటికే మలయాళంలో కొన్ని సినిమాల్లో నటించినా..…
పెళ్లి చేసుకున్నాక అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన ఉదంతాలను ఇటీవల బోలెడు చూశాం. అలాగే ఇష్టం…
ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో వస్తున్న 'ఫౌజీ' సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. 1940ల…