Political News

రఘురామ కృష్ణంరాజు మాట.. పవన్ కళ్యాణ్ సీఎం అయితే

కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్‌గా మారిన సంగతి సంగతి తెలిసిందే. ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఎదురు లేకుండా సాగపోతున్న వైకాపాకు ఈయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ మీదే కాక పలువురు వైకాపా నేతల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిని మరీ పూచికపుల్లలా తీసిపడేశారు. ఈ విమర్శలకు గాను షోకాజ్ నోటీసు ఇస్తే.. దాని మీదా కౌంటర్లతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారాయన. కాస్త ముందో వెనుకో ఆయన వైకాపాకు గుడ్ బై చెప్పడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.

సొంత పార్టీ మీద విమర్శల జోరు కొంచెం తగ్గించిన రఘురామ కృష్ణంరాజు.. తాజాగా ప్రతి పక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ అత్యంత నిజాయితీ పరుడని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే.. ఏపీ ఐదేళ్ల వ్యవధిలోనే ఇండియాలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందని రఘురామ అన్నారు.

అంతే కాక.. పవన్ లాంటి నిజాయితీ పరుడిని ఓడించిన ప్రజలకు న్యాయం మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్‌కు రఘురామ ఇచ్చిన ఈ ఎలివేషన్లు జనసైనికులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఐతే వైకాపాను వీడి భాజపాలో చేరేలా కనిపిస్తున్న రఘురామ.. ఆ పార్టీతో కలిసి సాగుతున్న జనసేన అధినేతను పొగడ్డంలో ఆశ్చర్యమేముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

This post was last modified on July 14, 2020 9:37 am

Share
Show comments
Published by
suman

Recent Posts

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

2 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

2 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

2 hours ago

మెస్సీతో ఫోటో కోసం ఎంతమంది 10 లక్షలు ఇచ్చారో తెలుసా?

దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…

3 hours ago

బాలయ్య బోణీ బాగుంది… అసలు సవాల్ ముందుంది

మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…

3 hours ago

తమ్ముడు పవన్ కు దారిచ్చిన అన్న బాలయ్య

ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…

4 hours ago