కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్గా మారిన సంగతి సంగతి తెలిసిందే. ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఎదురు లేకుండా సాగపోతున్న వైకాపాకు ఈయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ మీదే కాక పలువురు వైకాపా నేతల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిని మరీ పూచికపుల్లలా తీసిపడేశారు. ఈ విమర్శలకు గాను షోకాజ్ నోటీసు ఇస్తే.. దాని మీదా కౌంటర్లతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారాయన. కాస్త ముందో వెనుకో ఆయన వైకాపాకు గుడ్ బై చెప్పడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.
సొంత పార్టీ మీద విమర్శల జోరు కొంచెం తగ్గించిన రఘురామ కృష్ణంరాజు.. తాజాగా ప్రతి పక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ అత్యంత నిజాయితీ పరుడని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే.. ఏపీ ఐదేళ్ల వ్యవధిలోనే ఇండియాలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందని రఘురామ అన్నారు.
అంతే కాక.. పవన్ లాంటి నిజాయితీ పరుడిని ఓడించిన ప్రజలకు న్యాయం మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్కు రఘురామ ఇచ్చిన ఈ ఎలివేషన్లు జనసైనికులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఐతే వైకాపాను వీడి భాజపాలో చేరేలా కనిపిస్తున్న రఘురామ.. ఆ పార్టీతో కలిసి సాగుతున్న జనసేన అధినేతను పొగడ్డంలో ఆశ్చర్యమేముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
This post was last modified on July 14, 2020 9:37 am
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…
న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…
ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…