Political News

రఘురామ కృష్ణంరాజు మాట.. పవన్ కళ్యాణ్ సీఎం అయితే

కొన్ని వారాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు హాట్ టాపిక్‌గా మారిన సంగతి సంగతి తెలిసిందే. ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఎదురు లేకుండా సాగపోతున్న వైకాపాకు ఈయన కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. పార్టీ అధినేత జగన్ మీదే కాక పలువురు వైకాపా నేతల మీద ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరిని మరీ పూచికపుల్లలా తీసిపడేశారు. ఈ విమర్శలకు గాను షోకాజ్ నోటీసు ఇస్తే.. దాని మీదా కౌంటర్లతో జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచారాయన. కాస్త ముందో వెనుకో ఆయన వైకాపాకు గుడ్ బై చెప్పడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.

సొంత పార్టీ మీద విమర్శల జోరు కొంచెం తగ్గించిన రఘురామ కృష్ణంరాజు.. తాజాగా ప్రతి పక్ష పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ మీద ప్రశంసలు కురిపించారు. పవన్ కళ్యాణ్ అత్యంత నిజాయితీ పరుడని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే.. ఏపీ ఐదేళ్ల వ్యవధిలోనే ఇండియాలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా అవతరిస్తుందని రఘురామ అన్నారు.

అంతే కాక.. పవన్ లాంటి నిజాయితీ పరుడిని ఓడించిన ప్రజలకు న్యాయం మాట్లాడే హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. పవన్‌కు రఘురామ ఇచ్చిన ఈ ఎలివేషన్లు జనసైనికులకు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఐతే వైకాపాను వీడి భాజపాలో చేరేలా కనిపిస్తున్న రఘురామ.. ఆ పార్టీతో కలిసి సాగుతున్న జనసేన అధినేతను పొగడ్డంలో ఆశ్చర్యమేముందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

This post was last modified on July 14, 2020 9:37 am

Share
Show comments
Published by
suman

Recent Posts

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

3 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

4 hours ago

ఇండియా vs పాక్ : టికెట్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయంటే…

ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2025 ఛాంపియన్స్…

4 hours ago

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

5 hours ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

6 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

6 hours ago